Monday, October 4, 2010

షష్టి పూర్తి ఐతే చాలా ? తాతగారి కి శతాభిషేకం అవ్వాలి కదా?

మారుతీయం గారి సమస్యకి షష్టి పూర్తి చదివితే నవ్వొచ్చింది.

మా ఇంట్లో తాతగారి కి షష్టి పూర్తి ఐతే అందరం సంతోషపడి - తాతగారి శతాభిషేకం ఇంకా ఘనం గా జరపాలని - ఆ పై ఆయన ఇంకా వంద సంవత్సరాల పై బడి మాతో ఉండాలని చాలా చాలా అభిప్రాలయాలని ఆశలని తెలియబరచాం.
ఆ పాటి ఆశ, మా ఈ 'తాత' గారి సమస్య కి కూడ మేం పెట్టుకోవాలి కదా మరి?

కనీసం శతాభిషేకం అయినా కావాల్సిందే.

కాకుంటే - రెండు జమానాల జనానికి నౌకరి కల్పించిన మా తాత గారు - మరో ఒక జమానా కైనా కనీసం నౌకరి పోషించవలె కదా మరి?

కాకుంటే మా కోర్టులు వట్టి పోవూ? అక్కడ పని చేసే వాళ్ళ గతి ఏమి గాను?

పేపర్ల వేల కొద్దిగా తీర్పులు రాయ వలసిన మా జడ్జీల నౌకరి ఏమి గాను?

వారి టైపిస్ట్ ల ఉద్యోగాలు ఏమి గాను?

వారి పెళ్ళాం పిల్లల జీవిత బాగోగులని కోరి - మా తాత గారి శతాభిషేకం కనీసం గా వించ వలసినది గా
అందిరికి విజ్ఞప్తి!

పుర జనులార - ఈ దేశం లో ఆల్రెడీ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. ఇంకా నిరుద్యోగాన్ని పెంచకండి! (నిరుద్యోగి గా ఉంటె పర్లేదు- ఉద్యోగి గా ఉండే వాడు నిరుద్యోగి ఐతే - అదీ కోర్టు వాళ్ళు నిరుద్యోగులైతే - మీ మా జన జీవనానికి కీడే గా ని మేలు గాదని నా ప్రగాఢ విశ్వాసం! - దార్న పోయే వాణ్ని పిలిచి చంకన వేసుకున్న సామెత ఉండనే ఉన్నది. వాళ్ళ మానాన వాళ్ళు - ఎవరికీ అర్థం కాని గీతాల్ని రాతల్ని రాసుకుంటూ - వారి లోకం లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ మనం చెయ్య కూడ దండోయి ! )

చీర్స్
జిలేబి.

No comments:

Post a Comment