Tuesday, August 4, 2009

ఏడు కొండలవాడా వెంకటరమణ బంగారం గోవింద గోవింద?

ఇవ్వాళ హిందూ దిన పత్రిక లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వారి ఆదేశం - తీ తీ దే వారికి - స్వామీ వారి బంగారం లిస్టు సమర్పించందహోయీ అన్న వార్త చదివాక - అందులోని ముఖ్య అంశం గా ఈ బంగారు నగలు లాకర్ లో సింగెల్ కీ సిస్టం ద్వారా ఉన్నట్టు వినికిడి. అంటే ఆ ఒక వ్యక్తి పరం లో ఉన్న నగలకి గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది! సాదా సీదా బ్యాంకు లాకర్ లకే రెండు కీ లతో ఆపరేట్ చేస్తారు ! ఇంక కోటానుకోట్ల విలువ గల స్వామీ బంగారు నగల బాగోతం ఒక్క మనిషి ద్వారా నిర్వహణ అంటే ఇది నిజం గా ఆశ్చర్యం అని పిస్తోంది ఇప్పటిదాకా ఎలాంటి కుంభకోణాలు లేకుంటే ! మనిషన్నాక సందేహం మొదట్లోనే ఉంటుంది కదదండి మరి! అయిన తీ తీ దే వారు ఇన్ని సంవత్సరాల బట్టి ఈ విషయాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ? ఈ లాంటి సందేహాలకి తావు ఇవ్వడం సబబేనా? ప్రజల బంగారం (అంతా స్వామీ వారిదే అనుకోండి) ఇట్లా స్వామీ వారికి వారి వారి మొక్కులతో ఇవ్వ బడ్డ బంగారం నిజం గా స్వామీ వారి దగ్గిరే అంటే తీ తీ దే వారి దగ్గిరే ఉందా?????? లేకుంటే ------ అంతా విష్ణు మాయ కాకుంటే కలికాలం మహిమ అనుకోవాలి!

ఈ టపాలు కి ఈ క్రింద ఇవ్వ బడ్డ హిందూ వారి వార్త చదివాక వచ్చిన నా సందేహాలు అప్రతిహమగు గాక!

http://www.hindu.com/2009/08/04/stories/2009080455500100.htm

జిలేబి

3 comments:

  1. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో ఏమోగానీ ఆరోపణ చేయబడ్డవారికే పదవీ విరమణ అయినా పిలిచి పిలిచి మళ్ళీ పదవులిచ్చి గౌరవిస్తూ ఉంటారు.హేమిటో ఈ కృష్ణమాయ...

    ReplyDelete
  2. :)

    అన్ని సార్లు విమానానికి బంగారం పూత ఎందుకు పూశారు?
    ఎంత విమానంలోకి వెళ్లిందో, ఎంత విమానం పైకి వెళ్లిందో

    ReplyDelete
  3. లోగుట్టు పెరుమాళ్ళకెరుక .

    ReplyDelete