Monday, December 28, 2009

Sunday, December 27, 2009

లంగా రవిక కోక

తే నా లంగా అని తెలంగాణా లాగేసు కుంటే
కోక నాది అని కోన సీమ కోరితే
రవిక నాదని రాయలసీమ రాద్ధాంతం చేస్తే-
తెలుగు తల్లి నగ్న నాదం బిక్కు మొహం పెట్టి చూస్తోంటే-
సందులో సడేమియా అని మా తాత గారి సూదిలో దారం
"జ్యోతి" లా ప్రజ్వరిల్లుతూంటే-
ఆంద్ర దేశమా - ఇది కలికాలం సుమా!
నీ కేట్లాంటి కష్టాలు వచ్చేయి తెలుగు తల్లీ
ఓపిక పట్టు- కష్టాలు తొలగి పోయే రోజులు వస్తాయని

జిలేబి.

Saturday, December 19, 2009

మా పూరిల్లు మార్పులు చేర్పులు

అభివృద్ధి అన్నది ఎట్లా వస్తుంది? ఉన్నదానిని పడగొడితే దాని స్థానం లో పెద్ద భవంతి ని కట్టొచ్చు. ఉదాహరణకి మా ఇల్లు చాల పాత ఇల్లు. దీన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లతో ఇంకా ఓ నలభై లేక యాభై సంవత్సరాలు లాగించ వచ్చు. కాకపొతే ఖర్చులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి - సంవత్సరానికో మారు జై తెలంగాణా అన్నట్టు. కాకుంటే ప్రతి ఐదు సంవత్సరాలకో మారు ఎన్నికలన్నట్టు. దానికి విరుద్ధం గా మన్నికగా మా ఇల్లు గట్టి గా ఇంకో వంద సంవత్సరాలు నిలబడాలంటే ఇంటిని నేల మట్టం చేసి కొత్త గా కడితే (మేస్త్రి లు కరెక్ట్ గా కడితే- సున్నం సిమెంటు మన్నికవైతే లాంటి నిబంధనలకి లోబడి) సాధించవచ్చు.

కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న ప్రస్తుత పరిస్థితి మా పూర్ ఇల్లు లానే ఉంది. దీనికి సమాధానం కొత్త ఇల్లా లేక సర్దుబాట్లతో ఇంటిని రిపైర్ చెయ్యడమా లాంటిది.

జిలేబి ఇంత సింపుల్ కాదు ఈ విషయం అంటారా- మా ఇంట్లో అమ్మదే పై చేయి. ఆమె ఎట్లా చెబితే అలానే నడుచు కోవాలి. మా అయ్య కి బొక్కసం నింపడం ఎట్లా గో తెలుసు కాని ఇంటిని నిలబెట్టడం విషయం లో పరిజ్ఞానం తక్కువ. కాకుంటే మా అయ్య వీధి లోని రామయ్యలన్దరితోనూ కూర్చొని గంటల తరబడి హరిత సమస్యల గురించి, ప్రపంచదేశాల సమస్యల గురించి అనర్గళం గా సంభాషించ గలడు- అంత మాత్రమే మా అయ్య సత్తా.

చీర్స్
జిలేబి.

నగరం లో సర్కస్!

ఫ్లైట్ నుంచి దిగబడి హమ్మయ్య మా భారత భూమి పై కాలు మోపాను అని సంతోషం పడి పోవడం ప్రతి భారత ప్రవాసి కి ఓ పిచ్చి ఆనందం ! ఆ ఆనందం ఓ రెండు మూడు రోజులలో హుష్ కాకి ఐపోయి "మా దేశం లో ఇట్లా - ఇక్కడ ఇట్లాంటి కంపరిసన్ కి దిగి పోవడం సర్వ సాధారణం!

అట్లాంటి బడుగు మధ్యతరగతి భారత ప్రవాసి మహానగర సందర్శనార్థం బయలు దేరడమునను ఆ హా మా దేశం ఏమి ఉన్నతి చెందింది- "ఇండియా షైనింగ్ " అంటే ఇదే కామోసు అన్న అధ్బుతమైన ఆలోచనతో సరే ఈ ఊరి బస్సు కూడా ఎక్కి చూసేద్దాం అన్న ఆలోచనకి వచ్చి బస్సు ఎక్కడమున్ను ఆ పై బస్సులో ఒఊపిరి ఆడక ( ఆ పాటి ఓ రోజుకే అల ముహం వేలాడ దీసుకుంటే ఎలా మరి- ఇదే దేశం లో ఈ కార్యక్రమం రోజువారి జరుగుతోందే మరి?) ఎందుకొచ్చిన నగర సందర్శనం రా బాబు అనుకోవడమూ కద్దు!

కాని ఈ మారు గమనించిన దానిలో విశేషం బెట్టి దంటే- నగరం లో దుకానులు కలర్ ఫుల్ గా ఐయిపోయీయి! బస్సులు ట్రాఫ్ఫిక్ అట్లాగే మరీ ఎక్కువై పోయేయి. అంటే దరిమిలా దేశానికి ఎ ఇన్ఫ్రా స్త్రక్తుర్ అన్నది ఎట్లా వస్తుందో తెలియకుండా పోయింది.

బస్సులలో చెవులకి ఎఅర్ ఫోన్ లు ఉన్నాయి. చేతుల్లో ఐపాడ్ ఉన్నాయి. జనాల చేతుల్లో తినడానికి జుంక్ ఫుడ్ బోల్డంత ఉంది. కాని రోజువారి ప్రయాణం లో పదనిసలు ఎప్పుడు సరిగమలు పాదతాయో ?


ఇది ఎ ఒక్క మహానగర దుర్భాగ్యం మాత్రం కాదనుకుంటా? అన్ని మహా నగరాల పరిస్థితి ఇంచు మించు ఇట్లా గే ఉన్నది. జనత సౌకర్యం గా పయనం చెయ్యలేక ప్రైవేటు వాహనాలు రోడ్ల పై ఎక్కువై అవి ఇంటి వటుడింతై అన్నట్టు గా ఇటు రోడ్ ని అటు ఫుట్ పాత్ లని అధిగమిస్తూ సర్కస్ చేస్తూ పోతూంటే- ఓ భారత దేశమా - ప్రగతి కి నిర్వచనం ఎక్కడ ఉన్నది?

జన ప్రభంజనం లో మహా ప్రవాహ వాహినిలో కొట్టుకు పోతున్న దేశమా - కాస్త నిలిచి జనాలకి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలని అనుకుంటున్నావో ఓ మారు ఆలోచించు అని అనుకోకుండా మానుకోడు సామాన్య మానవుడు!

అయినా దేశం ఇట్లాంటి సమస్యల ప్రవాహాన్ని పట్టించుకోదు! పట్టించు కావలసినవి చాల ఉన్నాయి- ఉదాహరణకి రాష్ట్ర విభజన లాంటి నిఖార్సైన విషయాలు!

మీరేమంటారు? తెలుసు లెండి సామాన్య మానవులం మరి- ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటే- మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి చూసీ చూడకుండా వెళ్లి పోవడం మన ఆరోగ్యానికి క్షేమ కరం!

జిలేబి.

Friday, December 18, 2009

"వరదరాజ గుడి- భూమాత బడి "

చిత్తూరు నీవా నది తీర ప్రాంతంలో విరాజిల్లిన గుడి శ్రీ వరదరాజస్వామి గుడి. ఈ గుడి కి వెళ్ళడానికి నీవా నదిని దాటి వెళ్ళాలి. పూర్వ కాలం లో నది నీళ్ళతో నిండి ఉంటె నదిని దాటి ఈ గుడికి వెళ్ళడం ఒక పెద్ద విషయం. ఆ తరువాయి దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వస్తే చిత్తూరు నీవా నదికి నీళ్ళు పోయేయి. నీవా నది లో చిత్తూరు లో కాలుష్యం అన్ని నదుల్లా దీనికి పట్టింది. కాలుష్యం తో బాటు చిత్తూరు నాయుడు గారి "సురాపానం" (అదేనండి మదిరం- లికర్ అంటారు అట ఆంగ్లం లో ఐతే) కార్ఖానా "పుణ్యమా" అని నదిలో "సురాపానం" కాలువై ప్రవహించింది. ఆ కాలంలో దగ్గిరి వీధిలోని నీళ్ళు "మత్తు" గా గమ్మత్తు గా పసుపు కలర్ తో జనాలకి ఓ కిక్ ఇచ్చింది! నది బెడ్ చేరబడింది - ఆ మధ్యలో ఈ నాయుడు గారు సాయిబాబా గారి నీటి పధకానికి కొట్లిచ్చారని వినికిడి. పర్సనల్ కాలుష్య నివారణార్థం కామోసు అనుకున్నాను ! ఈ నది కాలువని - సురా కాలువ సువాసలని భరించలేక చాలామంది ఈ గుడి కి వెళ్ళడం మానుకున్నారు కూడా. ఆ పై ఆ గుడి దొంగల బడి అయ్యింది. అప్పుడప్పుడు మంచి ఎండలో ధైర్యం చేసి ఆ కాలపు కుర్రాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు ! ఆ తరువాయి ఎవరో పుణ్యమా అని మళ్ళీ గుడి లో దీపం కొన్ని రోజులు వెలిగింది.

ఇవన్ని ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే- ఈ పై కహానికి కోపెన్ హగెన్ సభలకి సామరస్యం ఉంది కాబట్టి. భూప్రపంచాల కాలుష్యం నివారించడానికి ౧౯౨ దేశాలు సమావేశమై తమకు తామే పాడుచేసుకున్న గుడిని మళ్ళీ నిలబెట్ట తామోచ్ అని వాక్రుచ్చి హాట్ తోపిక్ తో కిందా మీదా పడుతున్నాయి- మా నాయుడు గారు సాయిబాబా గారి నీటి పథకానికి డబ్బిచ్చినట్టు గా ( ఆ మాత్రమైన ఇచ్చాడు గా అన్నది మరో వాదన - అదీ ఇవ్వకుంటే ఏమయి ఉండేది చిత్తూరోల్ల నీటి కష్టాలు ?)

నదులకి నీళ్ళు లేవు. జనాలకి నదులే ఇల్లులు కట్టుకోదాని స్థలాలు అయి పోయేయి.
నదులలో నీళ్ళు లేవు. నది మట్టి ఇల్లులు కట్టుకోడానికి రాష్ట్రేతర రావాన అయి పోతోంది
నదీనాం సాగారో గచ్చతి అన్నది ఆ నాటి వాక్కు!
నదీనాం రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాకెట్ మనీ గాచ్చాసి అన్నది నేటి వాక్కు
నదీనాం న ప్రవహంతి - నదీనాం న జీవసి అన్నది రేపటి వాక్కు !

అంతా విష్ణు మాయ కలికాలం ప్రభావం ! మాయ తేరా దిగితే - మనిషి ఆకస హర్మ్యాల నుండి భూమ్మి మీద కి రావటం - ఓ త్సునామి క్షణం అంత సేపు !

జిలేబి.

Saturday, December 12, 2009

మొర మొరాలు బొరుగులు కూనలమ్మ పదాలు

చిత్తూరులో ఓ ముసల్మాను - పతాను బొరుగులు అమ్మే వాడు. "మొర మోరా" అన్నది అతని కేక !

మొదట్లో సైకిల్ లో వచ్చేవాడాయన - ఆ పై ఓ ఓల్డ్ టీవీఎస్ ఫిఫ్టీ లో వచ్చి బొరుగులు అమ్మేవాడు.
అతని కంఠం వీధి చివర్లో అరిస్తే ఆ వీధి మొనలో వినబడేది ! ఈ మానవుడి గురించి చిత్తూరబ్బాయీ ఒకతను సుమన్ కుమార్ అనే అతను, తన కథలో ఓ క్యారెక్టర్ గా కూడా చిత్రించిడం జరిగింది.

ఇప్పుడు ఈ మొర మొర ప్రసక్తి ఎందుకు అంటే -

ఈ రెండు రోజులలో ఆంద్ర రాజ్యం లో "మొర మొర" లు ఎక్కువై పోయేయి. అంటే బొరుగులన్న మాట . గాలి ఎటు వీస్తే బొరుగులు ఆ వైపు ఎగిరి పోతాయి. ఇప్పడు ఆంధ్ర దేశం లో ఏ బొరుగులు ఎక్కడ తేలతాయో కూడా తెలియడం లేదు.

ఈ "తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది" అన్న పాట ఎంతదాకా సరి అన్నది తెలియడం లేదు!

దేశ విభజన , రాజ్యాల విభజన రాష్ట్రాల విభజన - "విభజించు పాలించు" అన్న సూత్ర మునకు కట్టు బడి ఉన్నామా లేక ఇంకా భారతీయులు గా ఉన్నామా ?

అంతా చిదంబర చిద్వాలాసం అనుకోవాలా లేక ఇది మూక సైకాలజీ మీద "మాతా హరి" రాజకీయ నాటక రచనా పరిహాసమా?

అవురా నలుగురు నవ్వి పో దురు గాని నాకేటి సిగ్గు? కూనలమ్మ పదాలే రాజ్య భవితవ్యం!

రాష్ట్రమంతివర్గం చేవ లేకుండా సత్తా లేకుండా ఉంటే - రాజన్నవాడు నిఖార్సుగా ఉండక పొతే - ఆ దేశ రాజ్య పరిస్థితి నడి సముద్రం లో నావ!

దాని దిక్కు కి సూచికా లేదు- దాని మనుగడకి భరోసా నూ లేదు. !

అంతా విష్ణు మాయ కాకుంటే మరే మంటారు?

చీర్స్
జిలేబి.