Friday, August 6, 2010

సనాతన ధర్మ ఉద్దీపకుడు క్రీస్తు ప్రభువు

ఈ మధ్య మా బాబాయి అబ్బాయి స్కూల్లో "బ్రిటిష్ వాళ్ళు ఇండియా కి రాకుండా ఉంటె ప్రస్తుతం మన భారత దేశం ఎట్లా ఉండేది ?" అన్న దాని మీద వక్తృత్వ పోటి పెట్టటం - ఆ టాపిక్ పై ఆలోచిస్తే - బ్రిటిష్ వాడు రాకుండా ఉంటె భారత దేశం లో హిందూ ధర్మ నిలిచి ఉండేదా అని సందేహం కలిగింది.

ఎందు కంటే పక్క దేశాలైన మలేసియా ఇండోనేసియా లాంటి దేశాల్ని చూస్తె - బ్రిటిష్ వాడి రాక మునుపు దేశం ఇస్లాం వైపు మొగ్గు వేస్తూన్నట్టు గా కనిపిస్తుంది. ముసల్మాను రాజుల దండ యాత్రలు - ఆ పై మన దక్షిణ భారత దేశం లో కూడా శ్రీ కృష్ణ దేవరాయల సంతతి తిరోగతి - సుల్తానుల ప్రాబల్యం ఎక్కువవుతున్న కాలం లో - ఆ సమయం లో బ్రిటిష్, వాడు ఇండియా కి రావడం = వాడి తో బాటు వాడి సంస్కృతి, మతం - ఇండియా కి రావడం - ఓ లాంటి చెక్ పాయింట్ అయ్యింది - ఇస్లాం ఇంకా తీక్షణం భారత దేశం లో ప్రాబల్యం కాకుండా ఉండడానికి - వీడే రాకుండా ఉంటె - సుల్తానుల ప్రాబల్యం తో భారత దేశం - ఓ మోస్తరు ప్రస్తుతం ఇస్లామిక్ దేశం గా ప్రస్తుతం ఉండేదేమో? -

ఇది ఊహా చిత్రం కాబట్టి - వాదనలకి చాల తావుంది ఈ చిత్రం లో - మీ అభిప్రాయలు - భిన్న అభిప్రాయాలు - కచ్చితం గా ఈ విషయం పై ఉంటాయీ.

గీత లో శ్రీ కృష్ణ భగవానుడు - యదా యదాహి ధర్మ స్య గ్లానిర్భవతి భారతా- తానూ మళ్ళీ మళ్ళీ వస్తానంటాడు. అంటే బ్రిటిష్ వాడి రాక దీన్ని సూచిస్తుందా? - క్రీస్తు మతం - ఇండియా కి రావడం - దీన్ని సూచిస్తుందా? -

ఆలోచనలకి మంచి పదును పెట్టె విషయం ఇది. అఆలోచించి చూడండి- భారతం - సంగమం - వివిధ మతాల సమ్మేళనం - ఆ నాటి భుద్దుడి సమయం నించి చూస్తె భౌద్ధం , జైనం, ఇస్లాం - ఈ నాటి బాబాలు , స్వాములు - గురువులు యోగుల దాక భారత దేశం లో మతం మీద జరిగినంత వెరైటీ ఎక్స్ పెరి మెంట్స్ ఇంకా ఎ దేశంలో కూడా జరిగి ఉండదు. -

ఈ లాంటి సంక్లిష్ట వాతావరణం లో సనాతన ధర్మ పద్దతి - ఇంకా కోన సాగుతూనే ఉంది- కారణం ఏమంటారు? -

మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్భందాలు లేకుండా- వ్యక్తీ స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు ఉంచుతుంది.

సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది. మీరేమంటారు?

చీర్స్
జిలేబి.

3 comments:

  1. //సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది. మీరేమంటారు?//

    ఇంకేమంటానూ? ఒట్టి వైశాల్యమే కాదు ఘనపరిమాణము కూడా అంటాను.

    బ్రిటీషు వాళ్ళు వచ్చాక ఔరంగజేబు, జేబు లో చేతులుంచుకుని ఔరా అని మిన్నకుండిపోయాడని అతని కాపేరు రావడానికి కారణం కూడా అదే అయ్యుంటుందని ఏదో బ్లాగులో చదివాను. అయ్యుండచ్చు , చెప్పలేము.

    Well said, keep posting such interesting and thought provoking information.

    ReplyDelete
  2. ఇది ఊహా చిత్రం కాబట్టి -

    కాదు, దాదాపు ౭౦% ముస్లీములు ఔరంగజేబు సమయంలో హిందూ మతం నుంచి బలవంతాన, లేక సుల్తాను ప్రాపకం కోసం మతం మార్చుకున్న వారే, కాబట్టి మీరు చెప్పినది సబబే

    ReplyDelete
  3. ఇది ధర్మం మతం కాదు . మతం ఒకరులేక కొద్దిమంది అభిప్రాయం కావచ్చు. ధర్మం సనాతనం శాశ్వతం,సత్యం , ఇందులో మార్పురాదు.
    కనుకనే ప్రపంచాన మహాత్ములంతా సత్యం ఆధారంగా తమ అవిర్భావకార్యక్రమాలను నిర్వర్తించారు. క్రీస్తు,మహమ్మదులవంటి మహాత్ముల పుట్టుకను గూర్చి ఆతరువాత పరిణామాలేకాదు ,ఇప్పుడు జరుగుతున్న జరగబోతున్న విషయాలను కూడా ముందుగానే చెప్పారు ఈ సత్యమార్గాన పయనించిన ద్రష్టలగు ఋషులు . కనుక ఒక తాకిడులుకాదు వంద తుఫానులూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేసత్యాన్ని మార్చలేనట్లే ఈధర్మాన్ని ఎవరూ నశింపజేయలేరు ,ఉద్ధరించనూ లేరు ధర్మమే సృష్టిని రక్షిస్తుంది, ఉద్దరిస్తుంది . ఇది సత్యం..సత్యం..పున:సత్యం

    ReplyDelete