Saturday, December 31, 2011

సంవత్సరం 2011 నేను చదివిన చదువుతున్న పుస్తకాలు

అదేమిటో నండీ , ఈ పుస్తకాలు ఏమి చదివామో ఒక సారి సమీక్ష చేసుకోవాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా సరే ఈ రెండు వేల పద కొండు లో ఏమేమి చదివామబ్బా అని ఆలోచిస్తే ఈ ఒకటో రెండో పుస్తకం తప్పించి పూర్తి గా ఏదీ చదవలేదు.

పుస్తకాలు చదవడమన్నది నా వరకైతే ఒక పారలెల్ ప్రాసెస్సింగ్. ఎ ఒక్క పుస్తకాన్ని పూర్తిగా వెంటనే చదివిన పాపం పుణ్యం కట్టు కోలేదంటే మీరు నమ్మాలి. ఎందుకంటే మనం చదివే దానికి 'సోమ్బెరు' లన్న మాట. 'కప్పు ' దాటు , చాటు వారలం. ఒక పుస్తకం కొంత బోర్ గా వుంది అనుకుంటే దాన్ని వదలి వేరే పుస్తకాని కి వెళ్ళడం , అది బోర్ అనుకుంటే మరో దానికి వెళ్ళడం, ఆ పై మొదటి పుస్తకాని కి రావడం, మొత్తం మీద నా వరకైతే రెఫ్రెషింగ్ సబ్జెక్ట్. (ఈ ట్రెండ్ మీరు ఈ బ్లాగు టపాల లో కూడా గమనించి వుంటారు. - లేదే అంటారా - అబ్బా, మీరు గమనించారండీ, కాని కాస్త చెప్పడానికి మోహ మాట పడి వుంటారు అంతే సుమా!). సో, దీన్ని బట్టి నా రాశీ మీకు తెలిసి ఉంటుందను కుంటాను. (వ్రాత రాశి కాదు మరి అంటారా అది వేరే విషయం !)


ఈ చదివిన దానిలో కొన్ని ఈ-పుస్తకాలు  కూడా. ( వేదం కూడా - రిగ్వేదం స్పెసిఫిక్ గా - ఓ మారు పూర్తిగా తిరగేసానంటే మీరు నమ్మాలి - ఈ ఈ పుస్తకం సాంస్క్రిట్ డాక్యుమెంట్స్ డాట్ ఆర్గ్ లో వుంది ). సంస్కృతం అంత గా తెలీదు కాబట్టి ( తెలుగు తెలిసిన వాళ్లకి సంస్కృతం అంత గా కష్టం కాదనుకోండీ, అయినా, అప్పుడప్పుడు చాలా సందేహాలు వచ్చేస్తోంటాయి, ఉదాహరణకి నాసదీయ సూక్తం చదివేటప్పుడు - దీని కి నా పరిధిలో లో ఎక్కడో ఈ బ్లాగులో నే ఓ భావాను వాదం కూడా రాసాను - ఈ వేదం విషయం స్పెసిఫిక్ గా ఎందుకు రాసానో మీరు ఇప్పటికే గ్రహించేసి వుంటారు ) !

సో, ఆ పుస్తకాల ఫోటో లు ఇక్కడ పెడుతున్నాను. ఇవన్నీ ఇంకా పారల్లెల్ గా నే 'చల్' తూ వున్నాయి. ఇందులో ఒకటి కూడా  తెలుగు పుస్తకాలూ లేవేమిటండీ అంటారా ? నాకు తెలుగు రాయటం మాత్రమే వచ్చు, చదవటం రాదు, ప్రొబ్లెం !  అంతే గాక మేము 'తెల్గూ' వాళ్ళం, తెల్గు మాట్లాడం, చదవం మరీ. జేకే. !!




 






ప్రస్తుతానికి, అంటే ఈ టపా రాసే నాటికి 'చల్తూ' ఉన్న గాడీ ఇది. !!



ఇలా కొన్ని. మరి కొన్ని కూడా వున్నాయి. కాని మరీ బోర్ కొట్టేస్తుందేమో ? అందువల్ల ఇప్పటికి ఇక్కడే ఆపేస్తాను.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

Friday, December 30, 2011

మా వేదం లో అన్నీ ఉన్నాయిష !

గూగుల్ వాడు "ఆడు సెన్సులు " పెట్టన్గానే జనాలు గూగుల్ మీద రిసెర్చ్ చేసి టాప్ కీ ఎడ్ వార్డ్ ల జాబితాలు మీకు కావాలా ? మమ్మల్ని సంప్రదించండి అనగానే జిలేబీలకి ఆశ పడిన ఒక జిలేబి ఈ "ఆడు సెన్సులు " అనగా ఏమి అని 'క్యూరియాసిటీ 'క్యాటును' కాటు వేసిందన్న చందాన కొంత సమయం వెచ్చించి ఆ పై ఇందులో 'ఆడడానికి ఎ సేన్సూ లేదు ' అనుకుని ' అందని ద్రాక్ష పండు పుల్లన ' అనుకుందట.


అట్లాంటి 'ఆడు సెన్సులు' గల 'ఆడు కీ వార్డ్ లు మన బ్లాగ్ లోకం ఈ మధ్య కాలం లో


౧. వేదం


ఈ పదం వేయంగానే మన 'సెన్సులు' ఆడు ను. ఈ ఎడ్ వార్డ్(కాకుంటే హేవార్డు ) చూడంగానే మన 'అంగుళీ యములు నాట్యము ఆడును.


మన వేదం లో అన్నీ ఉన్నాయిష !

౨. .ఈ పదం నేను చెప్పను. చాలా controversial !


హమ్మయ్య భంసు ! నేను కూడా ఒక స్టార్ టపా కి అర్హురాలినై పోయాను !

ఈ బ్లాగ్గర్ వాడు కామెంటులు సెలెక్టివ్ టపా కి disable ఆప్షన్ పెట్టలేదేమిటీ ?


చీర్స్
జిలేబి.

Thursday, December 29, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 9 - (భామా విజయం - 4 )

"సో యువర్ ఆనర్," అడ్వొకేటు రాజీ గారు గొంతు సవరించుకున్నారు.

తిరుప్పావై మొదటి పాశురం వారికి గుర్తుకొచ్చింది.

"నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్."


నందునిఅనుంగుబిడ్డ, నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోదముద్దుపట్టి, బాల కిశోరం చెప్పిన గీత కి ఈవాళ ఇక్కడ బహిష్కారమా కాదా అన్న వీరి కేసుకి శ్రీ కృష్ణుడు తనని ప్రెసెంట్ చేయమనడం తన పూర్వ జన్మ సుకృతం !

శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా రాజీ గారిని గమనిస్తున్నారు. ఈ అమ్మాయిని తను అడ్వొకేటు గా ఉండమనడం ఈ అమ్మాయికి సొబగైన వ్యవసాయం ఐనది. తన భగవద్గీత ని క్షుణ్ణం గా  ఇంకో మారు చదివి మరీ ఇక్కడి కి వచ్చింది -

ఈ కేసు దెబ్బతో చదివని వాడు గూడా జాడ్యం వదిలించుకుని తా జెప్పిన గీతలో ఏముందో అన్న క్యూరియాసిటీ తో చదువు తాడేమో రాబోయే కాలం లో. 

అయినా ఆ కాలం లో అర్జునుడే చాలా కష్ట పడ్డాడు తాను చెప్పిన గీత ని అర్థం చేసుకోలేక.

కాలం మారింది. మనిషి కూడా చాల విజ్ఞాన వంతుడయ్యాడు. కాబట్టి ఒక వేళ క్షుణ్ణం గా చదివితే ఈ కాలం లో అర్థం చేసుకుంటాడేమో ! చూద్దాం ఈ రాజీ ఏమని వాదిస్తుందో ? కేసు గెలిస్తే ఏమి ఓడితే ఏమి ? తాను చెప్పాల్సింది చెప్పేసాడు. "Whether some body takes it or not its their Karma!"

రాజీ 'ఘనమైన కోర్టు వాళ్ళని చూసింది.

"యువర్ ఆనర్, మా శ్రీ కృష్ణుల వారు చెప్పిన గీతలో ఒక వాక్యం ఇక్కడ కోట్ చేస్తాను వినండి.

"You only control your action. Not the results. So be not motivated by results, nor be attached to inaction"

కోర్టు లో ని జడ్జి గారి కి తల గిర్రున తిరిగింది. ఇట్లాంటి సిద్ధాంతం ఎప్పుడూ విని ఉండలేదు ఆయన. ఆలోచించాడు. ఈ వాక్యం తన పుస్తకం లో రాసుకుని వంద సార్లు చదివిన తనకి అర్థం కాలేదు. తను లా చదివే టప్పుడు తన గురువు గారు చెప్పిన లాయరు సూక్తం గుర్తుకొచ్చింది ఆయనకీ. లా అన్నది లాయర్ ల కి మాత్రమె అర్థం అవ్వాలి. జన సాధారణానికి అర్థం కాకూడదు. అప్పుడే అది లా అనబడును - అదీ ఆయన నేర్చుకున్న ప్రధమ సూక్తం. ఆ ప్రకారం చూస్తె ఈ గీత తనకే అర్థం కాలేదు ఇన్ని మార్లు తిరగేసినా - కాబట్టి ఇది భారద్దేశం లో లా పుస్తకం అయివుండవచ్చు.
"Law has given me this Judge post! To which ever country this belongs, I donot care, but I need to respect Law"

అని ఆ జడ్జీ వారు ఒక నిర్ణయానికి వచ్చి " ఈ గీత లో బహిష్కారం చెయ్య వలసినది ఏదీ నాకున్నట్లు కనిపించడం లేదు. మీదు మిక్కిలి ఈ పుస్తకాన్ని వెంటనే పెర్ఫెక్ట్  గా మన దేశ భాషలో తర్జుమా చేసుకుని లా చదివే వాళ్లకి పుస్తక పాటం గా కూడా పెట్టుకునేలా చెయ్యాలి " అని ఓ జడ్జిమెంటు బర బర గీకి ఆయన ఎంచక్కా పోయారు.

శ్రీ కృష్ణు ల వారు ఈ మారు ముక్కు మీద వేలు పెట్టు కున్నారు. ఔరా, ఈ కాలపు రాధికలు మరీ ఘటికులే ! ఒక్క వాక్యం తో ఈ జడ్జీ గారిని బోల్తా కొట్టిన్చారే సుమీ అని !

రాజి శ్రీ కృష్ణుల వారికి నమోవాకాలు అర్పించింది.

"స్వామీ"
"ఏమీ "
నా మనసులో వున్నది మీకు తెలియదా "
"అమ్మాయ్ మనసులో వున్నది తెలియక పోతే నీ కృష్ణున్ని నేను కాను"
"తెలిసినా నా కోర్కెను తీర్చేరేమీ "

"ఇదో అమ్మాయ్ రాజీ, నువ్వు ఈ కోర్టు కేసు గెలిచావు. నీ కోరిక బుజ్జి పండుని జర్మనీ లో కలవాలి. అంతే కదా"

"స్వామీ వారు చిద్విలాసులు. మనసులో మాటని వెంటనే కనిబెడతారు "

శ్రీ కృష్ణుల వారు చక్రం తిప్పారు. రాజీ గారు అక్కణ్ణించి మాయమయ్యారు. !

******

మ్యూనిచ్ కొనిగ్ స్త్రాస్సే నెంబర్ పదకొండో ఇంటి ముందు ఆగిన బీ ఎం డబ్ల్యూ కారు నించి బులుసు గారు, బుజ్జి పండు, మధురా దిగారు.

మధురా ఇంటి కీ ఓపెన్ చేసి "హాయ్ " అన్న గొంతు వినబడటం తో తిరిగి చూసారు. బులుసు గారు, బుజ్జి పండూ కూడా తల తిప్పి చూసారు.

వెనక రాజీ గారు - ప్రత్యక్షం గా కాన వచ్చారు. !

"ఓహ్ రాజీ గారు, వాట్ ఏ సర్ప్రైజ్! "

బులుసు గారికి తల తిరిగింది ! ఇదేమిటి ఈవిడ గారు ఎక్కణ్ణించి ఇక్కడికి వచ్చారు అని

" ఏమండీ రాజీ గారు చాల సర్ప్రైజ్ "

"అంతా శ్రీ కృష్ణుల వారి చలవ మాష్టారు "

బులుసు గారికి ఈ శ్రీ కృష్ణు ల వారు మరీ అగాతా క్రిస్టీ సస్పెన్స్ బుక్ లా అయిపోయ్యారు !

(ఇంకా ఉంది)

Wednesday, December 28, 2011

ஒரு புல்லாங்குழல் அடுப்பூதுகிறது

ஒரு புல்லாங்குழல் அடுப்பூதுகிறது

அடுப்பு ஊதினால் நெருப்பு  வரும்

நெருப்பு வந்தால் கண் எரியும்

கண் எரிந்தால் கண்ணீர் வரும்

கண்ணீர் வந்தால் மனது இளமை யாகும்

ஒரு புல்லாங்குழல்  'புல்' அரிக்கிறது !

சீரஸ்
ஜிலேபி.

Tuesday, December 27, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 8 - (భామా విజయం - 3 )


"ఏమమ్మా మధురా !  మీ దేశం లో జనాలు మాట్లాడనే మాట్లాడరా?! ఇంత నిశ్శబ్దం గా వున్నావు "

అంటూ వందా యాభై కిలోమీటర్ల పైబడ్డ వేగం తో వెళుతున్న
 'నిశ్శబ్దమైన ' కారు లో బులుసు గారు మొదటి మారు నోరు విప్పారు ఆ సైలెన్స్ కి భయపడి.

శ్రీ కృష్ణుల వారికి నమో నమః నమో నమః అంటూ కోటి మొక్కులు తెలియ చేసుకుంటున్న మధుర ఉలిక్కి పడింది.

జర్మనీ దేశం లో హటాత్తు గా ఎవరైనా తప్పి పలకరిస్తే వచ్చే మొదటి రిఎక్షన్ అది.


"అమ్మాయ్ , నీ అనుమతి లేకుండా ఈ బుజ్జి పండు ని కూడా నాతో వచ్చేయమని లాక్కోచ్చేసాను. తనకి అమెరికన్ పాస్పోర్ట్ వుండటం తో ఎగ్జిట్ కి ఎ ప్రాబ్లం లేకుండా పోయింది. నీకేమీ సమస్య లేదు కదా ?" అడిగారు బులుసు గారు.

రోగి కోరిన మందే వైద్యుడిస్తే ఎవరన్నా వద్దంటారా ?

"మాష్టారు ! మీరు బుజ్జి పండుని బయటకు తీసుకు రావడానికి కారణం బుజ్జి పండు అమెరికన్ పాస్స్పోర్ట్ కానే కాదు ! " చెప్పింది మధుర రియర్ వ్యూ మిర్రర్ లో చూస్తూ.

"మరి?"

"మా శ్రీ కృష్ణుల వారే ! " తన్మయత్వం తో కనులు మూసుకుంటూ చెప్పింది. వెనక వొస్తున్న కారు వాడు 'పాం' అంటూ సైడు తీసుకుని ఓ సీరియస్ ముఖం పెట్టి వెళ్ళాడు.

" శ్రీ కృష్ణుల వారంటే ఎవరు మధురా ? నీకు తెలిసన కస్టమ్స్ ఆఫీసరా ?" ఇండియా లో లాగా ఇక్కడ కూడా సిఫారుస్లు చెల్లుతాఎమో అని సందేహం గా అడిగారు బులుసు వారు.

"కాదండీ సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే ! రాధికా కృష్ణుల వారే "

మధుర జవాబు విని బులుసు గారు సీరియస్ గా చూసారు ఈ మారు మధుర వైపు. ఈ అమ్మాయి కి బ్లాగుల్లోనే శ్రీ కృష్ణుల వారి పైత్యం అనుకుంటే నిజంగానే శ్రీ కృష్ణులవారి వల్ల బుజ్జి పండు ఎగ్జిట్ అయ్యాడు అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్దేమిటి ?  అని కొంత సందేహం గా చూసారు మధుర వైపు వారు.

"బుజ్జీ , నీ పాస్స్పోర్ట్ అమెరికన్ పాస్? " మధుర నవ్వుతూ అడిగింది.

మధుర పక్క సీట్ లోనే కూర్చుని జర్మనీ ఆటోబాన్ ని శ్రద్ధ గా గమనిస్తున్న బుజ్జి పండు తలని అడ్డం గా ఊపి, "కాదండీ ఫ్రౌ మధుర గారు , నాది ఇండియన్ పాస్స్పోర్టే నండీ " అన్నాడు !

ఈ మారు ఆశ్చర్య పోవడం బులుసు గారి వంతయ్యంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎగ్జిట్ లో ఆ పాస్స్పోర్ట్ ఆఫీసరు అమెరికన్ పాస్స్పోర్ట్ ఉందనే కదా బుజ్జి పండుని ఎగ్జిట్ కానిచ్చాడు అని బుర్ర గోక్కున్నారు వారు.

జరిగినది మొత్తం టూకీ గా మధుర చెప్పింది బులుసు గారికి. శ్రీ కృష్ణులవారి వల్లే  బుజ్జి  ఎగ్జిట్ కానివ్వటం జరిగిందని.

"ఈ కాలం పిల్లలు ప్రాక్టికల్ జోక్ వెయ్యడం లో సిద్ధహస్తులు " అనుకుని వారు "బుజ్జీ నీ పాస్పోర్ట్ చూపించు" అన్నారు సందేహం తో బుజ్జి పండు వైపు చూస్తూ.

బుజ్జి పండు పాస్స్ పోర్ట్ చూపించాడు.  అది వారికి అక్షరాల అమెరికన్ పాస్స్పోర్ట్  లానే వుంది, పక్షి రాజు అలంకృతమై !

" మాష్టారు మీరు నమ్మరు కదా ? "

"నమ్మక పొవట మన్న ప్రశ్నే లేదు అంత ఖచ్చితం గా పక్షి రాజు కనబడు తూంటేను !"

"పోనీ మీ కాళ్ళ వైపో మారు చూడండీ "

"అదేమిటో నమ్మాయ్, ఇండియా లాగా ఫ్రీ గా చెప్పులతో వచ్చేసాను ఇక్కడి చలికి కాళ్ళు తిమ్మి రెక్కుతున్నాయి " తన కాలి వైపు చూస్తూ అన్నారు బులుసు వారు.

బులుసు వారు కాళ్ళ వైపు చూసి ముక్కు పై వేలేసుకుని తన కాళ్ళకి అంత మాంచి బూట్లు వేసుకుని ఈ పెద్దాయన చెప్పులు అంటారేమిటీ అని ఆశ్చర్య పోయింది మదుర ఈ మారు.

"అదేమిటండీ బులుసు వారు, అంత తళ తళ లాడే బూట్లేసుకుని చెప్పులు అంటారేమిటీ ?"

"దునియా పాగల్ హాయ్ , యా ఫిర్ మై దీవానా " అన్న పాత పాట గుర్తుకొచ్చింది వారికి. !!

బుజ్జి పండు బ్లాక్ పాస్ పోర్ట్ నించి మూడు సింహాలు ముసి ముసి గా నవ్వు కున్నేయి అశోకుని కాలం ముందు నించే భారత దేశం లో శ్రీ కృష్ణుల వారి మాయలు చూసిన సింహాలు అవి మరి !

కారు మ్యూనిక్ నగరం కొనిగ్ స్త్రాస్సే  పద కొండు నెంబర్ ఇంటి ముందు స్లో గా పార్కింగ్ స్లాట్ లో కొచ్చింది ఆటో బాన్ నించి మాయమై ఈ మారు!

(ఇంకా వుంది)

Monday, December 26, 2011

ఫ్లాష్ ఫ్లాష్ - స్వామి భాస్కర చేతానంద స్వామీ వారు భారద్దేశం రాక !

ఫ్లాష్ ఫ్లాష్ -
స్వామి భాస్కర చేతానంద స్వామీ
వారు భారద్దేశం రాక !

హారం లో
వ్యాఖ్యలు
బ్లాగర్  వి బ్లాకు
అయిపోయినాయి !

స్వామి వారు భారద్దేశం లో కనిపించిన
వెంటనే రిమాండు (అప్పు తచ్చు) కి పంపవలె

ఇట్లు
పోలీసు శాఖ !

చీర్స్

జిలేబి.

Sunday, December 25, 2011

Jesus జిలేబీయం

Just be
in
love &
ever
be
in Him!


క్రిస్స్మస్సు శుభాకాంక్షలతో

జిలేబి.

Saturday, December 24, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 7 - (భామా విజయం - 2 )

మ్యూనిక్  మహానగరం.

ఓ అమ్మాయి చూడడానికి ఇండియన్ లా వుంది. 

చలి విపరతీం గా ఉండటం తో మెడ చుట్టూ మఫ్లర్ , తలకి స్కార్ఫ్. 

రిసెర్చ్ సెంటర్ నించి బయటకు  వచ్చి రిస్ట్ వాచ్ లో టైం చూసుకుని తన కారు ఎక్కి డాష్ బోర్డ్ పై వున్న శ్రీ కృష్ణ స్వాముల వారి ఫోటో కి ఓ నమస్కారం సమర్పించుకుని కార్ ని ఫ్రాంక్ఫర్ట్ నగరం వైపు కి వెళ్ళడానికి ఉత్తరం వైపు తిప్పి ఆటో బాన్ ఎ నైన్ ఎగ్జిట్ వైపు సాగించింది.

శ్రీ కృష్ణ స్వాముల వారి పై అమితానురాగాలతో రీసెర్చ్ చేసే మన మధురవాణి గారు ఈవిడే నని నేను వేరు గా చెప్పనక్కర్లేదనుకుంటా !

దాదాపు నాలుగు వందల కిమీ పై చిలుకు ప్రయాణం. ఓ మోస్తరు నాలుగు గంటలలో ఫ్రాన్క్ఫర్టు చేరుకోవచ్చని తీరిగ్గా ఆలోచనలో పడింది మధుర.

బుజ్జి పండుని కిడ్ నాప్ చెయ్యాలి అనుకున్నది గాని, ఎలా చెయ్యాలో తెలియకుండా పోయింది. ఆ ఐడియా వచ్చినప్పటి నించి మధుర శ్రీ కృష్ణుల వారిని పిలుస్తోన్నే వుంది. స్వామీ నీవే ఏదైనా ఉపాయం చూడు అని.

ఎందుకో ఎప్పట్లా ఈ మారు స్వామి వారు పలకడం లేదు. వున్నారో లేదో అన్న సందేహం కూడా వస్తోంది తనకి. ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే కన్నయ్య ఈ మారు ఎందుకో ఏమో తెలీదు అస్సలు పత్తా లేకుండా పోయాడు.

ప్రయాణం లో అలుపు తెలీకుండా 'ఘంటసాలవారి అష్టపది వింటూ 'తవ విరహే కేశవా ' కృష్ణా రాధికా కృష్ణా రాధికా అంటూ ఆటో బాన్  మీద రెండువందల కిలో మీటర్ వేగాన్ని కారు కి అందనిచ్చింది మధుర వాణి, కృష్ణా ఏమైనా ఉపాయం చెప్పవూ అంటూ.

ఊహూ, శ్రీకృష్ణుడు అస్సలు పత్తా లేదు.

హే కృష్ణా ముకుందా మురా ఆ ఆ రే .... అంటూ ఈ మారు ఘంటసాల వారి గొంతు ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తే , తాను ఆటో బాన్ మీద వెళ్తున్నాన్నదాన్ని మరిచి హే కృష్ణా అంటూ స్టీరింగ్ పై నించి రెండు  చేతులూ వదలిసింది మధుర వాణి!

రష్యా లో కోర్టు కేసులో హాజరవుతూన్న శ్రీ కృష్ణుల వారు ఉలిక్కి పడి అక్కడ్నించి తటాలు న మాయ మయ్యారు, తన అడ్వొకేట్ అయిన రాజి కి మాట మాత్రం కూడా చెప్పకుండా , అడ్వొకేటు రాజి గారు కృష్ణా , వెళ్ళకు ఆగు, కేసు ఫైనల్ హియరింగ్ జరుగుతోంది అని గాబారా పడుతూ చెబ్తూంటే వినిపించుకుంటేనా స్వామీ వారు!

***

'అమ్మాయ్ , అమ్మాయ్ మధురా - నువ్వు ఆటో బాన్ లో వున్నావ్ , ఇట్లాంటి చేష్టలు ప్రాణ హానికరం' అంటూ సున్నితం గా సుతారమైన గొంతు ఈ మారు బాక్ సీట్ నించి విన రావడం తో ఉలిక్కి పడి ఈ లోకం లో కి వచ్చి మధుర రియర్ వ్యూ మిర్రర్ లో ఎవరా అని చూసింది.

నెమలి పించం , లలాట ఫలకే కస్తూరి తిలకం  అంత దాకా శ్రీ కృష్ణుల వారిలా వున్న ఆ ఆకారం ... ఆ పై వేషం వేరుగా వుండి, కొటూ , సూటూ,  కంఠం లో ముక్తా వళీ లా టై  పడమటి కేళీ విలాసం లా గున్నాడా పెద్ద మనిషి. !

' స్వామీ ! ఇదేమి కొత్త వేషం ఈ మారు ? ' స్వామిని గాంచిన మహదానందం తో అడిగింది మధుర.

'ఏమని చెప్పనమ్మాయ్ మధురా!  నేనెప్పుడో చాలా కాలం క్రితం మా అర్జునినికి గీత చెప్పాను. అది నా తలరాత లా అయిపోయింది.

 రష్యా లో గీత కి చరమ గీతం పాడాలని కొందరు కోర్టు కి ఎక్కారట.

మా అర్జునుడు ఒకటే గొడవ, బావా నీవే వచ్చి దానికి వకాల్తా తీసుకోవాలి ! నీ గీతను నువ్వే కాపాడుకోవాలి అని వాడు చేతులెత్తేసాడు.

పోనీలే అని రష్యా కోర్టు కెళ్ళి అక్కడి తతం గం లో తలమునకలై వుంటే నీ 'గజేంద్ర' పిలుపు ఆర్తనాదం వినిపించి, ఆ కోర్టు కేసు వాళ్ళ తలరాతకి వదిలేసి, అలాగే వచ్చేసాను !

అబ్బ ఒక్కటే చలి ప్రదేశం అమ్మాయ్ ఈ రష్యా దేశం ! అంటూ కోటు ని మరీ దగ్గిరగా కప్పుకున్నారు శ్రీ కృష్ణ స్వాములవారు - "ఇంతకీ  ఎందుకు నన్ను పిలిచినట్టు ?"  అని అడుగుతూ.

'స్వామీ ! బుజ్జి పండు ఫ్రాంక్ఫర్ట్ ఇంటర్నేషనల్ ఏరియా లో వున్నాడు. అతన్ని ఎలా బయటకి రప్పించి నేను మ్యూనిచ్ తీసుకెళ్లాలో నాకు తెలియటం లేదు. నీవే నాకు మార్గం చూపెట్టాలి ' అని మొర పెట్టుకున్నది మధుర, మొత్తం కథని టూకీ గా వారికి చెప్పి.

'ఓస్, అమ్మాయ్, ఈ మాత్రం దానికి నేనెందుకు. ? నా  ప్రియ బాంధవుడు బులుసు అక్కడే కదా వున్నాడు. ఆతడే చూసుకుంటాడు సుమా , వుండు ' అంటూ చేతిని తన హృదయం మీదికి పోనిచ్చారు శ్రీ కృష్ణుల వారు.

ఇక వస్తానమ్మాయ్! నీ కారు ఏర్పోర్ట్ చేరుతోంది, చూడూ, అక్కడ గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు వారు పక్కనే బుజ్జి పండు వున్నారు గమనించు . ఇక నే మళ్ళీ రష్యా వెళ్తా ' అని కృష్ణ స్వాములవారు అంతర్ధానమయ్యారు !

ఆటో బాన్ నించి సుమారు మూడు వందల కిమీ దూరం లో వున్న ఏర్పోర్ట్  ముందర ఆగింది ఈ మారు మధుర వాణి కారు "augenblick" సమయం లో !  అంతా శ్రీ కృష్ణుల వారి మాయ  ! గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు గారు, పక్కనే బుజ్జి పండు కనపడ్డారు మధుర వాణికి!

"Vielen Dank Krishna" అంటూ మధుర వాణి సంతోషం తో అమందానందకళిత హృదయారవిందురాలై కారు దిగి, బులుసు వారికెదురేగి 'నమస్తే' మాష్టారు ' అంటూ  చెప్పి, బుజ్జి పండు వైపు తిరిగి 'హాయ్ బుజ్జి పండు' అంది మధుర.

బుజ్జి పండు బులుసు వారి వైపు తిరిగి ఎవరన్నట్టు చూసాడు ఈ మారు.

'మై డియర్ బాయ్,  మీట్ 'ఊ , ఊహూ మధుర' అని బుజ్జి పండు కి పరిచయం చేసారు మధురని బులుసు వారు.

'ఓమ్ నమో మాతా నమో నమః' అనబోయి బుజ్జి పండు తాను జర్మేని లో వున్నానని గుర్తుకొచ్చి, "Wie gehts frau madhura " అన్నాడు.

"Good Dank! und du"  మధుర చెప్పింది బుజ్జి పండు జర్మన్  ఆక్సేంట్ కి అబ్బురపడి.

"Vielen good, Dank! ' బుజ్జి పండు చెప్పాడు నవ్వుతూ - "మా స్కూల్లో జర్మన్ సెకండ్ లేన్గ్వేజీ నాకు ". ఆతని హరీ పాటర్ కళ్ళద్దాలలోంచి చమక్కుమని ఒక మెరుపు మెరిసి తెల్లటి తివాచీలా వున్న మంచు పై రిఫ్లెక్ట్ అయింది.

"Alles klaar, das ist schon" అంటూ మధుర సంతోష పడి వారిద్దర్నీ అక్కడి దగ్గిరే వున్న స్టార్ బక్స్ కి తీసుకెళ్ళింది కొంత రెఫ్రెష్ అవడానికి.

కొంత సేపటి తరువాయి, ఆ ముగ్గురు వున్న మధుర కారు మ్యూనిక్ వైపు పరుగులేట్టింది. . బులుసు కాలికి నిగ నిగ లాడే కొత్త బూట్లు ఆ కారు కలర్ కి కామ్పీట్ చేశాయి ఈ మారు !

(ఇంకా ఉంది)

Thursday, December 22, 2011

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే - బ్లాగ్ 'జ్యోతి' గారి తో బ్లాగ్ముఖీయం - జ్యోతి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో !

వంద పేజీ ల పైన లింకులు
పన్నెండు పై బ్లాగులు
మూడు వేల టపాలని అందుకుంటున్న బ్లాగ్ వేగం
ఒక మిల్లియన్ దరిదాపుల్లో విజిటర్స్
Nearly 5 fruitful years in 'Blog Industry' !
ఆవిడ ఒకప్పటి ఇల్లలుకుతూ తనను తాను మరిచిపోయిన
సత్యవతీ శారద
ఒక శుభోదయాన పిల్ల గాలి లా మారి - బ్లాగ్ ప్రభంజనం గా పరిణితి చెందింది.
ఆమె ఒక 'పుయల్ - వియల్' !
నేడు బ్లాగ్ లోకపు 'జ్యోతి'
బ్లాగ్ గురువు
బ్లాగ్ లోకాం తపసా జ్వలంతీం !

December 22, 2011
జ్యోతి వలబోజు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో
ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే బ్లాగ్ముఖీయం !
ఇది ఒక  ABN- ఆంద్ర జిలేబి సహసమర్పణ !

నమస్కారం జ్యోతి గారు ! పుట్టిన రోజు శుభాకాంక్షలు !


మీరు ఒక వ్యక్తి యా లేక శక్తి యా ? పన్నెండు పై బ్లాగులు , ఎడతెరపని వ్యాస పరంపరలు. గృహిణీ గురుతరమైన భాద్యతలు. మీకు టైమ్ ఎలా కుదురుతుంది. రాత్రుళ్ళు నిద్రపోరా?

నమస్తే. ధన్యవాదములు.
అందరికీ లాగే నాకూ వున్నది ఇరవై నాలుగు గంటలే అండీ !. దాన్ని మనం ఎలా సద్వినియోగ పరచు కుంటాం అన్నదాన్ని బట్టి మన టైం మేనేజ్మెంట్! ఇరవై నాలుగు గంటల్నే, డెబ్బై రెండు గంటలు గా ఉపయోగించుకోవచ్చు.
The secret of success in the 21st century is all about learning things fast and unlearning them even faster!


మీ ఫ్యామలీ గురించి...

మావారు సివిల్ ఇంజనీరు, పిల్లలు దీప్తి, కృష్ణచైతన్య .ఇద్దరు వర్కింగ్. మేము ఉండేది .హైదరాబాదు. నేను ఇంట్లోనే ఉంటాను.

మీ అమ్మ గారి గురించి చెప్పండి ...

ఒక్కతే కూతురుగా పుట్టడంలో ఉన్న మజానే వేరు. అన్ని రాజభోగాలే. అమ్మ చేసే అలంకారాలు అన్నీ మనకే. చెప్పొద్దు కాని మా అమ్మ నాకు చిన్నప్పటినుండి గురువులా అన్నీ నేర్పేది. ముఖ్యంగా తెలుగులో చదవడం, ఏదైనా నేర్చుకోవడం. వంట దగ్గర అంటే కాస్త కాస్త సాయం చేయడం వరకే.

మార్కెట్లో కనబడిన కొత్త డిజైన్ ఫ్రాకులు, డ్రెస్ లు కుట్టేది . మల్లె పూలు మొదలయ్యాయంటే చాలు కనీసం మూడు నాలుగు సార్లైనా పూల జడ వేసుకోవాల్సిందే. అచ్చంగా నా జడకు డైరెక్టుగా కుట్టాల్సిందే.పూలజడ వేసుకునే రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండేది.

కనీసం మూడు గంటలు కూర్చుంటే కాని జడ పూర్తయ్యేది కాదు. ఇక సాయంత్రం , పట్టులంగా వేసుకుని, అమ్మ నగలు పెట్టుకుని ఫోటో స్టూడియోకెళ్ళి వెనకాల అద్దం పెట్టి మరీ ఫోటో దిగడం.

నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేసింది మా అమ్మే. క్లాసు పుస్తకాలే కాకుండా తప్పనిసరిగా చందమామ కొనేది పేపర్‌తో పాటు. ముందు సింగిల్ పేజీ కథలు చదువుతూ మెల్లిగా సీరియల్స్ చదివేదాన్ని. పాత పేపర్లవాడు వచ్చినప్పుడు చందమామల్లోని సీరియల్ కథలన్ని కట్ చేసి దాచుకునేదాన్ని.

మీ అమ్మాయి చదువుకి మీరు ఏమైనా సాయం పట్టారా ?

నేను అంతర్జాలానికి వచ్చిందే మా అమ్మాయి చదువుకోసం. ఇంజనీరింగు మూడవ సంవత్సరంలో ఉండగానే "మమ్మీ ! నేను CAT , XAT పరీక్షలకు చదువుతాను" అంది. ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో చదువుకుంటానంటే ఎలా వద్దనగలను.కాని నేను చెప్పింది ఒకటే.. నువ్వు సీరియస్సుగా చదువుతానంటే . ఓకె.. నువ్వు చదువుకో. మిగతా విషయాలు నేను సేకరిస్తాను అని నెట్‍లో కావలసిన సమాచారం సేకరించడం, నెట్ లో కలిసిన మిత్రులతో కాలేజీలు, ఉద్యోగం గురించి తెలుసుకోవడం నేను చేసేపని. కాని తను పట్టుదలతో చదువుకుని , ప్రతిష్టాకరమైన కాలేజీలో అదీ హైదరాబాదులో చేరింది. అనుకున్నది సాధించింది.


బుడిబుడి అడుగులతో ఆడుతూ పాడుతూ పెరిగిన నా చిన్నారి , అతి చిన్న వయసులొ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో భాధ్యాయుతమైన ప్రాజెక్ట్ ఇంజనీరుగా ఉంది అంటే నాకు చాలా గర్వంగా ఉంది.

ఇంటి ఇల్లాలు చేసే పనులకు వెల కట్ట గలమంటారా ?

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, ఆవిడ చేసే సేవలు అమూల్యం.
అట్లాంటి ఇల్లాలు చేసే పనులకు నిజంగా వెలకడితే ఎంతవుతుందో తెలుసా? అక్షరాల ఓ వెయ్యి అమెరికన్ డాలర్లంత! అంటే మన లెక్కలో అరవై వెల రూపాయల పై చిలుకు!

మహిళల కోసం ప్రమదావనం ! మహిళల కోసం జల్లెడ లో ప్రత్యెక ప్రాంగణం కూడలి లో ప్రత్యేక విభాగం! స్పెషల్ చాట్ రూం నారీ భేరీ ఏమిటండీ మీ స్పెషాలిటీ ?

అదే మరి మా మహిళల ప్రత్యేకత.. ఒక్క టపా రాస్తే వంద టపాలు రాసినట్టు అన్నమాట.

ఆడవాళ్ళలో జీనియస్ లు ఎందుకు లేరంటారు ?

ప్రతి ఒక్క ఆడదీ జీనియస్ అండీ. ఈ జీనియస్ అనబడే వ్యక్తికి చెమ్మగిల్లే హృదయం ఉండాలి.కంట తడి పెట్టగలిగే మెత్తటి మనసుండాలి. ఈ గుణాలు ఆడవాళ్ళలో సహజం. అందుకే ప్రతీ స్త్రీలో ఓ జీనియస్ ఉంది. వెరయిటీ కే ఈ రోజులలో ప్రచారం, అందుకేనేమో ఏ ఒక్క మగవాళ్ళలో తప్పి జీనియస్ పుడితే, వెంటనే వారికి ప్రాచుర్యం వచ్చేస్తుంది.


పేగు తెంచుకుని నేలపై పడినప్పుడు ఆ ఆడపిల్ల అమృత కలశంగా కాలేదు. అగ్నికుంపటి కాలేదు. ఒక స్త్రీ అనుకుంటే సాధించలేని దంటూ ఏమీ లేదు.

మీరు బ్లాగ్ ఎప్పుడు మొదలెట్టారు ?

సెప్టెంబర్ 14, 2007 న.
ఇల్లలకగానే పండగౌనా అని సత్యవతీ గారి కథ. చాలా సంవత్సరాల మునుపు వచ్చింది.
ఇల్లలుకుతూ ఒక శారద తన్ను మరిచి పోయిందట. ఈనాటికీ మన చుట్టూ ఎంతోమంది తమ పేరు మరచిపోయిన శారదలు ఉన్నారు. భర్త , పిల్లలు , సంసారం తప్ప వేరే లోకం తెలిదు. అలాటి ఓ పేరు మరచిపోయిన శారదల్లో నేనూ ఒకదాన్నేఒకప్పట్లో ..


అప్పట్లో అందరి ఆడాళ్ళలాగే ఇంటిపని కాగానే నిద్రపోవడం, టీవీలో వచ్చే చెత్త సీరియళ్ళన్నీ చూడడం( అప్పుడవి మహాద్భుతాలు) వాటిగురించే చర్చించడం, మరునాటి కోసం ఎదురుచూడ్డం చేసేదాన్ని. వేరే వినోదం అంటూ లేదు మరి. ఐనా నాలో ఎదో అసంతృప్తి. నాకు నచ్చిన పాటలు, వంటలు, జోకులు, కథలు,పురాణగాథలు. వీటన్నింటి గురించి మాట్లాడుకోటానికి స్నేహితులు లేరు.

మొదటినుండి తెలుగు అంటే ప్రాణం. పుస్తకాలంటే మరీను. మరి ఏదైనా విషయం గురించి చర్చించాలి, సందేహం తీర్చుకోవాలి అంటే ఎవరూ లేరు. అందుకే గూగుల్‌లో కనపడ్డ తెలుగు గుంపులన్నీ చేరిపోయా. అప్పటికి గ్రూపులంటే తెలీదు. తర్వాత ఒక్కటొక్కటిగా తెలుసుకుని, బ్లాగ్ మొదలెట్టాను.


మొదట్లో నా బ్లాగులో ఏమి రాయాలో తెలీదు. అంతా అయోమయం. అందుకే ఎక్కువగా నాకు నచ్చిన విషయాలను రాసేదాన్ని. మెల్లి మెల్లిగా నా స్వంత రాతలు మొదలుపెట్టాను. అలా అలా నాకు ఇష్టమైన అభిరుచులన్నీ బ్లాగులుగా చేసుకున్నాను. బ్లాగు మొదలెట్టిన సంవత్సరంలోగానే కంప్యూటర్ ఎరాలో ఒక సమగ్రమైన వ్యాసం రాయగలిగాను.

ఈ బ్లాగులు ఏమి ఆశించి మొదలెట్టారు ?

ఈ బ్లాగులవల్ల ఏదో ఆశించి కాదు. కాని ఈ బ్లాగుల వల్ల నాకే తెలియని రచనాశైలి బయటికొచ్చింది అని చెప్పగలను. అలాగే ఎంతో మంది ఆత్మీయులను పొందగలిగాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే నవ్వొస్తుంది.

ఈ బ్లాగులవల్ల మీకు ఏమైనా మంచిది జరిగిందా ?

ఈ బ్లాగుల వల్ల నా ఆలోచన, అవగాహనా శక్తి పెరిగింది.నిజం. ఎప్పుడైనా ఏ విషయమైనా నచ్చిందైనా , నచ్చనిదైనా, నా స్వంత విషయమైనా వెంటనే బ్లాగులో రాసుకుని అందరితో పంచుకోవడం అలవాటైపోయింది. అందరూ కుటుంబ సభ్యులు, పాత మిత్రులలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఎవ్వరితోను పోటీ అనుకోలేదు. నాకు నేనే పోటీ పెట్టుకుని రాసుకుంటూ పోయా. మొదటినుండి నాదో అలవాటు మంచిదో కాదో తెలీదు. నాకు తెలిసింది పదిమందికి చెప్పడం, తెలీంది పదిమందిని అడగడం. అదే పాటిస్తూ వస్తున్నా ..


ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని.. ఇది నేను ఇంట్లోనే ఉండి చేయగలిగాను అని. అందరూ ఊరికే అనేవారు మరి ఎప్పుడూ కంప్యూటర్లో ఏం చేస్తుంటావు అని. నేను ఎన్ని బ్లాగులు రాసినా అది నా కుటుంబ బాధ్యతల తర్వాతే తీరిక సమయాలలో చేస్తున్నాను.


అంతర్జాలాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రపంచం మనచేతిలో ఉండడంకాదు ప్రపంచానికే మనం పరిచయమవుతాం..

జ్యోతక్క గా చాలా మందికి తెలుసు గాని, ఎప్పుడైనా నెట్ లో అల్లరి చేసారా మీరు ?

అదేంటో గాని చిన్నప్పటినుండి అల్లరి చేసి ఎరుగను. ఇంట్లో ఒక్కదాన్నే ఆడపిల్లను, పెద్దదాన్ని. ఎవరితో పోట్లాడేది? అల్లరి చేసేది.? ఇది మస్తీ గ్రూపులో జరిగిన సంఘటన. అది నేను చేరిన కొత్తలో జరిగింది. నా నిజమైన వివరాలు ఒక్క గ్రూపు ఓనర్‌కి, ఒక అమ్మాయికి మాత్రమే తెలుసు. గుంపులో నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఎదో ఒక ఆట, చర్చ మొదలు పెట్టేదాన్ని. అప్పుడప్పుడు వంటకాలు పంపించడం గట్రా. ఆ సమయంలో ఒక అబ్బాయి చేరాడు.


ఎప్పుడు కూడా అమ్మాయిలను తెగ సతాయించేవాడు. నేను పంపిన మెయిల్స్ మీద కూడా ఎదో ఒక కామెంట్ చేసి కోపం తెప్పించేవాడు.నాకు ఆ అబ్బాయికి తరచూ గొడవ జరిగేది. అతడు తనకు తానే చాలా గొప్ప అనుకునేవాడు.


అలా ఒక రోజు ఈ బ్లాగ్ విషయం లా గుంపులో ఒక చర్చ మొదలు పెట్టాను. మీరు చేసిన అల్లరి చెప్పండి అని.

ఒక్కొక్కరు చెప్తున్నారు . అప్పుడు నాకో ఐడియా వచ్చింది. వెంటనే ఒక మెయిల్ చెసా." ఇంతవరకు నేను గుంపులో చెప్పిన వివరాలు తప్పు. నేను అమ్మను కాదు అమ్మాయిని, నా వయసు తప్పు చెప్పాను. నేను M.B.A చదువుతున్నాను. కావాలని గుంపులో అల్లరి చేసాను. ఎవ్వరిని మోసం చేయాలని కాదు " అని కాస్త గ్యాస్ కొట్టాను. ఇంకా ఆ తరువాయి ఆ అబ్బాయి పాట్లు చెప్పా లంటారా ?

మీకు సంగీతం అంటే ఇష్టం. ఏమంటారు ?

సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన 64 కళల్లో సంగీతం మొదటి స్థానంలో ఉంది. పసిపిల్లలు, పశువులు, పాములు, పక్షులు, మొక్కలు కూడా సంగీతాన్ని విని ఆనందిన్స్తాయని అంటారు. అంతే కాక మ్యూజిక్ థెరపీ వల్ల మానసిక రుగ్మతలను కూడా పోగొట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు. "Music is Universal Language" ప్రపంచం అంతటికీ తెలిసిన ఏకైక భాష సంగీతం. ప్రపంచ సంగీతమంతా ఏడు స్వరాల (సప్తస్వరాలు) మీదే ఆధారపడి ఉంది. సంగీతానికి పునాది ఈ సప్తస్వరాలు.


ఉదాహరణకి, బిళహరి-- ఈ రాగం పాడి చనిపోయినవారిని కూడా బ్రతికించవచ్చు అంటారు. అమృతవర్షిణి-- ఈ రాగం పాడి ముత్తుస్వామి దీక్షితులు ఎట్టయాపురంలో వర్షం కురిపించి క్షామాన్ని రూపుమాపారని చెబుతారు


ఎక్కడి దింతటి యోపిక? యెక్కడి వీ జ్ఞానరుచులు, హెచ్చగు రీతుల్? మాటలు, పాటలు, వంటల మూటలతో, ’బ్లాగులోకము’న నొక్క ’డజన్’కోటలనే నిర్మించిన మీ ప్రతిభా రహస్యం ఏమిటి ?

ఇందులో రహస్యం ఏమీ లేదండీ.


తీరిక లేకుండా సాగిపోతున్న నా దినచర్యలో ఒక్కసారి ఆగి "నేనేంటి??" అన్న ఆలోచన చేయడం మొదలైంది. నేను ఎప్పుడు కూడా గతం గురించి కాని, వర్తమానం గురించి కాని చింతించలేదు. ఈ రోజు మాత్రమే నా చేతిలో ఉంది. దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనుకున్నాను.

అప్పట్లో కంప్యూటర్ అంటే ఒక డబ్బా టీవీ, టైప్ రైటర్ అని తప్ప వేరే తెలీదు.

నిజంగా చెప్పాలంటే ఈ తెలుగు బ్లాగు వల్ల నాకంటే ఎక్కువ ప్రయోజనం పొందింది, సద్వినియోగపరుచుకున్నది ఎవరూ లేరనుకుంటా. తీరిక సమయాన్ని నెట్ పై వినియోగించి నేను పొందిన లేదా సాధ్యం చేసుకున్న కలలు చెప్పనా ?

దీపంజ్యోతి పరబ్రహ్మ..మనిషి నడవడానికి శక్తి కావాలి. ఆ శక్తినందించేది ఆహారం. అందుకే షడ్రుచులు. మనిషి నడతకు కావాలి మేలుకొలుపు. అదే జ్యోతి బ్లాగు. సాహితీసేద్యంలో సాహితీసమరాంగణ చక్రవర్తి పదఝరిలో ఓలలాడించే ఆముక్తమాల్యద,కమ్మనిపాటల గీతాలహరి,చక్కటి పాఠాల బ్లాగ్ గురువు,చరాచర సృష్టివైచిత్రిలో విచిత్ర మానవ స్వభావాలను పౌరాణిక కథలద్వారా ప్రస్ఫుటించే జగన్నాటకం,పొద్దు గడిచేందుకు పొద్దుగడి,నవ్వనివాడు పాపి అని తిట్టిమరీ నవ్వించే Jyothi అందించే హాస్యపు పుణుకులు మాటల చెణుకులు, భక్తిదారులు చూపి ముక్తిమార్గపు బాటను వేసే నైమిశారణ్యం, అంతే .

మీ విజయానికి దోహదం ?

నా విజయంలో పాతిక శాతం మావారికి, పాతిక నన్ను ప్రోత్సహించే నా పిల్లలు, మిత్రులకు, మిగతా యాబై శాతం నాకేనండి. ఎప్పుడు కూడా నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకోలేదు. ఎదురొచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, కష్టపడి విజయం సాదిస్తూ వచ్చాను. బ్లాగడం మీద అవగాహన, తెలుగు లో బ్లాగమని ప్రోత్సాహం.. వగైరాల ద్వారా 'నేను సాధారణ గృహిణినేనర్రా.. ఇపుడు చూడండి నన్ను..' అన గలిగాను.

ఒకప్పుడు తెలుగుబ్లాగు గుంపులో అల్లరి పిల్ల జ్యోతి, నేడు జ్యోతక్క, రేపటి ప్రస్థానం ఎక్కడికో?

జ్యోతిని ఇలానే వెలగనివ్వండి. కొన్ని ప్రమిదలు అనుకరిస్తాయి, మరికొన్ని, ఆశ్చర్యపడతాయి, అబ్బురపడతాయి, మరెన్నో అనుకరిస్తాయి. ఇంక ఎందరో జ్యోతక్కలు వస్తారు.రావాలి. జ్యోతి ఎప్పటికీ ఇలానే జ్వలిస్తూ ఉండాలి.

మీకు 'Blog Ambassadar' అని టైటిల్ ఇస్తున్నా నా తరపునించి అని జిలేబి గారు అన్నారంటా?

బ్లాగ్ లోకం లో మీకు పుయల్- వియల్ అని తమిళ బ్లాగర్స్ బిరుదు ఇచ్చారని విన్నాము ? (పుయల్- అంటే ప్రభంజనం - వియల్ అంటే - బంగారం !)

I love my computer/blogs because my friends live in it! నా సంతోషంలో ఆనందించి, బాధలో ఓదార్పు నిచ్చి, విజయాలలో అభినందించే ప్రియమైన బ్లాగు మిత్రులకు వందనాలు. మనఃపూర్వక కృతజ్ఞతలు.

అసలు రక్తసంబందం లేకుండా ఇంత ఆత్మీయత , ఆప్యాయత ఉన్న స్నేహాలు ఏర్పడతాయని కలలో కూడా అనుకోలేదు. ఇంతమంది బ్లాగు మిత్రులలో కొందరు కుటుంబ మిత్రులుగా కూడా మారారు!

I learn from my fellow bloggers. టైమ్స్ ఆర్టికల్ ద్వారా పరిచయమైన ముత్తులక్ష్మి అనే తమిళ బ్లాగరు తన నాలుగవ బ్లాగు వార్షికోత్సవ సందర్భంగా నాకు ఈ అవార్డు ఇచ్చింది.

బ్లాగు నెయ్యము మనకెంతొ బాగు బాగు
ఒకరి కొకరుగ సాయము ఒనర గూడ
జీవితంబున మనకెంతొ తావి నిచ్చు!
జయము జయమేను మనకింక జగతినందు

రౌడీ గారు, రౌడీ గారి అమ్మ గారు కథా కమామీషు ?

ఎవరూ మలక్పేట రౌడీ గారా ? మలక్ బ్లాగులోకంలోకి వచ్చింది నా మూలంగానే.. నన్ను కెలకడానికి వచ్చాడు అప్పుడెప్పుడో. తర్వాత పరిచయం కలిగి , స్నేహం పెరిగింది. కాని చివరికి నావల్లే కెలకబడ్డాడు పాపం.. అందుకే పెద్దలు చెప్పారు ... (... ఇది మీకు తెలుసు...)... అతని స్నేహం వల్ల నాకు కొన్ని రౌడీ వేషాలు అబ్బాయి లెండి. ఆ పై వారి అమ్మగారితో పరిచయం ఓ మరువలేని అనుభవం.

మన 'టెల్గూ' టీవీ ఏంకర్ ల గురించి మీ అభిప్రాయం ?

ఈ లంగరమ్మలు ఏమి మాట్లాడినా మాట్లాడక పోయినా హొయలు.. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అంతా తెలుగువారే. ఐనా కూడా తమ వ్యాఖ్యానాలలో తెలుగు తక్కువ ఇంగ్లీషు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. వాడుక భాషలో పదాలను కూడా ఇంగ్లీషులోనే చెప్పాలా? ఇక్కడ ప్రోగ్రాం చేసే ప్రొడ్యూసరు, డైరెక్టరు , యాంకరు, చూసేవాళ్లు , ఆ చానెల్ కూడా తెలుగే. మరి ఈ ఇంగిలిపీసు అవసరమా?? నూనె, ఉప్పు, చక్కెర ను కూడా ఇంగ్లీషులోనే పలుకుతారు. మనం వాటిని ఆయిల్, సాల్ట్ , షుగర్ అని అనము ఇందులో పాల్గొన్న మహిళలు మాట్లాడేది తక్కువ ఈ యాంకరమ్మల గోల ఎక్కువగా ఉంటుంది. వాళ్లు చెప్పింది ప్రేక్షకులకు ఎక్కడ అర్ధం కాదని అనుకుంటారో ఏమో వీళ్లు వెంటనే మళ్లీ చెప్తుంటారు. ఇక కొందరైతే మాష్ కి స్మాష్ కి తేడా తెలీని ముద్దుగుమ్మలుంటారు. అదేనండి ఉడికించిన బంగాళదుంపలను చిదిమి వాడతాము కదా. ఒక్కోసారి మాష్ అంటారు, ఒక్కోసారి అది బాంబు అనుకుని స్మాష్ అంటారు. ఖర్మరా బాబు..

అప్పటి అమ్మాయిలకీ , ఇప్పటి అమ్మాయిలకీ వ్యత్యాసం ?

అసలు ఇప్పటి అమ్మాయిలకు మంచి అభిరుచి అలవాటు చేసుకోవాలన్న ఇచ్చుక కొంత తక్కువే అనుకుంటాను. చదువు, కంప్యూటర్లు, సినిమాలు, మొబైల్ లేదా ఐప్యాడ్ పెట్టుకుని పాటలు వినడం. మంచి వాయిద్యం నేర్చుకుందామని ఎంత మంది అనుకుంటున్నారు?. ఏమంటే మాకు టైం లేదు అంటారు.

మా కాలంలో ఐతేనా??. .... అప్పట్లో స్కూల్లో, బాలభవన్ లో సంగీతం, వాయిద్యం నేర్చుకునే సదుపాయం ఉండేది. అసలైతే స్కూల్లో వారానికి ఒక రోజు సంగీతం క్లాసు కూడా ఉండేది. ఇంకా లైబ్రరీకి ఒక పీరియడ్ ఉండేది. మేము కూడా చదువుకుంటూనే ఆటలు, పోటీలు, సంగీతం, వక్తృత్వ పోటీలు అన్నీ పాల్గోనేవాళ్ళం. ఇంటికొచ్చి వేరే ఆటలు. ఏంటో ఈ నాటి పిల్లలు. చదువు తప్ప ఏది నేర్చుకుందామనే ఆసక్తి లేదు....


ఊరగాయల్ని గురించిన మూడనమ్మకాలు,ఊరగాయలూ, ఆధ్యాత్మిక చింతనా మీద మీరు రిసెర్చ్ చేసారంటా ?

ఊరగాయల మీద నా పరిశోధనా వ్యాసానికి ఓ డాక్టరేట్ ఇచ్చారండోయ్ మన బ్లాగ్ మిత్రులు నాకు !
ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామములో ఊరగాయలను గురించి చెప్పబడిన ఒకపద్యం చెప్పనా ?


కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌,
గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాల నే, పెస-
ర్పప్పును, గొమ్ము నల్లనటి పండ్లును, నాలుగు నైదు నంజులున్‌,
లప్పలతోడ గ్రొంబెరుగు, లక్ష్మణవజ్ఝల యింట రూకకున్
(దీని భావమేమి జ్యోతి గారు అంటే, వారు చెప్పింది -మంచి సన్నన్నము, గోధుమపిండి వంట (రొట్టె), పంచదార, ఆవు నేయి, పెసరపప్పు, అరటి పండ్లు, నాల్గైదు ఊరుగాయలు, పెరుగు ఇవన్నియు ఒక రూకకు లభించును.)


కొత్తావకాయ గారి గురించి మీ అభిప్రాయం ?

అదేంటో వారి పేరు చూడగానే కొత్త ఆవకాయ ఎర్రగా నోరూరిస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడే వేడన్నంలో ఆవకాయ వేసుకుని తిని వచ్చా కాబట్టి నో ప్రాబ్లమ్. ! కొత్తావకాయ కి మించి చవులూరించేది ఇంకోటి ఉండదని అనుకుంటాను !

వేసవిలో ముఖ్యమైనది ఆవకాయ. కొత్తావకాయ పెట్టగానే అన్నీ జాడీలోకి పెట్టేసాక , కొంచం తీసి పక్కన పెట్టుకుని రాత్రికి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ , నూనె వేసుకుని (నెయ్యి వేస్తే చప్పబడిపోతుంది) తినడం. చివర్లో కొద్దిగా పెరుగు తింటే కారం గీరం జాన్తా నై !

మీ బ్లాగులో భోజనానికి సంబందించిన టపాలు ఎక్కువ రాస్తుంటారు. మీరు మాంచి భోజనప్రియులా ? (పేరులోనే, బోజు కూడా వుందే మరి !)

భోజనం అనగానే ముందుగా గుర్తొచ్చేది అమ్మ చేతి వంటె. ప్రతీ అమ్మ అన్నపూర్ణే కదా. భర్త కోసం ఇష్టమైన వంటకాలు చేసిపెట్టు అతనికి ప్రేమతో వడ్డిస్తుంది ఇల్లాలు. అతను ప్రీతికరంగా తింటే తాను తృప్తి పడుతుంది ఆ ఇంతి.

షడ్రుచులు బ్లాగు రాసే మీకు నిజంగా అన్ని వంటలు చేయడం వచ్చా , లేక ఊరికే పుస్తకాలనుండి చూసి బ్లాగే స్తూంటారా చాలామందికి సందేహం ?

అందుకేనండోయ్, నా బ్లాగులో చాలా చోట్ల నేను చేసిన వంటలే ఫోటో లనే పెడుతూంటాను!.
మీకో సంగతి చెప్పనా? అసలు నేను షడ్రుచులు వెబ్ సైట్ మొదలెట్టడానికి కారణం మా అల్లుడే..

మీరు బ్రహ్మాండ మైన వంటకాలు చేసి, వాటి ' టెంప్టింగ్ ఫోటోలు బ్లాగులో పెట్టి, బ్రహ్మచారి బ్లాగర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు జ్యోతక్క తక్షణం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అఖిలాంధ్ర బ్రహ్మచారుల సంఘం తరఫున డిమాండ్ చేసారంటా!

ఒక్క క్షమాపణ మాత్రమె కాదండోయ్ , గుత్తివంకాయ కూర తలా ఒక్కొ బ్రహ్మచారికి హాట్‌బాక్స్‌లో పెట్టి ఇవ్వాలని కూడా డిమాండ్ చేసారండీ! అ టపాల తో, వాళ్ళని నలభీమ పాక ప్రవీణులు గా కూడా చేసానండి!

మగవాళ్లు వంట నేర్చుకోవడంలో ఉన్న లాభాలు చెప్తాను నోట్ చేసుకోండి. ఇష్టమున్న వంటలు చేసుకోవచ్చు.చేయడం రాదంటారా? పుస్తకాలు ఉన్నాయి, నా షడ్రుచులు, ఇంకా ఎన్నో బ్లాగులు,సైట్లు ఉన్నాయి. రెండు మూడుసార్లు చెడిపోయినా పర్లేదు అనుభవం వస్తుంది. ఒక సారి చెడ్డా, అదే కూర బ్రహ్మాండంగా రెండో మారు వస్తుంది. మెస్సులు, హోటల్లకు డబ్బు తగలేసే పని ఉండదు.

పెళ్ళయ్యాక  కూడా ఆవిడ పుట్టింటికెళ్లినా, మీకు ఇష్టమైనది తినాలనిపించినా ఇంచక్కా వంటింట్లోకి ఎంటర్ అయిపోయి వంట చేసుకుని తినేయడమే. ఐనా వంట చేయడం బ్రహ్మ విద్యా? నలభీములదాకా ఎందుకు? ఈనాటి టిఫిన్ బండి ఐనా, చిన్న,పెద్ద, చుక్కల హోటల్లన్నింటిలో మగవారే కదా ఉండేది. ఆడవాళ్లు మీ ఉద్యోగాలు చేయగాలేంది మీరు ఈ వంట చేయడం ఒ లెక్కా? తలుచుకుంటే ఉఫ్ అని ఊదేయరూ? ఆలస్యమెందుకు? గరిట పట్టుకోండి బ్లాగ్ బ్రహ్మచారులు, అయిపోండి బ్లాగ్ పాక ప్రవీణులు!

ఈ టపా చదివే వారికి, ఏవైనా షడ్రసోపేతమైన 'క్రేజీ' కాంబినేషన్ చెబ్తారా ?

పూరీలు కాస్త ఎర్రగా కాల్చుకుని వేడి టీలో ముంచుకుని తింటే,, ఏ స్టార్ హోటల్ బిస్కిట్లు, బ్రేక్ ఫాస్ట్లు పనికిరావు.

మామిడి పండ్ల పానకం తయారు చేసి చల్ల పెట్టెలో పెట్టి . మండే ఎండాకాలంలో ,జిల్లుమనే పానకంలో వేడి పూరీలు కాని, చపాతీలు కాని ముంచుకుని తింటే నా సామిరంగా ఆ మజాయే వేరు.

పెరుగన్నంలో అప్పడాలు చిదుముకుని తినడం.

కమ్మపొడి అన్నంలో కలిపి గుండ్రటి ముద్ద చేసి..కంచంలో పక్కన ఆవకాయనూనె వేసుకొని..దానిలో ముంచుకొని తింటే..ఆహా!

చల్లపులుసులో కొత్తిమీర.. పచ్చిమిరపకాయ... ఆహా....

కందిపచ్చడిలో ఆవకాయ కలిపి తింటే..చెప్పలేం దాని రుచి

బోలెడంత వేరుసెనగ చట్నీ లో ఒక 'చిన్న' ఇడ్లి.."
కమ్మటి గడ్డ పెరుగులో వేడి వేడి జిలేబీలు? భలే ఉంటుంది. జిలేబీలు టీలో ముంచుకుని తినడం !

పెరుగు అన్నం లోకి ముద్దపప్పు...ఇడ్లి లోకి చారు....దోసెలు బెల్లం పులుసు..

ఇలా చెప్పుకుంటూ పోవచ్చండీ !

సంక్రాంతి పల్లెటూళ్ళలో చేసుకున్న అనుభవాలు మీకు వున్నాయా ?

నాకు పల్లెటూరి అనుభవం లేదు కాని పట్నం కబుర్లు చెప్తాను. నా చిన్నప్పుడూ సంక్రాంతి పండగంతా నాదే. మామూలుగా ఇంటి పని చేయని నేను సంక్రాంతి నెలరోజులు మాత్రం ముగ్గులు పెట్టేదాన్ని, పెళ్ళయ్యేవరకు కూడా. పండుగ నెలరోజుల ముందునుండే రకరకాల ముగ్గులు కలెక్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, స్నేహితుల వద్ద కూడా నేర్చుకోవడం ఇలా సరదాగా గడిచేది. రోజూ ఎనిమిదివరకు లేవని నేను ఆ నెలరోజులు చలి ఉన్నా కూడా
ఐదింటికే లేచి, శుభ్రం చేసిన వాకిలిలో రోజుకొక ముగ్గు వేయడమంటే భలే సరదాగా ఉండేది. చీకటిగా ఉన్నా భయమేసేది కాదు ఆ రోజుల్లో. అప్పుడప్పుడూ నేను ప్యాంటు షర్టు వేసుకుని ముగ్గు వేస్తుంటే అందరు వింతగా చూసేవారు. ముఖ్యంగా పాలకోసం వెళ్ళే మగవారు!~(వాళ్ళ కామెంటులు ,- ఆ ముగ్గులు చూసి , ..ఎన్ని రోజులైందో అంత perfect geometry చూసి లాంటివి విని నవ్వేసేదాన్ని!)

ఆ రోజుల్లో పతంగులు చాలా హుషారుగా ఎగరేసేవారు. ఆకాశం నిండా రంగు రంగు పతంగులు, అరుపులు , పిల్లలందరు డాబాలపైనే ఆ రోజంతా. ఇంకా పతంగులకు రక రకాల తోకలు కత్తిరించి పెట్టడం. కనుమ రోజు నేను మా తమ్ముళ్ళుకలిసి మిగిలిన ఆ రోజుల్లో సరదాలే వేరు!

మీ శ్రీ వారి పేరు , మరి వారి గురించి చెబ్తారా ?

ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి? పాపం కదూ? ఆయన ఫోటో సరియైనది లేకపోవడం వల్ల ఆయనకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను.

ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు.

ఎప్పుడైనా వంట బాగా లేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం 'బా గుంది' అనరు. కామ్‌గా తినేసి వెళ్లిపోతారు.

మీ వారినీ అడిగామండీ, ఇదే ప్రశ్న, వారిచ్చిన సమాధానం చెప్పమంటారా!

చెప్పండి. అందులో ఏముంది. !

(జ్యోతి వారి శ్రీ వారు చెప్పింది - జ్యోతి కి మాత్రం ఇది చెప్పకండేం , అని వారు చెప్పింది-

నేను ఇంట్లో సీరియస్‌గా ఉంటాను అంటుంది. కాని తను ఎప్పుడు చూసినా ఆ బ్లాగుల్లో ఏదో బర బర రాసుకుంటూ, సీరియస్ గా వుంటుంది. ఏదో నిజంగా జరుగుతున్నంతగా లీనమై పోతుంది. ఎవరితోనూ మాట్లాడదు. పైగా వాటి గురించి ఇరుగు పొరుగు అమ్మలతో చర్చలు అదీ కంపూటర్ లోనే !

ఏదో పెళ్లయిన కొత్తలో వండిన కూరలు బావున్నాయంటే ఇక ప్రతీ రోజూ చెప్పాలా.అసలే ఆఫీసుకెళ్లే టెన్షన్‌.వంట బాగోకుంటే కోపం రాదా చెప్పండి ?)


మీకున్న బ్లాగ్ గుర్తింపు గమనించి, TRS వారు, మా నారా వారు, తమ తమ పార్టీ లకి 'అంతర్జాల ' బ్లాగ్ వాణి' గ ఉండమని రిక్వెస్ట్ చేసారంటా ?

బాగా చెప్పారండీ మీరు మరీను ! అది 'కోతల రాణి పెందరాళ కన్న కల ! అస్సలు ఈ రాజకీయాలంటేనే నాకు పడదు.
ఆ టపా రాసాక, అసలు ఒక్కసారైనా ట్రై చెయ్యొచ్చు గదా రాజకీయాల్లోకి, మా జ్యోతక్క అంటూ చాల మంది అడిగారు. ఎందుకండీ అని అడిగితే, మాకు జ్యోతక్క బాగా తెలుసు అని మేము చెప్పుకోవచ్చుగాడా అని చెప్పారు ! వాళ్ళ మాటలని నమ్మి నేను రాజకీయం లో వెళ్లి వుంటే!

మీరు 'శ్రీ వారలకు ' ఇచ్చే సలహా ?

"ఎం! మొగుడో ! ఏమో ! పెళ్ళానికి మూరెడు మల్లె పూలు తేడు ! మణులడిగానా , మాణ్యాలడిగానా ? అలిగిన ఇల్లాలిని మస్కా కొట్టడానికి మల్లెపూలకు మించిన సాధనం లేదేమో. ఈ కిటుకు ఎంతమంది భర్తలకు తెలుసు?
మధురమైన సుమధురమైన చల్లని సువాసనతో మరులు గొల్పే మల్లెపూలు మండే ఎండాకాలంలో ఎందుకే పూస్తాయి?
ఆలోచించి చూడండి. 'When the things go hot, ఓ చెండేడు మల్లెపూలతో మీ ఇంటి కెళ్ళి చూడండి. ఆ తరువాత మీరే 'హాయి హాయి' గా అంటూ పాడేసుకుంటారు !

మీరు కొత్త గా వచ్చె బ్లాగర్లకి ఇచ్చే సలహా ?

మీరు మీ రంగంలో అత్యుత్తమమైన విజయాలను స్వంతం చేసుకోవాలన్నా, యావత్ ప్రపంచం మన్ననలనీ పొందాలన్నా లక్ష్యాన్ని సాధించడంలో రేయింబవళ్ళూ కష్టపడడానికి తోడు మీ ప్రయత్నంలో వైవిధ్యతను ఆపాదించుకోవాలి.


ఫలానా వ్యక్తి ఫలానా విధంగా కష్టపడ్డాడు. కాబట్టి అదే మార్గాన్ని అనుసరిస్తే మనమూ సక్సెస్ అవుతాం అన్న ధోరణి మీ ఉనికినైతే కాపాడగలుగుతుందేమొ తప్ప మీకంటూ "మీకో" ప్రత్యేకత ఆపాదించ లేరు. కాబట్టి మీ కంటూ ఓ ప్రత్యేకతని కలిగించుకోండి. The idea is that "being different" from the set path.

మా ఏడుకొండల వాడి గురించి మీ అభిప్రాయం ?

మాకు పాతికేళ్ళ నుండి ప్రతి సంవత్సరం తిరుపతి కి వెళ్ళే అలవాటు ఉంది. అలా అయినా కాస్త విహార యాత్ర లాగా ఉండేది. తిరుపతి నుండి మరి కొన్ని ప్రదేశాలు కూడా వెళ్ళే వాళ్ళం.తిరుపతి ప్రయాణం అంటే ఒక గొప్ప అనుభూతి ఉండేది. అప్పట్లో ఇచ్చే ప్రసాదాలు ఇక చెప్పనక్కరలేదు. ఇరవై పెద్ద లడ్డూలు, ఇరవై గారెలు, ఇరవై వడలు, అన్న ప్రసాదాలు ( పులిహోర, చక్రపొంగలి, దధ్యోజనం, పొంగలి) ఇలా ఇచ్చేవారు. ఆ సువాసనలు ఇప్పుడేవి...అలా నింపాదిగా స్వామిని చూసే అదృష్టం కోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చు అనిపించేది. ఎన్.టి.ఆర్ కాలంలో ఐతే అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ముఖ్యంగా అప్పటి E.O ఫై.వి.ఆర్. కే ప్రసాద్ గారు తిరుమలలో అవినీతి అనేది మచ్చుకైనా కనపడకుండా చేసారు.

మరి ఇప్పుడు తిరుమల అంటే అవినీతి సామ్రాజ్యం ఐపొయింది. సిఫారసులు కావాలి. సరే అలా ఖర్చు పెట్టి వెళ్ళినా దేవుడిని కనీసం ఒక్క నిమిషం కూడా చూడనివ్వరు.మొదటి ద్వారం దగ్గరనుండే పదండి పదండి అంటూ తోసేయడమే. కలికాలం అంటే ఇదే మరి. భక్తులు డబ్బులు వేయగానే రొంటిలో దోపుకోవడం. ఇదీ తంతు. కళ్యాణం ఐతే మరీ మొక్కుబడిగా చేస్తున్నారు. రెండు లడ్డులు, రెండు గారెలు ఉన్నా కవర్ మన మొహాన పడేసి , తాంబూలాలిచ్చేసాం ఇక తన్నుకు చావండి అన్నట్టు మూటా ముల్లా సర్దుకుని వెళ్ళిపోతారు. ఇపుడు తిరుమలలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మొత్తం కమర్షియల్ . ఇన్ని కష్టాలుపడి వేంకటేశ్వరుడిని చూడాలని వెళ్తే లాభమేంటి ? కళ్ళారా చూడనీకుండా తోసేయడం. మరి ఎందుకు వెళ్ళడం?? ఇందు గలడందు లేడను సందేహము వలదు . చక్రి సర్వోపగతుండు. అని నా మనస్సుకు చెప్పెసుకున్నా.


మీ కంటూ వున్న కలలు ?

హైదరాబాద్ మహానగరంలో ఉన్న నీటి సమస్య తెలియనిదెవరికి. రోజుకు అరగంట వచ్చే నీళ్ళతో ఎన్ని అవసరాలు తెర్చుకోవాలి. అప్పుడే బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఇంకా పట్టిపెట్టుకోవడం.. హాయిగా స్నానం చేసే అదృష్టం కూడానా. బకెట్ నీళ్ళతో స్నానం పూర్తి చేసుకోవాలి. అదే ఈతకొలను, వానజల్లు అనుకుంటూ. ఐనా " జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా! అహ ఏమి ఆ ఆనందం !

కొండల నడుమ ఎటువంటి శబ్ద కాలుష్యం లేని చోట, చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఒక చిన్ని ఇల్లు.ఇంటివెనక ఒక ఈత కొలను. ఎండాకాలంలో చల్లగా, చలి,వాన కాలంలో గోరువెచ్చగా ఉండే నీళ్ళు.హాయిగా పాత పాటలు వింటూ ఒక్కదాన్నే ఈత కొడుతూ, పక్కనే ఓ షాంపేన్ బాటిల్, వేయించిన జీడిపప్పు పెట్టుకుని సిప్ చేస్తూ (మావారికి చెప్పకండే) ఎంజాయ్ చేయాలని నా తీరని (అస్సలు తీరే చాన్సే లేని) కోరిక. కలలోనే కదా నో ప్రాబ్లం.!

బ్లాగడం గురించి మీ అభిప్రాయం ?

బ్లాగడం ఇప్పుడో నిత్యావసరం. అందులోనూ తెలుగువారికి అన్నంలో ఆవకాయంత అత్యవసరం! ఆలస్యమైపోయినా ఫర్లేదు ... వెంటనే బ్లాగ్ మొదలెట్టండి! అవసరమైతే బ్లాగ్ గురువు చూడండి!

మీ పుణుకులు చాలా పాపులర్ ! మచ్చుకకి ఒక్కటి చెప్పండి ?

ఒక కూరగాయ అందరినీ చాలా మర్యాదగా తిడుతుందంట. ఏంటది???

మనిషి ఎలా బతకాలంటారు ?

మనిషి ఎలాగయినా బ్రతకవచ్చు కానీ మానవత్వ విలువలను కాపాడుతూ బ్రతకటమే నిజమయిన బ్రతుకు.

అన్ని దానాలలో ఏది గోప్పదానం అనుకుంటారు ?

ఆకలి అన్నవాళ్ళకి అన్నం పెట్టడం, దాహం అన్నవాళ్ళకి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయవలసిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదని అనుకుంటాను.

ప్రమదావనం లో బ్లాగులు ఇవీ రాసుకోవడమేనా? లేక ఇంకేమైనా చేస్తుంటారా మీరు ?

ప్రమదావనం అనేది మహిళా బ్లాగర్ల గ్రూపు. ఇందులో సభ్యులు సహాయ కార్యక్రమాలు చేస్తున్టారండీ.

కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. కాని ఎందరో అభాగ్యులకు ఇది అందని ఫలమే.. కూడు ఎలాగో దొరికినా, గూడు లేకున్నా ఎక్కడ కాసింత జాగా దొరికితే పడుకుంటారు.. కాని గజ గజ వణికించే చలిలో దుప్పటి లేకుండా పడుకునే వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తారు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాన్ని చూసి, చలించి, వారికి ఇతోదికంగా సహాయం చెయాలని ప్రమదావనం సంకల్పించింది.

ఐతె ఎవరు వారు? ఎచటి వారు? అనే వివరాలు అడగకుండా, చెప్పకుండా నిశ్శబ్దంగా సహాయం చేయాలని నిర్ణయించాము. పదివేల విలువైన ఉలెన్ రగ్గులు కొని ఈ కార్యక్రమం నిర్వహించాము.

ఉదయం మూడుగంటలకు బయలుదేరి ఫుట్ పాత్ ల మీద, దుకాణాల ముందు చలికి ముడుచుకుని పడుకున్నవారికి నిద్రాభంగం కలగకుండా దుప్పట్లు కప్పేసి వచ్చేసాము.

ఈ మీ పుట్టిన రోజున, పాతకాలపు మిత్రులు, బ్లాగర్లు తాత్కాలికం గా బ్లాగుల నిలిపిన వారి ని మీరెలా స్వాగతిస్తారు ?

రండి,రా రండి పాత బ్లాగు వీరులారా,
టపాల రెక్కలపై ఎగిరిరండి.
చిరకాల అనుభవ శూరులారా,
కొత్త వారలను కలుసు కొండీ, కలుపుకోండీ!
మీ కిదే మా మనసుల పునః స్వాగతం ! సుస్వాగతం !

జ్యోతి గారు,

మామూలు గృహిణి స్థాయి నుండి మీరు బ్లాగ్లోకంలో ఎంత గొప్ప స్థానానికి చేరారో ఇంతకాలం మీ ద్వారా సాయం పొందిన వారికి, మీ మంచితనం తెలిసిన వారికి తెలుస్తుంది. మీలో కష్టించి పనిచేసే స్వభావం మాలాంటి బ్లాగర్లకు ఆదర్శం. మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వెలిగే దీపం మరిన్ని దీపాల్ని వెలిగిస్తుందన్న మాట నిత్య సత్యం. చురుకుదనం,ప్రోత్సాహం,అణకువ,మర్యాద,విఙ్ఞానం,దూరదృష్టి, సమయసద్వినియోగం ఇలాంటి పదాలు చూడాలనుకున్న వారికి మీరు ఒక నడయాడే ఉదాహరణం.

నేటి మీ జన్మదినం,కోటి వరాల కానుక కావాలని,తల్లిదండ్రులు, గురువుల దీవెనలు మీపై కలకాలం వర్షించాలని, మిత్రుల అభినందనలతో , కుటుంబమనే నందనవనంలో , నిత్యకళ్యాణం - పచ్చతోరణం గా జ్యోతిగా కాంతులు నింపాలని మీ పెదాలపై చెదరని చిరునవ్వు తాండవమాడాలని.... మనసారా ఆకాంక్షిస్తూ,
శుభాకాంక్షలతో

Concept by Zilebi
జేకే - JUST KIDDING !
ABN - Active Bloggers Network
- ఆంధ్ర  జిలేబి - ఇంకెవరు నేనే !
చీర్స్
జిలేబి.

Saturday, December 17, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 6 - (భామా విజయం 1 )

ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం. టెర్మినల్ ఒకటి. తెల తెల వారి పోతోంది. బయట మంచు తెల్లటి తివాచీ లా పరుచుకొని వుంది. మత్తుగా 'సోనెన్' కిరణాలు మంచు పై పడి మధుర వేణువులు పలికిస్తున్నాయి కమ్మ తెమ్మర తోడు రాగా.


"హల్లో బుజ్జి పండూ, ఐ యాం బులుసు " అన్న మాటలు వినిపించి బుజ్జి పండు చదువుతూన్న 'విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు' పుస్తకాన్నించి బయటపడి తలెత్తి చూసాడు తన హారీ పాటర్ కళ్ళద్దాల లోంచి.

అరవై ఏళ్ల పై బడ్డ మనిషైనా చలాకీగా కనబడుతున్నాడు ఓ పెద్దాయన.
కంటికి జోడు కళ్ళద్దాలు. ఫుల్ సూటు.
కాళ్ళకి సాక్స్ మీద హవాయి చెప్పులు .
చేతిలో సిగారు.
మరో చేతిలో చిన్ని బ్రీఫ్ కేసు.
పెదవుల పై ము.ము.న.

ఫక్కున నవ్వు వచ్చేసింది బుజ్జి పండు కి ఈ పెద్దమనిషి ని చూస్తూనే ! అసలు పేరు చెబ్తేనే జనాల పెదవుల మీద చి.న. రాగా లేనిది , ఆ పెద్దాయన ని కంటి ఎదుటే వున్నాడు, అదీ తనను తాను పరిచయం చేసుకుంటూ.

వీరి ఇద్దరి మధ్యా ఈ మీటింగు ఫ్రాన్కఫర్టు విమానాశ్రయం లో జరగటానికి కారణం ఏమిటి? దీని వెనుక ఎవరి ప్రోద్బలం వున్నది అన్నది తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజుల మునుపు వెళ్ళాలి.

కొన్ని రోజుల మునుపు....

జర్మేనీ మ్యూనిచ్ మహానగరం. శ్రీ కృష్ణుల వారి మీద  రీసెర్చ్ లో  తలమునకలయ్యే పనుల్లో కూరుకు పోయి, బ్లాగులో ఇవ్వాళ ఏమి రాయాలో అన్న మధుర ఆలోచనల లో నిమగ్నమైన మధురవాణీ గారికి ఇండియా నించి ఫోన్ వచ్చింది.

" హాయ్, మధురా, కృష్ణ ప్రియని "

"ఊ "

"బులుసు వారు ఐరోపా వస్తున్నారు "

"ఊహూ"

"నీ హెల్ప్ కావాలి "

"ఊ"

"మా ఆర్ముగం పారీసు లో వున్నాడు. తన్ని ముఖాముఖి చెయ్యడానికి బులుసు వారు ఐరోపా వస్తున్నారు. డైరెక్ట్ గా పారీస్ కి వారికి కుదరలేదు. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ హాల్ట్ అక్కడ్నించి వెళ్ళాలి "

ఇప్పటికి మధుర మళ్ళీ భువి పై మ్యూనిచ్ నగరానికి , మన  లోకానికి వచ్చింది, ఊ, ఊహూ ల మధ్యనించి బయట పడి.

"కృష్ణా నీవేనా ! నీవేనా నను పిలచినది ! " అని , మళ్ళీ 'ఊ' హా' లోకం లోకి  జారుకోబోయి, పిలిచింది కో-బ్లాగిణి కృష్ణ ప్రియ అని గుర్తుకు వచ్చి,

"ఏమన్నావ్, ఏమన్నావ్, మళ్ళీ ఇంకో మారు చెప్పవూ " అంది మధుర. 

ఈ మారు కృష్ణ ప్రియ తల పట్టుకుని,  'మధుర వాణీ , అని పేరు పెట్టుకున్నావ్ కాబట్టి నీకు అన్నీ రెండేసి మార్లు చెప్పాలే  సుమా , అని మళ్ళీ మొదట్నించి మొదలెట్టింది.

అప్పటికి మధుర వాణీ, బుర్రలో వెలిగింది , వస్తున్నావారు  ఎవరు అన్నది.

బులుసు గారు వస్తున్నారోచ్ ! అన్న వార్త వినగానే, మధుర  ఆనందం ఇంతై వటుడింతై అన్నట్టు ఆకాశానికి అంతే లేదన్నట్టు అయ్యింది.

"బులుసు గార్ని నువ్వు ఫ్రాంక్ఫర్ట్ లో కలిసి అక్కడ్నించి వారిని నువ్వు ఐ సి ఈ ట్రైన్ లో పారీస్ కి అకంపనీ అవుతావా? " అంది కృష్ణ ప్రియ.

"కుదరదు. వార్నీ మ్యూనిచ్ కి లాక్కోచ్చేస్తాను. ఆపై ఓన్లీ పారీస్ " అని ప్లాన్ మార్చమంది మధుర వాణీ.

ఈ కొత్త ట్విస్ట్ తో కృష్ణ ప్రియ సరే నాకు కొన్ని గంటలు టైం ఇవ్వు అని నాలుగైదు కాల్స్, చాట్,మెయిల్ ' బులుసు వారికి నడిపి మొత్తం మీద  కొత్త ప్లాన్ కి నాంది పలికింది. బులుసు వారిని ఫ్రాంక్ఫర్ట్ ఏర్పోర్ట్ నించి మధుర పిక్ అప్ చేసుకుని మ్యూనిచ్ వెళ్తుంది అక్కడ కొన్ని రోజుల బస తరువాత బులుసు గారు పారీసు వెళ్తారని.

ఈ సంఘటన జరిగిన రెండో రోజులకి మధుర వాణీ కి మరో ఫోన్ - ఈ మారు అమెరికా నించి - జ్యోతిర్ మాయీ వారి దగ్గిర్నించి. "మధురా, మా బుడతడు, తెలుగు చదువు ముగించి, అమెరికా వస్తున్నాడు. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ లో ఫ్లైట్
లే ఓవర్ లో వుంటాడు. కలుస్తావా అతన్నీ ? " అని.

"బుజ్జి పండుమని కలవమని రిక్వెస్ట్ చెయ్యవలెనా జ్యోతిర్, జస్ట్ ఆర్డర్ ఇవ్వండీ, " అని మధుర చెప్పి, ఎప్పుడు వస్తున్నాడు అంటే, బుజ్జి పండు రాక, బులుసు గారి రాక ఒకే రోజున అని తేలింది.

"బుజ్జి పండుని నేను మ్యూనిచ్ కి పిలుచుకెళ్ళనా ? "

"ఓహ్, నో, తను క్రిస్టమస్ కి అమెరికా లో వుండాలన్నాడు- కాబట్టి కుదరదు" జ్యోతిర్మయి చెప్పారు.

"ఓహ్, ఐతే , నాకూ కుదరదే " అని " వీలయితే చూస్తాను  " అని చెప్పి, మనసులో, బుజ్జి పండు ని బెర్లిన్ కి కిడ్ నాప్ చెయ్యడానికి ప్లాన్ తయారు చేసుకున్నారు మధుర వాణి.

దాని పర్యవసానం ఈ బులుసుగారి 'హల్లో బుజ్జి పండు ఐ యాం బులుసు " అన్న ఈ మాటలు.

(ఇంకా ఉంది)

Friday, December 16, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 5 - (శంకర విజయం - 4 )

సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జేప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !  బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .

గులువులు హనుమచ్చాస్లీ గాలికి నమస్సులు.

" అజాడ్యం వాక్ పటుత్వం చ హనూమత్ స్మలనాత్ భవేత్ " అని మా మాత చెప్పాలు.  మీలు వాలి నామధేయులు. కావున మీ స్మలణతో మా మాత గులించి చెబుతాను -

"నడకలు నేల్పెను
నడవడికలు నేల్పెను
నడతను నేల్పెను
బుడి బుడి నడకల
బుజ్జి పండు
బుద్ధుడే అవుగాక ! అని మా మాత నాకు అన్నియు నేల్పెను" అన్నాడు బుజ్జి పండు.

గోలి వారికి ఈ బుడతడు హనూమంతుడు కన్న రాముడే అయ్యాడు ఆ బుజ్జి పలుకులు విని.

ఈ మారు చింతా వారు, 'ఈ గోలీ వారూ బోల్తా పడ్డారే సుమీ ' అని బుజ్జి పండు ని వుద్దేశించి,

" బుజ్జి పండు - అమెరికా దేశములో తెలుగు నేర్చుకొనుటకు ఎన్నో పుస్తకములు వున్నాయి కదా ? వాటితోనే నీవు నేర్చుకోవచ్చు గదా ? ఇలా శంకరాభరణం కొలువు లో అంతర్జాల వాసం అవరసరమా ? " అని బుజ్జి పండుని 'పరి' శోధించారు!

దానికి బుడతడు, క్షణ మాత్రములో , "చింతావాలు! మస్తకమును మించునే పుస్తకమ్ము " అని తడుముకోకుండా జవాబు చెప్పాడు.

బుజ్జి పండు అంత వేగం గా తనకు సమాధానము చెప్పునని  చింతా వారు ఎదురు చూడ లేదు !

అయినను కొంత కాలం మునుపే ఈ శంకరాభరణం సదస్సు 'మస్తకమ్మును మించునే పుస్తకమ్ము ' అని ఘంటా పధం గా ఘోషించింది కూడాను! కాబట్టి వేరుగా చెప్పనలవి కాదు !

పండిత నేమాని వారి వైపు సభా సదస్సు చూసింది. శంకరార్యులు కూడా చిరు నవ్వు నవ్వుతూ, ' ఆర్యా ! పండిత నేమానీ సన్యాసీ రావు గారు మీ అభిప్రాయం ? " అన్నారు.

పండిత నేమాని వారు సభను ఉద్దేశించి,

మిత్రులారా!

పద్య కవిత్వము ఎవరికి అలవడును అని ఒకపరి పరికించుచో -పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు ఒక పాదము కూడా చెప్ప లేక పోవచ్చును;  సామాన్యులైన వారు చక్కని సహజ కవిత్వముతో  జనరంజకమైన కవిత్వమును చెప్ప గలుగుచున్నారు.  వాగ్దేవి యొక్క సంపూర్ణ  అనుగ్రహము మరియు పూర్వ జన్మల సంస్కారము గలిగిన వారికి పద్య  కవిత్వము అబ్బును. ఈ  మంచి యోగమును ఈ బాలుడు పొందిన వాడిలా వున్నాడు.  మనము ఈతనికి చదువులు నేర్పుతూ ఇంకా  ప్రోత్సాహముతో ముందు సాగుదాము అన్నారు.

ఈ పలుకులు విని

చింతా వారు ఆనందోత్సాహముతో ,

" వరహృదయమ్మునన్
తెలుగు భాషను చక్కగ నభ్యసించి చాతురి
మెరయన్ కవిత్వమున దొడ్డతనమ్మును
జూపుచున్ సుధీవరుల ప్రశంసలొందు బుజ్జి పండూ" అని ఆశీర్వదించి, నిరతము వృద్ధి చెందుచును నీ కృషి యిచ్చును సత్ఫలమ్ములన్ " అని మెచ్చు కున్నారు కూడాను.

సురా బ్లాగీయం సుబ్బారావు గారికి బుడతడి నడవడిక, నడత, మాటలు చాలా నచ్చాయి. వారు వెంటనే ఆశువుగా
"తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ? "

అని బుజ్జి పండు మాతని కొనియాడి, బుజ్జి పండుని మనసారా ఆశీర్వదించారు !

శంకరార్యులవారు, సభనుద్దేశించి,

మన భాషా పండితులు అందరూ కూడా అంకిత భావంతో భాషాభిమానంతో భాషాసేవ చేస్తూ తమను నమ్మి తమదగ్గర విద్యకొఱకు వచ్చే విద్యార్థులకు ధర్మ బద్ధంగా విద్య గరుపుతూ ఆంధ్రవిద్యార్థులకు ఆంధ్ర భాషాభిమానం పెరిగేలా చేయాలన్న కోరికతో ఉన్నవారే ! వారు గురుతరమైన గురువు భాద్యతలను నెరవేర్చి, బుడతడైన బుజ్జి పండుని తమ తమ విధానాల మూలముగా తమ శిష్యునిగా చేసుకోనటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది.
తెలుగు వారంత కలసిన వెలుగు బాట , మలచి పూయించి వచ్చు మావి తోట ! తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు , యెచట నున్నను గెలుపొందు రచటె వారు! కాబట్టి ఈ బుడతడైన బుజ్జి పండుని మన సభా ప్రాంగణమున మనము మరింత తెలుగు నేర్చుకొనుటకు, మనము ప్రోత్సాహము ఇచ్చెదము !

లక్కాకుల వారు మొదట చెప్పారు- మనము నది అయి ప్రవహించా లని. మనము జీవ నదులమై ఈ భువి మండలమున తెలుగు వ్యాప్తికి మన వంతు కర్తవ్యం నేరవేర్పుదాము ! ఈ బుజ్జి పండు రాక మన సభా స్థలి కే వన్నె తెచ్చినది. అని చెప్పి బుజ్జి పండు వైపు తిరిగి


"శతమానం భవతి  బుజ్జి పండు" అని మనసారా దీవించారు.

ఇందరి గురువుల ఆశీర్వచనములతో బుజ్జి పండు రేఫా లోపమూ మాయమై పోయినది.

శ్యామలీయం వారు, లక్కాకులవారు చేతిలో చేయి వేసి సభాష్ అని భుజాలు తట్టుకున్నారు

రాజేశ్వరీ అక్కయ్య గారి గురించి చెప్ప వలెనా ?

చిన్న నాటను చేయగ చిలిపి పనులు , తల్లి చాటున ముద్దుల తనయు డనగ, ఈ బుజ్జి పండు ఎదుగ వలె జగద్గురు వనంగ! అని మనసారా కోరుకున్నారు వారు !

సభా స్థలి లో గణ గణ గంట మోగింది.

బుజ్జి పండు ఆశువుగా  అందుకున్నాడు. 

గదిని గోడకున్న గడియారమున గంట,
చర్చి గంట, పాఠశాల గంట,
గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
టంట, టంట, టంట, టంట, టంట. !!!


శ్రీ పతి వారు స్వస్తి వాచకము పలికినారు.

శ్రియే జాత శ్రియ అనిర్యాయ శ్రియం వయో జనిత్రుభ్యో దధాతు !
శ్రియం వసాన అమృతత్వ మాయన్  భజన్తి సద్యః  సవితా విధధ్యూన్ !
శ్రియా ఏవైనం తచ్చిద్రియా మా ధదాతి !
సంతత మృచావషట్ కృత్యం సంతతం సదీయతే ప్రజయా పశుభిహి!
య ఏవం వేద !

ఇంతటి తో బుజ్జి పండు తెలుగు చదువు లో  శ్రీ శంకర విజయం అను అంకము సమాప్తము.


బుజ్జి పండు శంకరాభరణ కొలువులో  తెలుగు పరి పూర్ణముగా నేర్చుకుని, తిరుగు దారి అమెరికా కి పట్టాడు.

మధ్య దారిలో ఆతని విమానము ఫ్లైట్ లే ఓవర్ లో , జర్మెనీ దేశంలో  ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం లో ఆగింది. లే ఓవర్ సమయం లో బుజ్జి పండు కునుకు తీస్తూండగా 'కిడ్' నాప్ కాబడి నాడు. !

దీనికి మూల కారకులు  కొందరు భామలు ! వారిలో  సూత్రధారి అయినవారు  మధుర వాణీ గారు - జెర్మనీ  వాసులు !

వారు 'ఈ' కిడ్ - నాప్ ఎందుకు చేసారు ? దాని కథా కమామీషు ఏమిటి ? రాబోవు అంకము- బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం  కై వేచి  చూడుడు.!


(సశేషం)

Thursday, December 15, 2011

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే- సరి కొత్త ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే

 సరి కొత్త

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

మీ అభిమాన బ్లాగర్ తో

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

బ్లాగ్ముఖీయం !

ఎవరా బ్లాగర్ ?

ఏమిటి వారి గొప్పదనం

ఇది ఒక

ABN- ఆంధ్ర జిలేబి సహ సమర్పణ

స్పాన్సరేడ్  బై

వరూధిని బ్లాగ్స్పాట్ డాట్ కాం

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్!

say చీస్ to  జిలేబి !

చీర్స్
జిలేబి.

Wednesday, December 14, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 4 - (శంకర విజయం - 3)

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

శ్యామలీయమైన నెమిలి పై నుంచి బుజ్జి పండు నిదానముగా దిగాడు.

ఆతన్ని జూసి సభా స్థలి అచ్చేరువొందింది. ఈ బుడతడి ముఖమున ఏదియో తెలియరాని జ్యోతి (ఆ మాత జ్యోతిర్మయీ మహత్వమేమో ?)  ప్రస్ఫుటిస్తోంది.

ఇది అని చెప్ప నలవి కానిది.

షణ్ముఖుడు పంచకక్షం కట్టినవాడు.

ఈ బుడతడు జీన్స్ ప్యాంటు పై టీ షర్టు ధారి యై వున్నాడు.  కంటికి హారీ పాటర్ అద్దములు కూడాను. నెత్తి పై నామము. కాలికి నైకే షూస్.

షణ్ముఖుడు వేలాధయుడు. ఈ బుడతడు శర్కరీ ధారీ !

 ఒక చేత శర్కరీ , మరియొక్క చేత అంకోపరుండై వున్నాడు వీడు.

బుజ్జి పండు  సభా స్థలి కి ప్రణమిల్లి ,

"సభ యందు  వెలసిల్లిన పెద్దలన్దలికీ నా నమస్కాలములు ! నా పేలు బుజ్జి పండు , నేను మీ చెంత తెలుగు  నేల్చు కొనవలె నని మా మాత ఆదేశానుసాలముగా ఇచ్చటికి వచ్చితిని " అని,

రాజేశ్వరీ అక్కయ్య వారి వైపు తిరిగి , " నమో మాతా , నమో నమః ! పెద్దమ్మ వాలికి నమస్సులు " అని 'స్పెషల్' గా నమస్కరించడం తో రాజేశ్వరీ అక్కయ్య వారు తబ్బి మొబ్బిబై 

"రారార కన్నయ్య , రార వరాల పంట, రారార గారాల పట్టి ,తెలుగు నేర్వంగ " అని మురిసి పోయింది.

సభాస్థలి బుడతడి వైపు ఒక్క మారు , రాజేశ్వరీ అక్కయ్య వైపు ఒక్కమరూ చూసింది. 

ఈ మాతలు ఎల్లప్పుడూ వెన్నె హృదయులే సుమా అని అచ్చెరువొంది న వారు, వీరు వెన్నపూసై కరిగి పోవడానికి అర నిముషము చాలు సుమా అని తీర్మానించు కున్నారు.

బుజ్జి పండు ఈ మారు శంకరార్యులవైపు తిరిగి నమస్కరించి,

"అందమగు బ్లాగు నిలిపిలి యందలి
హ్లుదయముల నిలిచి యానందము
పెంపొందిచిన గులువు గాలికి
నమస్సులు కవివల , జేజే"

అని సాదర ప్రణామము గావించాడు. 

ఈ మారు  శంకరార్యుల వారికి సందేహం వేసింది,  " ఈ బుడతడు, మరీ తన బ్లాగు మొత్తం పరిపూర్ణముగా శోదించి వచ్చి వున్నాడేమో సుమీ " అని సందేహ పడిన వారై చిరునగవు ఒకటి నొసగి పండిత నేమాని వారి వైపు జూసినారు, ఆర్యా మీరు ప్రశ్నింపుడు బాలకుడిని అన్న చందాన.

పండిత నేమాని వారు, ఔరా , ఈ శంకరార్యుల వారి చాతుర్యమే చాతుర్యం - అన్నిటికీ నన్నే ముందు వుండమనటం అనుకుని,

ప్రకాశాముగా  " బాలకా, నీవు ఇచ్చట తెలుగు నేర్చుకొనుటకు మీ మాత పంపగా వచ్చినావని మా శ్యామలీయం మాష్టారు జెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ వచ్చినవాడివి ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చి నావే" అని ధర్మ సందేహం లేపారు.

అసలు బాలకా నీవు నిజంగానే నేర్వడానికి వచ్చినావా అని వారు నేరుగా అడిగి ఉండవచ్చు. కాని సూక్ష్మం గా వారు ఈ లా ప్రశ్నించారు. అది వారి చాతుర్యం.

బుజ్జి పండు తడుము కోకుండా టపీ మని,

" అయ్యా పండిత నేమానీ గులువా - హస్తభూషణముగ అంకోపలుండగా  పుస్తకం బదేల హస్తమందు?" అని చిరు నగవుతో జెప్పి "అయ్యా చేత మా మాత నొసంగిన 'శల్కలీ ' సహిత ఇచ్చట వచ్చి వున్నాను ' అన్నాడు.

ఈ బాలకుడి రేఫమును ఎటుల సరి దిద్ద వలె నని శ్యామలీయం మాష్టారు తీవ్రముగా ఈ మారు చింతించడం మొదలెట్టారు.

" ఆర్యా, పండిత నేమాని వారు , ఆ బుడతడు శర్కరీ అన్న పదాన్ని అలా 'శల్కలీ' అన్నాడు. రేఫాలోపము అంతే.
ఒక చిన్న సందేహము నాకు ఇది దుష్ట  సమాసమేమో " అన్నారు శ్యామలీయం వారు - నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయిపోతున్నానే సుమీ అని కొంత నివ్వెర పడుతూ.

ఆ రేఫా లోపమును మీరి ఆ బుడతడు జెప్పిన సమాదానమునకు పండిత నేమాని వారు సంతసించి,

" శ్యామలీయం మాస్టారు, మీ సందేహ నివృత్తి వేరుగా చర్చించ దెము , ముందు ఈ బుడతడి సమాధానం మాకు బాగుగా నచ్చినది " అని ఆప్యాయముగా తన మనవణ్ణి జూసినంత గా బుజ్జి పండుని గాంచి నారు పండిత నేమాని వారు. మనవళ్ళ వయసులో వున్న పిల్లలని గాంచిన తాత గార్లకు ఎల్లప్పుడూ సంతోషదాయకమవడం ప్రకృతి సహజ మే గదా!

పండిత నేమానీ వారు ఇంత శీఘ్రం గా కరిగి పోతారని అనుకోని గోలీ వారు దీర్ఘముగా బుడతడు బుజ్జి పండు ని గాంచి,

"నాయనా బుజ్జి పండు.. నీ ఇచ్చుకని మేము మేచ్చితిమి. అయినన్ను , మీ మాత మాట మీదుగా ఇచ్చటికి వచ్చి నాడవని అంటున్నావు. మరి మీ మాత గురించి నీకు తెలిసిన ఒక పద్యము జెప్పుము అని ఒక బాణాన్ని ఎక్కు పెట్టారు సూటిగా. వారు పేరు కు తగ్గట్టు గోళీ సూటిగా వేయుదురు -మధురమైన పద్యము ముందు వారు "తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు"  అని అంతర్జాల పథముగా నొక్కి వక్కాణించినవారు కూడాను!

ఇలా సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జేప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !

బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .

(సశేషం)

Sunday, December 11, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 3 - (శంకర విజయం - 2)

సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము

శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.

"మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ? "అన్న పండిత నేమాని వారి  పృచ్చ తో సభా ప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.

ఈ ప్రశ్న కి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాన్చినారు చిరునగవుతో , మీ సమాధానం ఏమిటి జెప్పుడు అన్నట్లు. ! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును !

లక్కాకుల వారు వెంటనే లేచి, 'అయ్యలారా, మనం ఇంత సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతో నే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరే ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలో నే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై  పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చుదురు " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.

ఈ మారు శ్యామలీయం వారికి  'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటం తో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్కామ్ప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.

ఇక మిగిలిన మాష్టార్లు , ఓ మోస్తరు గా , తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలి లో. రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యం తో తన చిలిపిదనం కట్టు బెట్టి కొంత గంభీరం గా ఉండవలసి వచ్చే. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.

పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి, 'ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువు గా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము ' అని ఆర్యులవైపు చూసారు వారు.

శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తి ని కడు రమ్యముగా గావిన్చినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె,
' ఆర్యులారా, మనం ఏదైనాను సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావిన్చేదము. కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబు బట్టి మనము తీర్మానించ వచ్చును ' అని శ్యామలీయం వారి వైపు తిరిగి, ' శ్యామలరావు గారు, ఆ బాలకుడు జేప్పినది ఏమి ? తన మాత మాట గా వచ్చితి నని కదా ? " అన్నారు

' అవును ఆర్యా' అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్షమ్ము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.

'కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటాయో జేసేదము !' అని ఆర్యులవారు జెప్పారు.

అష్టదిగ్గజములు ఎప్పటి వలె  దీనికియునూ తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

(సశేషం)

(నేడు డిసెంబర్ పదకొండు ! -

 ప్రముఖ  తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి(సుందర తెలిన్గినిలే పాటిసై త్తేన్ అని తెలుగు సొబగు ని మెచ్చుకున్న తమిళ కవి వారు )  గారి జన్మ దినం అని మా సింగపూరు వారి oli ఎఫ్ఫెం వారి  మాంచి తమిళ పాటలు పెడుతున్నారు. ఈ శుభ దినమున మన బుడతడు శంకరాభరణము కొల్వును జేరుట శుభ సూచకం గా భావిస్తాను !

మీదు మిక్కిలి కందుకూరి పంతులుగారి జన్మదినం అని మన నవ రసజ్ఞ వారు తెలుపుతున్నారు రాజమహేంద్రవరం నించి.. ఆ పై ఎందుకో ? ఏమో ? గారు  తెలుగు బ్లాగు మహోత్సవ దినం కోసం ఒక మాంచి వీడియొ తయారు జేసి అందరినీ ఆశ్చర్యామ్భుధిలో ఓల లాడిస్తూ వున్నారు !  - ఈ శుభ దినాన శ్రీమాన్ బుజ్జి పండు వారు శంకరాభరణం కొలువు ప్రవేశం మరీ శుభ సూచకం! జ్యోతిర్ మాయీ వారు సంతోషమే కదా !

 - చీర్స్  జిలేబి )

Saturday, December 10, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 2 - (శంకర విజయం) !

శంకరార్యుల వారి శంకరాభరణం కొలువు జగజ్జేగీయ మానం గా కవి పండితాద్యులతో వెలుగొందుతోంది.


మహామహులైన పండితులు , నిష్ణాతులు , గ్రాంధికం , గ్రామ్యం కాచి వడబోసిన పెద్దల కొలువు అది.

ఆర్యులవారు చిరునగవుతో వీక్షించు చూ , తమ సహ పండితులని అష్ట దిగ్గజములై న వారిని ఒక మారు కలయ జూసినారు

కొలువులో

పండిత నేమాని వారు,
చింతా వారు
సుబ్బారావు గారు
శ్యామలీయం గారు
లక్కాకుల వారు
గోలీవారు
శ్రీపతి  గారు,
రాజేశ్వరీ అక్కయ్య గారు

లాంటి అష్ట దిగ్గజములను గాంచి ఆ పై నను వున్న మీదు మిక్కిలి పండిత లోకమును గాంచి, ఆ నాటి కొలువు విశేషములు వారు మొదలు బెట్ట బూనినారు.

ఈ శంకరాభరణము కొలువు కు శ్యామలీయం గారు మంజరీ ద్వార పాలకులై ( ఆంగ్లములో గేటు కీపరు అందురు) కొలువుని కడు జాగ్రత్తగా కాపాడుకొంటూ తమ అసామాన్య ప్రతిభా పాటవాలతో ఒక వైపు ఐటీ రంగమును మరొక వైపు కవితా వెల్లువలను సమ పాళ్ళలో 'క్రోడీకరించి' న వారై , ఒక కన్ను ను ఎప్పుడు మంజరీ ద్వారముపై పెట్టి ఉందురు - ఏల అన ఎవరైనా తుంటరులు అనానిమస్సులై అక్కడ ప్రవేశించి ఏమైనా సభా భంగము గావించిన వారికి వెంటనే వారు ఝాడూ చూపించి తరిమి వేయుదురు.

అటువంటి గురుతరమైన భారముతో వారు శంకరార్యుల కొలువును గాపాడుచూ, ఒక వైపు గ్రాంధి క మా , మరో వైపు గ్రామ్యమా అన్న లక్కాకుల వారికి సమానముగా తమ బ్లాగ్కామెంట్ ఫటిమ లో నెగ్గుకుని వస్తూ, మంజరీ ద్వారమున ఒక్క మారు వీక్షించినారు శ్యామలీయం వారు.


(బుజ్జి పండు ప్రవేశం)

శ్యామలీయం మాష్టారు - తనలో

ఎవరో ఒక బుడతడు ఇటు వస్తున్నాడే !  ఈ సభా ప్రాంగణములో ఈ బుడతడికి పని ఏమి ?
ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి ? అనుకున్న వారై,

(ప్రకాశముగా)

ఓరీ బాలకా, ఎవరవు నీవు ఎచట నుంచి నీ రాక ? అని గంభీరముగా చూసినారు. వారు గంభీర స్వరూపులు. వారి చూపులు నిశితమైనవి.

బుజ్జి పండు కొంత బెదిరి,

మలీ అండీ, మలీ అండీ... మలీ అండీ ....

ఈ మలీ మలీ ఏమిటి ? స్ప్రష్టముగా చెప్పుము !  నీ పెరేమిటోయీ ?

మలీ మలీ అండీ, నేను మా మాత పంపగా వచ్చినానండీ !

శ్యామలీయం మాష్టారు  గారు అబ్బురు పడి పోయారు. ! ఈ బాలుడు మాత అన్న పదమును ఎంత స్వచ్చముగా స్వేచ్చెగా పలికినాడు సుమీ ! ఈ మమ్మీ ల కాలములో వీడు మాత అని పలకటం గొప్ప విషయమే !

వారు ఈ మారు కొంత స్వాంతన స్వరముతో బాలకా, నీ పేరు ఏమి ? అని నిదానముగా అడిగినారు

నా పేలండీ , నా పేలండీ, ...

ఓహో ఈ బాలకునికి సాధు రేఫములు పలకడం కష్టమైనట్టున్నది ! అని భావించి శ్యామలీయం వారు, పోనీ, మనమే వేరు విధముగా అడిగి చూతము అని,

బాలకా, నీ నామమేమి ? అని రేఫములు లేక సాధు గా అడిగారు ఈ మారు .

మీలు పెద్ద వాలండీ, నామమేమి అనకూడదు. నీ నామమెక్కడ అని అడగ వలె ! నా నెత్తిపై వున్నది  చూడుడు , అని ఒక చెణుకు మన బుజ్జి పండు వేసి,

స్వామీ, నా నామము బుజ్జి పండు అని తనను పరిచయము చేసుకున్నాడు.

హార్నీ, బుజ్జి పండు , ఏమి ఈ తెలుగు పేరు ! ఈ కాలములో పిల్లలకి ఇంత మంచి స్వచ్చమైన  పెరెట్టిన తల్లులు గారు వున్నందువల్లే కదా, ఈ శంకరాభరణము వంటి కొలువులు ఇంకనూ వర్దిల్లుచున్నవని వారు సంతోషపడి,

బుజ్జి పండూ, నీ చెణుకు కి నేను మైమరిచితిని. ! నీ విక్కడి కి వచ్చిన కారణం బెద్ది ? అని వారు ప్రశ్నించారు.

"మా మాత, జ్యోతిల్మాయీ వాలు, నన్ను మలింత  తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు మా మాత నన్ను అమలికా నిండి ఇక్కడి కి పంపించినాలు మీ వద్ద అంతల్జాల వాసము చేయమని ' అన్నాడు బుజ్జి పండు.

శ్యామలీయం మాష్టారు, ఈ అబ్బాయి ని గాంచి ముచ్చట పడి, వీడికి ఒక్క  రేఫమే కదా సమస్య ! ఈ తెలుగు లోకం లో ఎంత మందికి అసలు తెలుగే రాదు. అటువంటి కాలములో వున్న ఎందరికో కన్నా, ఈ బుడతడి ఉత్సుకతకి ఆ రేఫలోపము ( ఇది దుష్ట సమాసమా అని రేపు ప్రశ్న టపా లో వేయవలెనని గుర్తు పెట్టుకుని ) ఒక్కటే కదా, మన్నించి, శంకరాభరణం కొలువలో ఈ బుడతడికి ప్రవేశము కలిపించి ఈ బుజ్జి పండుకి తెలుగు నేల్పుదము ( హమ్మో, నాకు రేఫలోపము వస్తున్నదే సుమీ!, జాగ్రత్త గా వుండవలె అని మనస్సులో అనుకున్న వారై)  అని తీర్మానించి,

బాలకా, బుజ్జి పండు, వేచి వుండుము, నేను సభా ప్రాంగణములో మా పండితుల వారి అనుమతి గైకొని వచ్చి నిన్ను తోడ్కొని పోవుదునని వాక్రుచ్చి, వారు సభా ప్రాంగణంలోనికి వెళ్ళారు !

(సశేషం)

Wednesday, December 7, 2011

బుజ్జి పండు తెలుగు చదువు !

బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ తెలుగు కాంతుల విరజిమ్ముతూ తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.

ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు ని నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి

'పుత్రా, బుజ్జి పండూ,  నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ని ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన 'తెలుగు బ్లాగ్ గురువుల  చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి అని ఆ మాత పలుకగా,

తనయుడు బుజ్జి పండు 'మాతా, నీ వాక్కు నాకు శిరోదార్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గురువుల వారి వద్ద వాసము చేయవలె నని అడుగగా

 ఆ మాత కడుంగడు ముదావహము తో

'పుత్రా బుజ్జి పండూ,  నాకొక్క దినము అవకాశము నిమ్ము, నీకు ఆ గురువుల పేరు తెలిపెదను ' అని బహు సంతోషానంద  భరితు రాలై 'పుత్రోత్సాహముతో' ఆ నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్దురాలాయెను.

పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగు ను దృశ్య కావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.


(సశేషం)

Tuesday, December 6, 2011

మాయన్ కాలెండరు - 12-Dec-2012 సారూప్యతలు - ఇది జిలేబి పరిశోధన!




మాయన్ క్యాలెండరు గురించి జరుగుతున్న పరిశోధనలు గురించి మీలో చాలామంది చదివే ఉంటారు.



దీనికి సంబంధించి కొంత చదివాక సరే - మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైనా ప్లానెటేరి పొసిషన్స్ కనిపిస్తున్నాయా అని ఆ రోజు కి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి , రెండు వేల పన్నెండు కి చక్రం గీస్తే నాకైతే ఎలాంటి విశేషాలు కనిపించలేదు చార్ట్ లో.


సరే - ఇంత గగ్గోలు అవుతోంది కదా - ఈ మాయన్ కాలెండర్ సబ్జెక్టు అని కొంత ముందు వెళ్లి డిసెంబర్ పన్నెండో తేది ,(కాకుంటే పదమూడో తేది ) రెండు వేల పన్నెండు కి చార్ట్ చూస్తె - ఓ పాటి విలక్షణమైన జ్యోతిష చార్ట్ కనిపించింది. అంటే - రెండు ప్లానెట్ లు తప్పించి, ( మంగళ, శని గ్రహాలూ తప్పించి మిగిలిన వన్ని కల గట్టుకుని ఎదురెదురు గా కనిపించడం, ఆ పై డిసెంబర్ పదమూడో తేది అమావాస్య కూడా కావడం లాంటివి నాకు తట్టిన విశేషాలు. మీకు జ్యోతిష్య శాస్త్రం తెలిసి ఉంటె మరీ మీరు  పరిశోధించి ఉండ వచ్చు.

అంతె కాకుండా - పదమూడో తేది అమావాస్య కాబట్టి - డిసెంబర్ ఇరవై ఒకట వ తేది నవమి.

త్రేతాయుగ కర్త శ్రీ రాముని జననం     నవమి లో.

ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడి జననం  అష్టమి లో.


కలి యుగ కర్త ( ఎవరు? ) తెలియదు, నాకైతే - కలి ప్రభావం అనుకుంటే - శ్రీ కృష్ణ పరమాత్ములవారు ఈ కలి యుగానికి కూడా అవతార పురుషుడు  గా అనుకోవచ్చు. (వచ్చే అవతారం దాక, లాస్ట్ అవతార పురుషుడు ఇన్-చార్జ్ అన్న మాట!)


సో, ఈ రీతిలో ఆలోచిస్తే - సప్తమి రోజున ఏదైనా విశేషం ఉండవచ్చా?

అంటే ఈ డిసెంబర్ పన్నెండు నించి ఇరవై ఒకటి లోగా ఏదో విశేషం జరగవచ్చు అని ఊహించవచ్చా?

ఈ టపా ముఖ్యోద్దేశం మీకు తెలిసిన ఏదైనా పాయింటులు వుంటే వాటి గురించి రాయగలరు.

ఈ శీర్షిక పై మొదటి సారి నేను రాసినప్పుడు, సందీప్ అనే బ్లాగరు, పంచవటి అన్న గ్రూప్ కి ఈ మేటర్ ని పంపిస్తానని అందులో నిష్ణాతులు ఏదన్నా చెబ్తారేమో చూస్తామని అన్నారు. కాని ఆ తరువాత ఆ సందీప్ అన బడే ఆసామి దీని ని పంచవటి కి రెఫెర్ చేసారా, దాని పర్యవసానాలు నాకు తెలీదు. వారి నించి ఎట్లాంటి స్పందనా రాలేదు. శ్రీ తెలుగు యోగి శర్మ గారి ప్రకారం ఈ తేదీలలో ఎట్లాంటి విశేషాలు లేవు. (నా కు తెలిసి వారు రాసిన టపాలని బట్టి, - వేరుగా పంచవటి లో వేరే ఏమైనా సవివరం గా చర్చించి వుంటే నాకు తెలియదు)

ఆ  పంచవటి వారు గాని, వేరే వారేమైనా దీని ని పరిశోధించి వుంటే వివరాలు తెలుప గలిగితే మరీ సంతోషం !

సర్వే జనాః సుఖినో భవంతు ! సమస్త  మంగళాని భవంతు. !!



చీర్స్
జిలేబి

Monday, December 5, 2011

శ్రీ రామరాజ్యం నేను చూడను గాక చూడను !

అయ్య బాబోయ్ ,

బ్లాగ్ లోకం లో ఎన్నెని టపాలు శ్రీ రామరాజ్యం పై

ఇన్ని చదివాక నా తెలివి మరీ ఎక్కువై పోయింది.

సినిమా చూడ్డం మరో ఖర్చు ఎందుకు?

ఫ్రీ గా ఇన్నిన్ని టపాలు చదివేక, మొత్తం చిత్రం కళ్ళ ముందు ఫ్రీ గా వచ్చేసింది.

నేను సినిమా చూడను, రివ్యూలు  చదువుతాను.  అంతే !

(నేను హార్లిక్స్ తాగను , తింటాను  అని మా మనవుడు అంటే , వీపు మీద విమానం మోగుతుందిరా మనవడా అన్న మాటలు గుర్తుకొచ్చి.... మనకూ ఎవరైనా విమానం మోత పెడతారేమో, ఇక్కడ్నించి వెంటనే పరారై పో జిలేబి!. )

చీర్స్

జిలేబి.

Saturday, December 3, 2011

ఖబడ్దార్ - మీరెక్కడి నించి రాస్తున్నారో , మీరెవరో అంతా మాకు తెలుసు !

బాబయ్యా - బిగ్ బ్రదర్ మిమ్మల్ని తోలుకు రమ్మన్నాడు !

బాబయ్య కి తానేం తప్పు జేసాడో తెలీలే ! తాను చిన్నప్పుడు సినిమాలలో జూసేడు - వూళ్ళో ఎవడైనా ఏదైనా జేస్తే , 'అన్న' కబురంపే వాడు - ఆ తరువాత ఆ కబురు అందుకున్నవాడు గాయబ్ !

ఆ మధ్య కోల్డ్ వార్ సమయాల లో వీడు వాణ్ణీ, వాడు వీణ్ణీ అద్దాలు బెట్టి గమనిమ్చుకునే వాళ్ళు.  స్పై , క్రాస్ , డబల్ క్రాస్స్ మొదలగు పేర్లతో వీళ్ళు ప్రసిద్ధులు.

మన ఒక కాలపు తెలుగు సినిమాలో 'అన్న' ఎప్పుడు  కరకు మనిషే. అన్న రమ్మన్న డంటే , మన కు మూడి నట్టే లెక్క అన్న మాట !

ఇప్పుడు ఆ పెద్దన్నయ్య మన భారద్దేశం అయి పోయిందని వార్తా పత్రికల భోగట్ట !

ఇక మీదట జిలేబి ఏదైనా రాస్తే వెంటనే (ఆల్రెడీ తెలుసేమో?) పెద్దన్నయ్యకి ఖబురు వెళుతుంది.

జిలేబి మీ గురించి రాసిన్దటండి !

ఏమి గీకిన్దిరా ఆవిడ ?

మీరు బిగ్ బ్రదర్ అనండి

వెంటనే ఆవిణ్ణి బొక్కలో పెట్టు. ఏమిటా ఖండ కావరం? నన్ను మిస్టర్ బిగ్ బ్రదర్ అని వుండాలి కదా !

ఇప్పుడు జిలేబి కి సందేహం వస్తోంది. ఈ సంకలునులు, హారం లు కూడా ఈ బిగ్ బ్రదర్ కి సీక్రెట్ ఎజెంట్లేమో ?

ఎందుకంటే మనం ఏమైనా రాస్తే, వీళ్ళకి వెంటనే తెలిసి పోతోన్దబ్బా ! అదే ఎలా నో తెలీయటం లేదు.!

వెంటనే మనం గాయబ్ అయి పోవటం మంచిది ఈ బ్లాగ్ లోకం నించి!

చీర్స్

జిలేబి.

Friday, December 2, 2011

కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

అందరూ టపా కి కామెంటు రాస్తారు. సరే, కొంత వెరైటీ గా కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

కామెంటడం అన్నది ఒక కళ. అది బ్లాగ్ లోకం లో కొందరికి అచ్చి వచ్చిన విద్య.

మరికొందరికి చాలా కామెంటాలని ఉంటుంది.

 కాని సమయాభావం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, చిన్నగా రాసి ఊరుకుంటారు.

ఇవ్వాళ బ్లాగ్ లోకం లో జల్లెడ వేసామంటే ఎక్కువగా కనిపించే కామెంటు రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ! :)

ఆ తరువాయి - కనిపించే చాలా కామన్ కామెంటులు - సూపెర్, కెవ్వు, కేక ! హ హ హ , hahahaha ,
lol...ఇలా చిన్ని చిన్ని పదాలతో కామెంటు తారు.

సో ఇవన్ని తెలుగు లోకానికి బ్లాగ్ లోకపు సరి కొత్త పదాలు

కొన్ని ఇప్పట్లో ఉన్న తెలుగు పదాలే, కొత్త అర్థం ఆపాదించుకోవడం కూడా కద్దు. ఉదాహరణకి , కెవ్వు కేక - ఈ పదం టపా సూపెర్ అన్న అర్థం లో వాడతారనుకుంటా . అంతర్జాలం లో మరిన్ని సరికొత్త పదాలు పోను పోను వస్తూంటాయి అనుకుంటాను.

కొంత కాలం పోయాక , నిఘంటువు ఎవరైనా ప్రచురిస్తే , ఈ కొత్త పదాలు ఆ నిఘంటువులో వస్తాయేమో ? మొదట్లో కొంత విముఖం గా ప్రచురించినా పోను పోను వేరు వేరు ప్రచురణలలో కొత్త అర్థాలతో వస్తాయేమో !

మరో పోకడ, టపా కన్నా సుదీర్ఘ మైన కామెంటు- వ్యాఖ్య ! ఇది టపా కన్నా చాంతాడంత మరో టపా అంత నిడివి ఉండటం కద్దు.

కొన్ని చమక్కులు,
కొన్ని కవితలు,
కొన్ని పద్యాలు,
కొన్ని చేణుక్కులు,
కొన్ని సమస్యా పూరణలు
కొన్ని కొంటె దనాలు
కొన్ని ఇన్ఫర్మేటివ్
వెరసి నేటి బ్లాగ్ కామెంటులు
ఓ విన్నూత్న సాహితీ ప్రక్రియ !

ఇప్పటి దాకా రానిది చైను కథానిక, కామెంట్ల ద్వారా ! (టపా ల లో ఇంతకు ముందే గొలుసు కథలు వచ్చేయని ఒక మారు జ్యోతి గారు చెప్పారు - సో , కామెంటుల లో ఇప్పటిదాకా ఈ ప్రయత్నం రాలేదనే భావిస్తాను !


చీర్స్
జిలేబి.

Thursday, December 1, 2011

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా!

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా

నాకు

నాలుగు ముక్కలాట తెలుసు

నాలుగు స్తంభాల ఆట తెలుసు

నాకు

జోకాట తెలుసు

పేకాట తెలుసు

కానీ

ఈ కామెంటు లలో వచ్చే

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఏమిటో

కాస్త వివరించి చెబ్దురూ !

:)


చీర్స్
జిలేబి.