Wednesday, February 19, 2014

అహో ఆంధ్ర భోజా ! శ్రీ కిరణ్ కుమారా !


అహో ఆంధ్ర భోజా ! శ్రీ కిరణ్ కుమారా !
టీ బిల్లు శిధిలాలో చిరంజీవి ఐనావయా !

పాట పాడేశాం కాబట్టి ఇక గ్రౌండ్ రియాలిటీ కి వస్తాం !

తెలంగాణా ఖరారు బిల్లు లోకసభ లో ఆమోదం అయ్యింది కాబట్టి -

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రపు  ఆఖరి ముఖ్య మంత్రి ఎవరు అన్న ప్రశ్న కి సమాధానం గా శ్రీ కిరణ్ కుమార్ చరిత్ర పుటల్లో నిక్షిప్త మవుతారు .

రాబోయే కాలం లో ఏమి జరుగునో ఎవరూహించెదరూ ! అనగా రాజ్యం వీర భోజ్యం కాబట్టి రాబోవు ఆంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్య మంత్రి ఎవరో మరి !

టీ బిల్లు లో 'సీమాంధ్ర ' అన్న పదం లేదు కాబట్టి ఇక రాష్ట్రం పేరు ఆంధ్ర ప్రదేశ్ అనే అనుకోవాలి . మనకు మనమై కాదు కూడదు ఈ ఒక్క మా కోరికైన మన్నించండి దేవేరి - రాష్ట్రం పేరు సీమాంధ్ర ప్రదేశ్ కావాలి అంటే అవ్వొచ్చేమో  మరి ; అయినా పేరులో ఏముంది !?

ఇక గ్రౌండ్ రియాలిటీ కి వద్దాం !

తెలంగాణా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు లాభాలు ఏమిటి ?

తెలంగాణా ఆవిర్భావం - బిల్లు చదివాక ఈ టపా రాయాలని పించింది.

నష్టాలు తప్పక ఉంటాయి . కాకుంటే ఇక ఇది తేలిపోయింది కాబట్టి - అంటే తెలంగాణా రాష్ట్రం వచ్చేస్తుందని - ఇక లాభాల గురించి తప్పక ఆలోచించి ముందడుగు ఎట్లా వెయ్యాలి అన్నది ఆంద్ర ప్రదేశ్ నిర్ధారించు కోవాల్సిన విషయం లా అనిపిస్తుంది .

మొట్ట మొదటిది - రాజధాని . పదేళ్ళ లోపు మరో రాజధాని అంటే - అందు తో బాటు ఎకనామిక్ డెవలప్మెంట్ . ఇది కీలకమైన లాభం గా భావిస్తే , ఏ వూరు ఇక రాజధాని అవుతుందో ఆ ఊళ్ళో ఇక తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఎక్కువగా పోలో మని ఉండటం ఖాయం - ఇందులో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు తప్పని సరిగా రాబోయే కాలం లో మనీ లార్డ్స్ !

రెండవది - ఈ సరి కొత్త రాజధానికి తప్పని సరిగా ఇక మరో 'ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ రాక మానదు ! - మరో మెగా ప్రాజెక్ట్ డబ్బులే డబ్బులు !

మూడు  - NIIMS లాంటి మరో మెగా మెడికల్ ఇన్స్టిట్యూట్ ! మరో మెగా ప్రాజెక్ట్

నాలుగు - చదువు సంబంధించి - మెగా ఎడ్యుకేషనల్ - IIT లాంటివి -

అంటే హైదరాబాదు వదిలి పెడితే ఇక సరైన మార్గం లో ఈ అవకాశాలని ఉపయోగించు కుంటే అంధ్ర ప్రదేశ్ మరో మారు విజయవంతం గా అభ్యుదయం వైపు సాగడం ఖాయం !

కొత్త పార్టీ పెట్టండి రాజ కీయ నేత లారా  - ఆంధ్ర ప్రదేశ్ మీకోసం రా రమ్మని ఆహ్వానం తెలుపు తోంది !

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

ఇక వాటర్ మేనేజ్ మెంట్ - రెండు బోర్డులు - గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ; కృష్ణా రివర్ మేనజ్మేంట్ బోర్డు ! వీరి పని తీరు ని బట్టి రెండు రాజ్యాల మధ్య నదీ ప్రవాహక ప్రాంతాల అభివృద్ధి

అట్లాగే తెలంగాణా కి కూడా ఈ లాంటి మరెన్నో డెవెలప్మెంట్ అవకాశాలు లభ్యం - రాష్ట్రం లో ని ప్రతి ఒక్కటి ఇక ద్విగుణీ కృతం అవ్వాలి కాబట్టి రెండు అసెంబ్లీ లు గట్రా నించి ఇక సందడే సందడి మరి !

ఇక తెలుగు తేజం రెండు వైపులా వెల్లి విరిసి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథం లో సాగుతాయని ఆశిస్తో ...

ఇదే జిలేబి ఇచ్చు సందేశం - అయినదేమో అయినది - ఇక బిగువు ఏల ప్రేయసి !


శుభోదయం
జిలేబి
 

5 comments:

  1. సార్ చిన్న సవరణ. చివరి ముఖ్యమంత్రి తెలంగాణాకే గాని, ఆంధ్ర ప్రదేశ్ కి కాదు. బిల్లు ప్రకారం ఆంద్ర ప్రదేస్ లో ఓ ముక్క ఊడి 29 వ రాష్ట్రం ఏర్పడింది. రెండు రాష్ట్రాలు ఏర్పడలేదు. అలాగే, మొదటి ముఖ్యమంత్రి విషయం కూడా.

    ReplyDelete
  2. అమ్మవారి డైరక్షన్ లో మరో పిల్ల కాంగ్రెస్ పుడుతోంది రేపు, వేచి చూడండి, ఇదీ డెవలప్మెంటే. ఎప్పుడో చెప్పేం! ఇక సొమ్ములే సొమ్ములు నాయకులకు, కాంట్రాక్టర్లకి పండగే రోజూ!!!

    ReplyDelete
  3. Congratulations... but Save Hyderabad.

    Keep below in mind and Save Hyderabad now.


    Modi - Rahul Bhai Bhai. Find my analysis below.

    I guess BJP and Congress(North India parties) want to grab Hyderabad into their hands.

    Reason:
    For past 10 years lot of funds from central govt were pumped into Hyderabad even after knowing that AP is going to be devided. This made me to think that following plot is made by Congress and BJP.

    Plot:
    1: First give Telangana.
    2: Later create a demand to make Hyderabad as second capital of country.
    3: Create Hyderabad as seperate state/UT.
    4: Take over state and dominate by North Indians.
    5: Get grip over south India.

    - A Hyderabadi

    ReplyDelete
  4. >>ఇక తెలుగు తేజం రెండు వైపులా వెల్లి విరిసి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథం లో సాగుతాయని ఆశిస్తో ...

    వేరి గుడ్డు. ఇద్దరు అభివృద్దిలో పోటి పడాలి. ఈ సెక్షన్ లో ప్రతి రెండేళ్లకు జిలేబి గారి అద్వర్యంలో బహుమతులు ఇవ్వాలి :)

    ReplyDelete