Monday, June 29, 2015

ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు

ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు - ఆలోచనా తరంగాలు -

ఆలోచనాత్మక మైన టపా !

ఈరోజు ఉదయం పంచవటి సభ్యుడు గిరీష్ సూరపనేని గుంటూరుకు వచ్చాడు.

'ప్రస్తుతం గుంటూరులో ఉన్నాను.మీ ఇంటి అడ్రస్ చెబితే వచ్చి కలుస్తాను.' అని ఫోన్ చేశాడు.

'ఏం పని మీద కలవాలనుకుంటున్నారు?' అడగడం కొంచం రూడ్ గా అనిపించినా తప్పక అడిగాను.

'ప్రత్యేకంగా పనేమీ లేదు.ఊరకే కలుద్దామని వచ్చాను' అన్నాడు.

'పనేమీ లేకుంటే కలవడం ఎందుకు? పిచ్చాపాటీ కబుర్లు నేనిష్టపడను.' అన్నాను.ఎందుకలా అనవలసి వచ్చిందంటే,ఆదివారం నేను ఖాళీగా ఉంటే,నా సాధనకే నాకు సమయం సరిపోదు. అందుకని ఇతర పనులు సాధారణంగా పెట్టుకోను.ముచ్చట్లలో సమయం గడపడాన్ని అసలు ఇష్టపడను.చాలామంది వచ్చి కూచుని మాట్లాడే కబుర్లు (ఆధ్యాత్మిక కబుర్లు అయినా సరే) నాకు మహా కంపరం కలిగిస్తాయి.వారి ఆరా నాకూ నచ్చదు. నా ఆరాను వారూ భరించలేరు. అందుకే అలా అనవలసి వచ్చింది.

అవతలనుంచి నిశ్శబ్దం. బహుశా చిన్నబుచ్చుకున్నాడేమో అనిపించింది.

'సరే.రండి.కానీ ఒక్క పదిహేను నిముషాలు మాత్రం మీతో మాట్లాడగలను.' అన్నాను.

కాసేపట్లో గిరీష్ ఇంటికి వచ్చి చేరాడు.

విజయవాడనుంచి హైదరాబాద్ వెడుతూ మధ్యలో నన్ను చూచి వెళదామని గుంటూరుకు వచ్చానని చెప్పాడు.శ్రీశైలం సాధనా సమ్మేళనానికి రావాలనుకుని కూడా రాలేకపోయానని అన్నాడు.

నేనేమీ రెట్టించలేదు.

కాసేపు కుశలప్రశ్నలు అయ్యాక - 'ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి. కాసేపయ్యాక మళ్ళీ ధ్యానం కొనసాగించవచ్చా?' అడిగాడు.

'అసలు చెయ్యవలసింది అదే. ఆలోచనలలో కొట్టుకుపోతున్నామన్న తెలివి వచ్చాక మళ్ళీ ధ్యానాన్ని సాగించాలి' అన్నాను.

పూర్తి గా .... ఆలోచనా తరంగాలు - శ్రీ శర్మ గారి టపా 


చీర్స్
జిలేబి

 

No comments:

Post a Comment