Tuesday, February 13, 2018

జయహో శంకరాభరణం - కంది శంకరయ్య గారి తో ముఖాముఖి



జయహో శంకరాభరణం - శ్రీ కంది శంకరయ్య
 
ముఖాముఖి




చేసిరి శంకరాభ రణ సేవను మీదగు రీతి లోనయా
వాసము జేరి సత్కవులు వాసిని రాసిని పెంచి రయ్య! సా
వాసము పేర్మి గా బడసి వాహిని యై వెలసెన్ బిరాదరీ !
మీ, సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!


చీర్స్
జిలేబి

Friday, January 26, 2018

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !



గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !
 
 

కందము
 
మన దేశము కోశమయా
జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
మనవులు చెప్పితి నాశము
మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా ! 
 
*****
 
తేటగీతి
 
దేశ మేమిచ్చెననకు నే దేశమునట
నెగడు కోశముగా నిల్ప నీమమున్ గొ
ని పని జేసి వినాశమున్నింకు జేయ
నేమి చేసితి పాశము నేర్వ దగును !
 
*****
 
ఆటవెలది
 
దేశమున్ జనాళి దేవళమ్ముగ జూడ
వలె వినాశ మెల్ల వదుల వలెను!
కోశ మవగ వేద ఘోష జిలేబియ
పాశము గను మేలు బాంధవమ్ము !
 
*****
 
మత్త కోకిల
 
దేశమాయెను భారతమ్ముర దేవభూమిగ వెల్గుచున్
కోశమాయెను వేదవిద్యకు కోరి పుట్టిరి దేవతల్
నాశమయ్యిరి దుష్టులున్ను సనాతనమ్మును గూల్చగన్
పాశమున్ గొని దీటుగానటు పాజమున్ గొ‌న మేలగున్
 
*****
 
ఉత్పలమాల
 
దేశము నీది నాది సయి దేవళ మై వెలి గెన్ జనాళికిన్
కోశము వేద వాక్కునకు, కోరిరి దేవతలున్ ప్రభూతి కా
వేషము లెల్ల తీరగను ; పెక్కు వినాశములన్నెదుర్కొనెన్,
భూషణ చేయు పాశముగ భూరిగ దీటుగ జైజవాన్! కిసాన్!
*****
 
చంపకమాల

చలిమల పైన సైనికులు శాంతిని జేర్చుచు దేశమున్ సదా
వలయము గావ కోశముగ వర్ధిలె భారత భూమియే ధరా
తలమున వేద సారముల తత్త్వము పాశము వీడ నేర్పుచున్
పలికె వినాశముల్ వలదు; పాడదగున్ భళి కీర్తి చంద్రికన్
*****
 
శార్దూలము

నాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
దై దారుఢ్యమవన్ వినాశముల నీదౌ కైపులన్ ద్రోలుచున్
వేదమ్మే మన కోశమై ప్రజలకున్ విద్యావిధానమ్ముగా
సాధించన్దగు శాంతి సౌఖ్యము నిలన్ శార్దూలమై నిల్చుచున్
*****
 
పంచ చామరము

నినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా
వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
సనాతనమ్ము భావ మెల్ల సాగరమ్ము, నీదు దే
శ నాడి కోశమయ్య, మేలు జన్మ భూమి నీదయా


మత్తేభ విక్రీడితము

మన దేశమ్మది కోశమయ్య భువిలో మాన్యంబుగా వేదవా
క్కునకున్, ధర్మపథమ్మునన్ మెలయ నిగ్గుల్దేల్చు పాశమ్ము బో
వ నరుల్ జీవిత మందు నిమ్మళము గా భాసిల్ల! కాపాడు కొ
మ్మ నమస్సున్నిడి దేశ మాతకు నిటన్ మాన్పించి నాశమ్ములన్!

 
 
జైహింద్
జిలేబి
 
 


Saturday, January 20, 2018

మా అయ్యరు గారు దారి పోయారు ! కనబడ్డారా మీకేమైనా ?



మా అయ్యరు గారు దారి పోయారు ! కనబడ్డారా మీకేమైనా ?


పొద్దుటే లేచి భయభక్తుల తో అయ్యరు గారి కాళ్ళకు మ్రొక్కి ఆ పై గాని తన పద్య ప్రహసనం లో పడని జిలేబి,
నిదుర లేచి చూస్తే మంచం పై అయ్యరు గారు కన బళ్ళే

గుండె గొంతుకలో కొట్లాడింది జిలేబికి.

ఇంత పొద్దుటే అయ్యరు గారెక్కడ పోయేరబ్బా అనుకుని అటూ యిటూ చూసి జానాబెత్తెడు ఇంటి ని మొత్తం గాలించి గాలించి అలసి సొలసి కన్నుల్లో కన్నీళ్లు ఉబికేస్తోంటే ముక్కు చీదేసు కుంది !

హయ్యో !హయ్యో! నిన్న రేతిరి కూడా అయ్యవారు పక్కనే కదా ఉన్నారు !

వారిని ఓ మాటై నా అనలేదే ! ఇట్లా హఠాత్తుగా గాయబ్ అయిపోయారే రాత్రికి రాత్రి !

లైఫ్ లైన్ నూట పదహారు కి ఫోన్ చేద్దామా అనుకుని బెంబేలు పడి పోతూంటే దైవేచ్చ గా
"నా మొబైలు చార్జెరు ఎక్కడ పోనాది ; ప్రశ్న వేసి చూసా" కనిపిస్తే హా హా హా ! మా అయ్యరు గారు ఎక్కడ పోయేరనిప్రశ్నిస్తే చాలనుకుని

అయ్యరు అయ్యరు ఎక్కడ మీరు అని ప్రశ్న వేసుకుని సమయం చూసుకుంది - ప్రొద్దుట నాలుగు గంటల నాలుగు నిమిషాల నాలుగు సెకన్లు ! బ్రహ్మ ముహూర్తం !

ప్రశ్న వేసిన సమయానికి చార్టు లాగింది జూనియర్ జ్యోతిష్ నించి !


నోరు నొక్కేసు కుంది ఆ చార్టు అనాలిసిస్ చూసి !

హయ్యో హయ్యో ! ఇంత మోసమా ! ఇంత మోసమా !
ఏమండీ ! అయ్యరు గారు ఎక్కడ పోయారు మీరు ! ఇట్లా సన్యాసాశ్రమం మీకు సబబా ! హయ్యో హయ్యో !


దబ్బున మంచం మీది నించి క్రింద పడిన శబ్దం !

చెవుల దగ్గిర జిలేబి జిలేబి అన్న ఆతురత తో కలిసిన శబ్దం !

ఏమండీ ! అయ్యరు గారు మీరెక్కడ ! మీరెక్కడ ! హిమాలయాల్లో ఉన్నారా ! అంటూ వాగేస్తున్న జిలేబి ముఖం మీద కూసింత మంచి నీళ్ళు ప్రోక్షించి అయ్యరు గారు తట్టి లేపారు !
ఆ చల్లని జిల్లను నీటి కి నిదుర వీడి చూసింది జిలేబి

జానా బెత్తెడు ఇంటి లో జాన కన్న తక్కువ మంచం పక్కన తను క్రింద పడి ఉంది ! అయ్యరు గారు పరామర్శిస్తున్నారు !

హమ్మ ! ఇది నిద్రా ! కలా !

హా హా ! జిలేబి

ఏమాయెన్ బో లోకం !

అయ్యరు వాళ్ ! మీరు హిమాలయాల కెళ్ళి పోయేరని కల గన్నా ! చెప్పింది జిలేబి ఆందుకే ఈ ఆతురత!


ఓ నా పిచ్చి జిలేబి ! అట్లాంటి యోగం నాకీ జన్మలో లేదని నువ్వు నన్ను కట్టు కున్నప్పుడే తెలిసి పోయిందే ! అట్లా ఎట్లా కలగంటావు అని అయ్యరు గారు అంటే ,

హా హా మగడంటే మా అయ్యరే గా అని మురిసిపోయి జిలేబి మళ్ళీ ఫార్మ్ లోకి  వచ్చేసి 'అయ్యర్వాళ్ ఓ మంచి కాఫీ పట్టు కు రండి ఇవ్వాళ శంకరాభరణం లో దత్తపది వ్రాయాలి ; అతిరుచిరము తో ఓ జిలేబి వేస్తా అంటూ ఆర్డర్ వేసేసింది జిలేబి యథా ప్రకారము గా !

హా ! నా జ్యోతిష్య మా ! జిలేబి కతల కు కూడా పనికి రాకుండా పోయేవా !


చీర్స్
జిలేబి
నారాయణ నారాయణ !

Sunday, January 14, 2018

సంక్రాంతి శుభాకాంక్షల తో !



 
బ్లాగ్ వీక్షకుల కందరి కీ
 
సంక్రాంతి శుభాకాంక్షలు !
 
మైలవరపు వారి సంక్రాంతి వర్ణన
 
కొక్కొరోకో యను కోడికూతకు లేచి
నిత్యకృత్యమ్ముల నెఱపి యంత ,
క్రొత్త బట్టలు గట్టి కూరిమి బెద్దల
పాదమ్ములకు మ్రొక్కి పాలు త్రాగి ,
గోమాత నుదుటను కుంకుమదీర్చియు
భోగిమంటను జేరి మోదమంది ,
ముంగిట దీర్చిన రంగవల్లిక జూచి
పులకించి , నెమ్మది పొంగి , మురిసి ,
హరిలొ రంగా యను నాలాపనము విని
పరుగెత్తుకొని వచ్చి పలకరించి ,
గంగిరెద్దులవాని గమనించి పాతదౌ
పట్టుచీరనొకటి వానికిచ్చి ,
బుడబుక్కమని చేతిమునివ్రేళ్లతో డప్పు
వాయించు వానికి బట్టలిచ్చి ,
వంటింటి ఘుమఘుమల్ వడ్డింపగా దిని
మేలు మా యమ్మంచు మెచ్చి మెచ్చి ,

నవ్వు పువ్వుల రువ్వి యానందమంది ,
దాన ధర్మమ్ములొనరించి ధన్యత గొన ,
పదుగురొకచోట జేరుట పండుగ యగు !
తెలుగు లోగిళ్ల కొంగ్రొత్త వెలుగులమరు !! 

               శ్రీ  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

Wednesday, January 10, 2018

పదమూడన్న భయమ్మదేల రమణీ :)



పదమూడన్న భయమ్మదేల రమణీ ప్రార్థింపు మా యీశునిన్


అదేమో గానండి న్యూమరాలజీ, వాస్తు, సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం, 'దుష్ట తిథి' గట్రా లను చూస్తే , వాటి విషయం చదివితే వెంటనే ఓ కామింటు ఉల్టా వేయా లని పిస్తుందండీ :)

క్రితం రోజు మన దీక్షితులు గారు త్రయోదశి గురించి టపా రాస్తే టట్ అని వెంటనే 'తాత పల్కుకు సవాలు వేయము' అని ఓ డిండిమ కట్టేసా :)

అదేదో మరీ నారదాయ నమః అయి పోయినట్టుంది; శర్మ గారి మనసు నొచ్చేసు కున్నట్టుంది . తిట్టి నట్టు న్నారు సుమా జిలేబి గారు అనుకున్నారు !

అబ్బే ! మన యొజ్జ గారిని తిట్టడమా ! అనపర్తీశు ని తిట్టడమా ! అదిన్నూ మా గోజీ ల వారిని తిట్టడమా ! నెవర్ ! నో ! నో ! నో !


భట్టి తన భట్టి కావ్యము లో (రావణవధ) లో మొదటి పద్యాన్ని పదమూడు అక్షరాలున్న రుచిరమన్న రేర్ వృత్తము తో ప్రారంభించేడు ! సవాలే సవాలన్నట్టు త్రయోదశ పదము లతో :)

అదిన్నూ ఈ రుచిరము లో మొదటి గణము జగణము (మరీ జిలేబి ) :)

అభూనృపో విబుధ సఖా ! పరం తపః అంటూ  దశరథుని గుణ గణా లతో రుచిరమన్న పదమూడు అక్షరాలున్న వృత్తము తో ప్రారంభిస్తాడు :) అది గుర్తు కొచ్చి సవాలు వేసా :) అంతే నన్న మాట !

ఏమండీ దీక్షితుల వారు సరియా ?

అభూనృపో విబుధ సఖః పరంతపః
శ్రుతాన్వితో దశరథ ఇత్యుదాహృతః ! !

చీర్స్
జిలేబి

బిలేజి పద్యములవి భీతిగొల్పెనే :)
(రుచిరము)

Monday, January 8, 2018

జిలేబి వరుసల్ భళిభళి చిత్రమయ్యెనే !



జిలేబి వరుసల్ భళిభళి చిత్రమయ్యెనే !
 
దత్తపదికి డిండిమ తో చిన్న ప్రయత్నం !
 
నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
విషక్తముగ నిచ్చు ! భళి కవీశ్వరుండితం
డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
డ! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా
!

డిండిమ
జిలేబి
 
దత్తపది - 130 (నది-మది-పది-గది)
నది - మది - పది - గది
పై పదాలను ఉపయోగిస్తూ గురుశిష్య సంబంధాన్ని వివరిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో శివరామకృష్ణ గారు ఇచ్చిన దత్తపది)
 
 
 
 
డిండిమ
 
నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
విక్తముగ నిచ్చు !భళి కవీశ్వరుండితం
డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా !
 
౦౦౦
 
డిండిమ

డిండిమ పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. అతిశక్వరి ఛందమునకు చెందిన 11230 వ వృత్తము.
  3. 15 అక్షరములు ఉండును.
  4. 20 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణి: I U I - I I U - I I I - I U I - U I U
    • త్రిమాత్రా శ్రేణి: I U - I I I - U I - I I I - U I - U I - U
    • పంచమాత్రా శ్రేణి: I U I I - I U I I - I I U I - U I U
    • షణ్మాత్రా శ్రేణి: I U I I I - U I I I I - U I U I - U
    • మిశ్రగతి శ్రేణి (5-4) : I U I I - I U I - I I I U - I U I - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు జ , స , న , జ , ర గణములుండును


చీర్స్
జిలేబి


Monday, January 1, 2018

2018 - నూతన వత్సర శుభాకాంక్షల తో !




బ్లాగ్వీక్షకుల కందరికి
 
నూతన సంవత్సర శుభాకాంక్షల తో
 
 
నూతన వత్సర మండీ !
చేతము సరికొత్త బాస చేకూర భళా
జోతలు మనకెల్లరికిన్
సాతము భువిలో నెలకొని సారంగమవన్ !
 
 
 
 
జిలేబి

Friday, November 24, 2017

చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ :)







చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !
 
 
చుక్క కనిపించి నదకో ?
పక్కా గాదోయ్  జిలేబి పరమాత్ముడనన్ !
చిక్కుల్ గనుమోయ్ పథమున్
చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !


జిలేబి

Saturday, November 18, 2017

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా-డబ్బైయ వ వడి లో నా ఆలోచనలు



నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా ..
సరదా పడితే వద్దంటానా
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకే జోడందీ !

ఈ పాటండీ నా ముప్పై ఏళ్ల ప్రాయం లో నండి కన్నదండి, విన్నదండి ఆయ్ !
కానండీ, ఇప్పుడో డబ్బై పైబడి వయసొచ్చేసినాదండి
కాళ్ళు కాట్ వదల నంటోందండీ కాట్ వదిలితే  కాట్ కి ఐ చేరే చోటికే కాబట్టి నో నో అంటోందండి ఆయ్ !
ఆ జుజుబి ప్రాయం లో విన్న పాటండీ, చిత్రమండి మరో చరిత్ర దాని దర్శకుడు బాలచందర్ బాల్చీ తన్నేసే రండీ ఆ మధ్యే, మరో చరిత్ర పైన ఇంద్ర లోకం లో రాసేసు కుందామని వెళ్లి పోయే డండి.
అంతకు మునుపే రాసినాయనా  ఆత్రేయ (కిలంబి వెంకట నరసింహాచార్యులు) అండి, ఆ చిత్రం తరువాయి దశకం లో విష్ణు సేవ కై వైకుంఠం వెళ్ళి పోయే  రండి ; అంటే ఓ ముప్పై దరిదాపుల్లో సంవత్సారా లై పోయే నండి ఆయ్ 
అదే చిత్రం లో నాయకి సరిత అండి ఈ మధ్యే త్సునామీ అక్క గా సిలోన్ సినెమా లో  కనిపించిందండి
ఆ చిత్రం నాయకుడండి, 'తమిళ నాట రాజకీయ ప్రక్షాళనం' కోసం ఈ మధ్య నడుము కట్టేడండి,
అంటే పురచ్చి తలైవి బాల్చీ కట్టేసే కండి,
కళ్ళజోడు ఆసామి బాల్చి కోసం చూస్తున్న తరుణం లోనండి,
అదేదో సినిమా హీరోయిన్ల నడుమును కట్టేసు కున్నంత సుళువు అనుకుంటూ !
అంతంత ఎం జీ ఆర్ కూడా కట్టేసు కో లేంది, కట్టేసు కుని ఫ్లాప్ అయి పోయిన శివాజీ గణేశన్ కట్టేసు కో లేనిది, తా కట్టు కో లేనా అనుకుంటూ .
ఆయ్ దారి తప్పినట్టున్నా కదండి 'సావాస కష్టే ఫలి ' దోషమండి :) 
సరే ఈ పాట ని ఓ మోస్తరు డబ్బై పై బడి వయసు లో మనమూ రివ్యూ చేసి పారేద్దా మని చదివే నండీ !
అయ్య బాబోయ్ ! ఎంత వేదాంత మండీ ఆత్రేయ కలం లో అనిపించిందండి ; అందుకే నండి టపా కట్టేసే నండి (ఇందులో పన్నేమి లేదండి :))
మా వెంకన్న అంటున్నాడండి
"
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా"
నేనే నండి గమనించ లే ! స్వామి వారిని అడుగు తామే  ఉండాము  కాని వారూ ఏనాడైనా లేదన్నా నా  అంటూ ఉబ్బెస్తున్నారే  కానీండి  , తనని రా రా నాతో అని ఎప్పుడు పిలవనే లేదండి ; అయ్యో అయ్యో అని అయిపోయినాదండి మనసు :)
ఉబ్బెసే సాముల్నే గమనిస్తున్నాం కానీండి, దరి నీవుండ రా కొండల రాయని పిలవటం లేదని పించి నాదండి
నీ ముద్దూ ముచ్చట కాదంటానా ..
సరదా పడితే వద్దంటానా  అంటూ సామి కూడా దోబూచు లాడ తానే ఉండాడండి :)
కాట్ ఐ కాలం లో "నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ" అనుకుంటున్నామండి ఆయ్ !
మా అయ్యర్ గారే మో నండి , ఏడు కొండల వాడా " నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకేమీ  జోడంటని అడుగు తోందని" వాపోతున్నారండి
అదండీ కథ !

ఆఖర్నండి ,
నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !
కోరికలేవీ ఉండ కూడదటండి , కానీ కొండల రాయని చేరే ఒక్క కోరిక మాత్రం ఓకే అన్నారండి ; అందుకే సామీ , "ఎన్కటి" సామీ, నీ కోరిక చూపె , నను తొందర చేసే అనుకోవచ్చండి  అని అనుకుంటున్నానండి 

మీరేమంటారండి ?
చీర్స్
జిలేబి 

Friday, November 17, 2017

నందనోద్యోగభ్రాంతులు :)

 
 
నందనోద్యోగభ్రాంతులు :)
 
అదిగో మానవుడు
బ్యాకు పేకును
భుజాల మీదేసుకుని
బయలుదేరాడు !
 
వాడే నందనోద్యోగభ్రాంతి !
 
రేతిరి పగలనక
జీవిత మంతా
కర్మవీరుడిలా !
 
హృషీకేశా !
కర్మసిద్దాంత మార్తాండా !
ఈ భ్రాంతి ని క్రాంతి గా
చేసి నీ పథము
చేరే దెట్లా ?
 
 
శుభోదయం !
జిలేబి

Sunday, November 12, 2017

పంచ పండ వుల శంకువు ల పేర్లేమితో మీకు తెలుసా ?



పంచ పండ వుల శంకువు ల పేర్లేమితో మీకు తెలుసా ?  :)
 
(తెలుగు లో టైటిల్స్
ఇట్లాగే వుంటాయి కాబట్టి
మన బ్లాగ్లోకం లో :) జేకే జే ఎఫ్ :))
 
పంచ పాండవుల శంఖముల పేర్లేమిటి ?
 
 
 
అనంత విజయము - ధర్మరాజు
పౌండ్రము - భీముడు
దేవదత్తము - అర్జునుడు
సుఘోష - నకులుడు
మణిపుష్పకము - సహదేవుడు
 
పాంచజన్యము - శ్రీ కృష్ణుడు
 
భగవద్గీత
అధ్యాయం ఒకటి 15-16 శ్లోకములు ఆధారము
 
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః  1-15
 
అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః
నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ     1-16
 
శుభోదయం
జిలేబి

 

Monday, November 6, 2017

కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)



 
 
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)
 
నీ మదిని తరచి చూడడ
మే మగువా శోధన! విను మేధా జీవీ !
నీ మది సాధన జేయన్
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)



జిలేబి
 
 
 

Thursday, November 2, 2017

ప్రియతము డతడే జిలేబి విభుడున్నతడే !



ప్రియతము డతడే జిలేబి  విభుడున్నతడే !



సంతానము పెద్దదయా !
చింతల దీర్చ చిననాటి చెలిమరి నెరవు
న్నింతి యొలయుమని వేడె
న్నింత చిపిటములను మూట నిడి భర్త నటన్ !


పిరియపు చిపిటములను చెలి
మరి తెచ్చెననుచు ముచుటిని మరిమరి యొలయన్
సిరి, యవనారిని విడువన్
సరిహద్దు నిడెనట చాలు "చపలత" యనుచున్ !


పయిపంచెన చిపిటములన్
సయించు హృది , బాల్యమిత్ర సాయము యవనా
రి యెలమి యాదరువులనన్
ప్రియతము డతడే భళిభళి విభుడున్నతడే !


శుభోదయం
జిలేబి





నిషిద్ధాక్షరి
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - మీ ఇష్టము.

Monday, October 30, 2017

సమస్యా పూరణ -అసభ్యత - అశ్లీలము



సమస్యా పూరణ -అసభ్యత - అశ్లీలము


నిన్న 'నే కవిని గాను' అంటూ మా నరసన్న వారు శంకరాభరణం లో ఓ సమస్య ని చూసి (తండ్రితో రతికేళినిఁ దనయ కోరె) 'చదవడానికే జుగుప్సగా ఉంది నా మటుకు'. అన్నారు.

అంటే అన్నారు పొండి.

వివరాల లోకి వెళితే , కొన్ని సంవత్సరాల మునుపు, (అప్పట్లో 'కంద' జిలేబి లేదు :)) 'సీతమ్మ మా యమ్మ' శ్రీరాముడు మా తండ్రి' అంటూ త్యాగయ్య కీర్తనలతో మురిసి పోతున్న రోజులలో - సమస్యా పూరణ అంటూ సీతమ్మ వారి శీలం మీద 'తప్పుగా' కనిపించేలాంటి ఓ సమస్య చదివి కుతకుత ఉడికి పోయి ఏమోయ్ కవీశ్వ రా మీకు సభ్యత లేదా ? సీతమ్మ వారి మీద ఇంత అవాకులూ చెవాకులా ? అనేసా మండి పోయి !

అప్పడు కంది వారు వివరంగా చెప్పేరు - సమస్యా పూరణ అంటే ఇట్లా ఉంటుంది అంటూ ...


"పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి" .

ఈ విషయం మీద ఆలోచించి వరుసగా కొన్ని దినాలు సమస్య లను గమనించడం మొదలెట్టా ! మాలిక అగ్రిగేటర్ లో మొదటి వాక్యం మాత్రం 'చదవ' గానే ఔరా ఏమిటీ 'పర్యయము' అనుకుంటూ 'వీళ్ళ నోట్ల బండ బడ అనుకున్నా !

ఆతరువాత పూరణ లని చూసేక ఔరా అని దాంతో తలే ఉంగలీ దబాయా ! పూరణ ల లో ఆ అశ్లీలత గాని, అసంబద్ధత గాని కనిపించక హుష్ కాకీ అయిపొయింది :)

ఓహో ! సమస్య ని చదవ కూడదు . సమస్య ని సమస్య గానే చూడాలి. దాన్ని విడ గొట్టాలి అన్నది అర్థ మయ్యింది.

ఆ తరువాత నించి (ఛందస్సు లేకుండా ) మనకిష్ట మొచ్చిన శైలిలో రాయటం మొదలెట్టా ఆ సమస్య లని సమస్యలు గానే చూసి ; ఎవరో ఓ పెద్దాయన అబ్బుర పడి తల గోక్కొని, నేనెన్నో ఛందస్సు లను చూసేను గాని ఈ జిలేబీ వారి ఛందస్సు ఏమిటి ? ఏ ఛందస్సు లో పూర్తి చేసే రని ప్రశ్నించేస్తే ,  దానికి కీర్తిశేషులు పండిత శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు శ్రీ జిలేబి గారిది జిలేబి ఛందస్సని 'విట్టేసారు' :)

ఆహ్ జిలేబి ఛందస్సు అనుకున్నా :)

ఆ తరువాత ఛందస్సు సాఫ్టువేరు కనిపించి ఔరా ఇట్లా కూడా ఓ పరికరం ఉందా అనుకుంటూ 'పిచ్చి పిచ్చి గా' పదాలను గుచ్చేసు కుంటూ , అర్థం ఉందో లేదో, చదివే వాళ్లకు అర్థం అవుతుందో లేదో మనకేమిటి ? అనుకుంటూ,( 'గొంగళి లో తింటూ వెంట్రుక లేరు కోరు అని శ్యామలీయం వారు మొత్తు కునే దాక :)) యడాగమాలు, సంధులు,  సమోసా' లు మనకు జాన్తా నై, ఖాతర్ నై అనేసు కుంటూ , పంచ దశ లోకపు జనాలు జుట్టు పీక్కునేటట్టు 'జిలేబీ' ఫ్యాక్టరీ  పద్యాలు మొదలెట్టే సా :),

వెంకట రాజారావు గారు ఊ అంటే మనం సయ్యంటూ పద్యాలు లాగేసు కుంటూ, కొత్త పదాలకు, జాతీయాలకు, సామెతలకు,  కార్ఖానా అయిన కష్టే ఫలే వారి బ్లాగు ని ఫాలో అయిపోతూ, పాటల తో అలరిస్తున్న పాట తో నేను లో సినీ పదాల ని గమనిస్తూ వాటిలో ని ఛందసు గమనిస్తూ ...

ఇదెంత దాకా పోయింది అంటే, తనకంటూ ఓ స్టాండర్డ్ ఉన్న 'ఈమాట' లో జిలేబి 'సమోసా' గా , జిలేబి చందస్సు ఎ.తె. ఛందస్సు గా మారి కథా రూపమై , బ్లాగ్ లోకం పై ఓ సెటైర్ గా మారి పోయేంత గా అన్న మాట :)

నిజం చెప్పాలంటే ,సమస్యా పూరణ ఇచ్చిన వాళ్ళు మొదట్లో నే దానికి సరియైన సమాధానం పెట్టు కునే ఇస్తారు, కవి ఇది కుదరదు పూర్తిచేయడానికి అంటే, అబ్బే ఇట్లా చెయ్యోచ్చండి అని చూపించ టానికి (ఎక్సెప్షన్ - నాకు తెలిసినది -  మా లలిత గారు, గిరీశానికి మధుర వాణి ని అమ్మాయి గా చేసేసి, చంపక మాల లో నరాల వారికి సమస్య నిచ్చి , వారు ' అమ్మాయ్ - దీనికి పూరణ నీ దగ్గర ఉందా అంటే , బిక్కమోగం పెట్టేసేరట :)

కాబట్టి ప్రతి సమస్య కు  ఓ లానే గాకుండా, ఎన్నో విధాలు గా జవాబు లుంటాయి. (దీని ద్వారా నేర్చు కోవలసినది ఇది అన్నది గరికి పాటి వారి ఉవాచ )

టు కట్ షార్ట్  (ఈ వాక్యం ఎవరదో చెప్పుకోండి చూద్దాం బ్లాగ్ లోకం లో :)) ,

నేర్చు కున్న దేమి టంటే సమాజం లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. (సమస్య ని చదివితే చెడు లా అనిపిస్తుంది) . చెడుని పక్కకు తోసి మేధస్సు కు పదును పెడితే మంచి ని దాన్నించి లాగొచ్చు . అట్లాగే సమస్య ని చదవ కుండా, సమస్య గానే స్వీకరించి, మేధో మధనం చేస్తే, బ్రెయిన్ వేవ్స్ స్ట్రాంగ్ గా మారి ఈ 'బామ్మ' కాలం లో శరీరపు చురుకు దనం తో పాటు, మేధస్సు కూడా చురుకు గా ఉండే రీతి గా మనల్ని మనం మార్చేసు కోవచ్చు అన్నది కనుక్కున 'రహస్యం' (జిలేబీ రహస్యం :)) - మన పుస్తకాలన్నీ రహస్యం అనే పేరు పెట్టు కునే లా అన్న మాట :) - మన బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి జ్యోతిష్య రహస్యం, ఆ రహస్యం, ఈ రహస్యం లా అన్న మాట :))

కొసమెరుపు - ఇంతా రాసింది ఎందుకంటే, విన్నకోట వారు కూడా పద్యాల్ని రాయటం మొదలెట్టా రంటే కొన్నాళ్ళ కే సమస్య లని చదవటం మానేస్తారని :)

రెండో కొస మెరుపు - అక్కడ ఫణి అనే వారు, "ఈశ్వర నిందకు కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురునిందకు లేదు అని శాస్త్రము. గురువుగా ఒకరిని భావించిన తరువాత వారి తప్పొప్పులను ఎంచు అధికారము శిష్యులకు లేదు. ఈనాటి కవి మిత్రులందరికీ గురునిందాదోష పరిహారము కావలెనని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను."

ఇట్లాంటి మూఢ నమ్మకాలు పెట్టేసు కున్నందు వల్లే దేశం లో గుండు గురువులు ఎక్కువై పోతున్నా రనుకుంటా !

గురువైనా , శిష్యుడై నా, మనమందరము ఒక పరిధి లోని వారమే .

కాబట్టి ఇట్లాంటి గుడ్డి నమ్మకాలు వేష్ట్ !

విద్యాధికులే ఇట్లాంటి నమ్మకాలు పెట్టేసు కుంటే, ఇక  మిగిలిన వారి గురించి చెప్పాల్సిన అవసరం అసలు లేదు.

తప్పక మ్యూచ్యువల్ రెస్పెక్ట్ ఉండాలి. అంతే కాని అది మూఢ నమ్మకం గా మారి పోకూడదు.


చీర్స్
జిలేబి
హమ్మయ్య ! చాన్నాళ్ళకి మేటరు దొరికె
'రాసు' కోవటానికి :)

Saturday, October 21, 2017

మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !



మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !
 


ఉపోద్ఘాతం - నిన్న శంకరాభరణం సమస్యా పూరణం లో శకారుని మాటలంటూ శ్రీ కంది శంకరయ్య గారు
"రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే" అన్న పూరణ చేయడంతో ఎడ్డం టే తెడ్డు లా గున్న ఈ పూరణ చూసి , ఏమీ అర్థం గాక దీని అర్థం ఎట్లా చేసు కోవాలో చెప్పండంటే గుర్రం సీతా దేవి గారు, ఆ ముందు పలుకులు (శకారుని మాటలు ) గమనించండి అన్నారు.

సరే అర్థం కాకపోతే ఆంధ్రభారతే శరణ్య మానుకుని శకారుడు అని వెతికితే ఆంధ్ర భారతీ వారు జాన్తా నై అనేసారు.
మళ్ళీ అర్థం కాలే అంటే, మధ్యలో జీపీయెస్ వారు ఈ క్రింది లంకె నిచ్చారు  శకారుడు అంటే ఏమిటో అర్థం చేసు కోవడానికి. !   ఓహో "శకారు" కూడా మరో జిలేబి యే యని దాంతో తలే ఉంగలీ దబాయా !


మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !


బ్లాగాడిస్తా రవి గారు విరివిగా పంచ దశ లోకం లో టపాలు రాసేవారు ! ఈ మధ్య మానుకున్న బ్లాగుధీర మంతుల లో మరొక్కరు వీరు కూడా :) జేకే !

http://blaagadistaa.blogspot.com/  వీరి ప్రైవేటు బ్లాగై పోనాది :)

సరే వారి పూర్తి నిడివి వ్యాసం పొద్దు లో పై లింకు లో చదవ వచ్చు !

ఈ టపా ఎందుకంటే - ఈ టపా చూస్తే వారు మళ్ళీ బ్లాగు తెర తీస్తారని ఆశ తో :) - విన్నపాలు వినవలె వింత వింతలు !

వారి వ్యాసం నించి కొన్ని -

సంస్కృత భాష సౌందర్యం గద్గద నదీప్రవాహ ఝర్జరిత గాంభీర్య ప్రాధాన్యమయితే, ప్రాకృత భాష సొగసు మలయమారుత స్పర్శిత కిసలయోద్భూతమైన సౌకుమార్యం.

మృచ్ఛకటికం - మృత్ + శకటికం, మృచ్ఛకటికం అయింది. శకటం అనకుండా శకటికం అన్నారు కాబట్టి, (మృత్) శకటానికి సంబంధించిన లేదా “చిఱు శకటం” అని వ్యుత్పత్తి చెప్పుకోవాలి.

శకారుడి గురించి-

విధవిధాలుగా అపభ్రంశపు ఉపమానాలు చేస్తుంటాడు. ఉదాహరణకు –

◾రావణుడికి కుంతిలాగా నువ్వు నా పాలబడ్డావు.
◾రాముడికి భయపడ్డ ద్రౌపదిలా భయపడకు.
◾విశ్వావసువు సోదరి సుభద్రను హనుమంతుడు అపహరించిన రీతిలో నేను నిన్ను అపహరిస్తాను.
◾అడవికుక్క లాంటి నేను పరిగెడుతుంటే, ఆడునక్కలా నువ్వు పారిపోతున్నావు.

మృచ్ఛకటికం కథ టూకీ గా (రవి గారి మాటల్లో )

పాలకుడనే రాజు ఉజ్జయినీ నగరం రాజధానిగా అవంతీ రాజ్యాన్నిపరిపాలిస్తుంటాడు. ఆ రాజొక దుష్టుడు. శకారుడు – రాజు గారి బావమరిది. శకారుడు మూర్ఖుడు, అవకాశవాది, కౄరుడు. నగరంలో చారుదత్తుడనే బ్రాహ్మణశ్రేష్టుడు నివసిస్తుంటాడు. ఇతడు దానధర్మాలు చేసి దరిద్రుడయిన వాడు, సుందరుడు, సచ్ఛీలుడు. ఇతడికి ధూతాంబ అనే భార్య, లోహసేనుడనే పుత్రుడూ ఉంటారు. వసంతసేన ఆ నగరంలోని గణిక ప్రముఖురాలు. ఈమె చారుదత్తుడిపైన మనసు పడుతుంది. వసంతసేనను రాజశ్యాలుడు – శకారుడు మోహించి వెంటబడతాడు. ఓ ఘట్టంలో అతణ్ణుండి తప్పించుకుందుకు వసంతసేన చారుదత్తుడి ఇంట్లో జొరబడుతుంది. తననో దుష్టుడు నగలకై వేధిస్తున్నాడని, ఆ నగలను దాచమని చారుదత్తుడి కిస్తుంది. చారుదత్తుడు ఆ నగల బాధ్యతను తన సహచరుడు మైత్రేయుడికి అప్పజెపుతాడు.

ఈ రూపకం యొక్క కథాసంవిధానం గురించి పండితులు ఎన్నో రకాల ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పబడినా, తిరిగి ఇంకొక విధంగా, మరో కోణంలో ఆవిష్కృతమయే విలక్షణ కథాసంవిధానం ఈ రూపకం సొంతం.

శర్విలకుడనే చోరుడు ఓ రోజు రాత్రి చారుదత్తుడి ఇంటికి కన్నం వేసి, ఆ నగలను అపహరిస్తాడు. ఈ శర్విలకుడికొక ప్రేయసి ఉంటుంది. ఆమె ఎవరో కాదు. వసంతసేన పరిచారిక అయిన మదనిక. ఆమెను దాస్యవిముక్తి చేయడం కోసమే శర్విలకుడు చౌర్యానికి పాల్పడ్డాడు. అపహరించిన నగలను తీసుకుని శర్విలకుడు వసంతసేన ఇంటికి వెళ్ళి, మదనికను కలిసి, జరిగింది చెబుతాడు. మదనిక భయపడి, ఆ నగలు తన యజమానురాలివేనని, ఆమే స్వయంగా వాటిని చారుదత్తుని వద్ద దాచిందనీ చెప్పి, చౌర్యారోపణ పాలుబడకుండా “చారుదత్తుడే తనను పంపినట్టుగా వసంతసేనతో చెప్పి, నగలను ఒప్పజెప్ప”మని శర్విలకుడికి ఉపాయం చెబుతుంది. చాటునుంచి వసంతసేన ఈ సంభాషణ వింటుంది. శర్విలకుడు మదనిక చెప్పమన్నట్టుగా తనను, చారుదత్తుడు నగలను అందజేయడం కోసం పంపాడని, నగలు తీసుకొమ్మని వసంతసేనకు అందజేస్తాడు. వసంతసేన అతని సద్బుద్ధికి మెచ్చి, మదనికను శర్విలకుడితో సాగనంపుతుంది. శర్విలకుడు మదనికను తీసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో, తన స్నేహితుడు ఆర్యకుడు రాజు పాలకుడిచేత బందీ అయినట్టు తెలుసుకుంటాడు. మదనికను ఇంటికి పంపి, ఆర్యకుడిని కారాగారం నుండి విడిపించడం కోసం పథకం రచిస్తూ బయలుదేరతాడు.

సంవాహకుడనేవాడు చారుదత్తుడి వద్ద పరిచారకుడిగా ఉండి, చారుదత్తుడి ఐశ్వర్యం క్షీణించిన తరువాత పొట్టకూటికై తపిస్తూ, జూదవ్యసనపరుడయి పరిభ్రమిస్తుంటాడు. ఇతడు ఓ జూదంలో పది సువర్ణాలను ప్రత్యర్థికి బాకీపడి, అవి చెల్లించలేక, పారిపోతూంటాడు. పారిపోతున్న తనను జూదంలో నెగ్గిన ద్యూతకుడనే మరొక జూదరి పట్టుకుని చితకబాదుతాడు. దెబ్బలకు తాళలేక పారిపోతూ, సంవాహకుడు ఓ ఇంటిలో జొరబడతాడు. ఆ ఇల్లు వసంతసేనది. ఆమె వివరాలన్నీ తెలుసుకుని, ధనం ఇచ్చి సంవాహకుణ్ణి విడిపిస్తుంది. ఆ సంవాహకుడు విరక్తి చెంది, బౌద్ధ శ్రమణకుడవుతాడు.

వసంతసేన నగలు పోయిన తర్వాత, ఆ నగలు తనే దొంగిలించాడని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉందని, తన దారిద్ర్యానికి తోడు అపవాదూ వచ్చి పడబోతున్నదనీ చారుదత్తుడు క్రుంగిపోతాడు. భర్త పరిస్థితి గమనించి ధూత, ఆ నగలకు పరిహారంగా వసంతసేనకు తన రత్నాల హారాన్ని ఇచ్చి బదులు తీర్చేసుకొమ్మని చెబుతుంది. ఆ రత్నాల హారాన్ని తన సహచరుడి చేతికి ఇచ్చి అతని ద్వారా వసంతసేనకు అప్పజెబుతాడు చారుదత్తుడు.
తన నగలు తనకు ఇదివరకే ముట్టాయని, జరిగిన విషయాలన్నిటినీ విశదీకరించే ఉద్దేశ్యంతో, వసంతసేన శర్విలకుడి ద్వారా తన వద్దకు చేరిన నగలను, చారుదత్తుడు పంపిన రత్నాల హారాన్నీ తీసుకుని చారుదత్తుడి ఇంటికి ఓ సాయంత్రం పూట వెళ్తుంది. ఆ రాత్రి ఆమె చారుదత్తుడి ఇంట విశ్రమిస్తుంది. మరుసటి రోజు ఉదయం చారుదత్తుడి ఇంటిలో బాలుడు రోహసేనుడు ఓ మట్టిబండితో ఆడుతూ, తనకు సువర్ణశకటం కావాలని మారాం చేస్తూ ఉంటాడు. వసంతసేన ఆ బాలుణ్ణి ఊరడించి, ఈ నగలతో నువ్వూ సువర్ణ శకటాన్ని కొనుక్కోవచ్చని, నగలను ఆ మట్టిబండిలో పెట్టి పిల్లవాడిని సముదాయిస్తుంది.

ఆ తర్వాత –

శకారుడి బండిని చారుదత్తుడు తనకోసం పంపిన బండిగా పొరబాటు పడి వసంతసేన పుష్పకరండకమనే ఉద్యానవనానికి బయలుదేరుతుంది. నిజంగా చారుదత్తుడు పంపిన బండిలో కారాగారం నుండి తప్పించుకున్న ఆర్యకుడు ఎక్కుతాడు. అక్కడ ఉద్యానవనంలో శకారుడు వసంతసేనను తన బండిలో చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతాడు. ఆమె తన చేతికి చిక్కిందనుకుంటాడు. తనను వరించమని వసంతసేనను హింసిస్తాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో, ఆమె గొంతు నులుముతాడు. వసంతసేన స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆమె చనిపోయిందని తలచి శకారుడు – ఆమెను హత్య చేసినది చారుదత్తుడని న్యాయాధిపతుల వద్ద అభియోగం మోపుతాడు. చారుదత్తుడి వద్ద, వసంతసేన తాలూకు నగలు దొరకడంతో న్యాయనిర్ణేతలు అతనికి కొరత శిక్ష విధిస్తారు. కొరత శిక్షను అమలు జరిపడంలో భాగంగా, అతడిని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, వధ్యశాలకు తీసుకొని వెళుతుంటారు.

ఇక్కడ ఉద్యానవనంలో స్పృహ తప్పిన వసంతసేనను ఓ బౌద్ధ శ్రమణకుడు (ఇదివరకటి సంవాహకుడే) రక్షించి, ఉపచర్యలు చేసి బయటకు తీసుకువస్తాడు. చారుదత్తుడికి కొరత విధించబడే సమయానికి వసంతసేన అక్కడ చేరి, న్యాయాధికారులకు విషయం వివరించి అతడిని విడిపిస్తుంది. శకారుడికి జనం బుద్ధి చెపుతారు. ఈ లోగా ధూతాంబ అగ్నిప్రవేశం చేయబోతుంటే, చారుదత్తుడు వచ్చి, ఆపుతాడు. నేపథ్యంలో ఆర్యకుడు పాలకుడిని చంపి రాజవుతాడు. చారుదత్తుడిని, మరో నగరానికి రాజును చేస్తాడు ఆర్యకుడు. వసంతసేనను చారుదత్తుడు రెండవ భార్యగా ధూత అనుమతితో స్వీకరిస్తాడు.


ఆనందో బ్రహ్మ !

సావేజిత
జిలేబి


 

Friday, October 20, 2017

బండెనక బండి కట్టీ :)




 
 
బండెనక బండి కట్టీ
గుండెల నిండుగ జిలేబి ఘుమఘుమ లాడన్
చెండుల విసురుచు చకచక
వండుము పదముల మధురిమ వనితా రమణీ !
 
చీర్స్
జిలేబి
 

 

Monday, October 16, 2017

దీపావళి శుభాకాంక్షలు !

 
 
బ్లాగు జనులందరికి,
 
 
దీపావళి శుభాకాంక్షలతో
 
 
 
 
జిలేబి

Friday, October 13, 2017

రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!



రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!


మా లక్కు పేట రౌడీ
చాలా నాళ్ళ తరువాయి‌ ఝంపాకంబై
కోలాహలముగ వచ్చెను
బేల! పటాలంబఖిలము వెంటదగులునో :


రౌడీ రాజ్యంబదిగో
కేడీ లకు బుద్ధి జెప్ప కీశము గన్ బ్లా
గ్వాడకు జిలేబి వచ్చెన్,
బోడీ ! యాహ్వానము తెలుపుమ వెనువెంటన్ :


రౌడీ రాజ్యపు మాలికుండు భళిరా రయ్యంచు వచ్చెన్ గదా!
బోడీ! బ్లాగుల కున్ జిలేబులగుచున్ బొంకప్ప లెల్లన్నికన్
గాడీరూటుల మార్చివచ్చు హరిమల్ గాన్పట్టు చుండెన్ గదా !
మేడాటంబులకున్నికన్ భళిభళీ మేగాపు లున్వత్తురే !



పంచదశ లోక మేగాపులకు 
వెల్కమ్ కిచ కిచ !

చీర్స్
జిలేబి  

Wednesday, October 11, 2017

భాషాయోషకు మరియొక పవళమ్మిదియే !




భాషాయోషకు మరియొక పవళమ్మిదియే !




భేషౌ ! లలితా జిలేబి పెంపెక్కెన్బో :)
పేషానీ యై వెలిగిరి 
భాషాయోషకు మరియొక పవళమ్ము వలెన్ !


చీర్స్
టు లలితా
జిలేబి
 

Tuesday, October 10, 2017

రండి ముతక సామెతలు, జాతీయాలు లోకోక్తులు నేర్చుకుందాం :) - 1


రండి ముతక సామెతలు, జాతీయాలు లోకోక్తులు  నేర్చుకుందాం :)


బ్లాగ్ వీక్షకులారా !
మీ మనసు దిటవు పరచు కొనుడు.

ముతక సామెతలు, జాతీయాలు, లోకోక్తులు, జనబాహుళ్యము లో ని వి. వాటి ని మీరు నిరసిం చుకున్నా , చీ యని ఛీ కొట్టినా వాటికి వచ్చే నష్టము లేదు.


సామాన్య జన పలుకుల్ని రత్తాలు రాంబాబు ద్వారా రావి శాస్త్రి పలికించాడు విపరీతం గా. ఎంత గా అంటే అవి నిఘంటువు ల లో కెక్కేటంత గా.

ఆ కాలం లో రత్తాలు రాంబాబు చదవని వారంటే వెర్రి వెధవాయిలే.

కావాలంటే మా పనిలేని డాటేరు బాబు గారిని అడగండి. వారు రావి  శాస్త్రీ యాన్ని వడ గట్టి, ఎండ గట్టి గట్టి కాఫీ కింద తాగిన వారు. (ఈ మధ్య ఫేసు బుక్కు కే వారంకితం అయిపోయేరు - జైలు ఖానా లో ఖైది అయిపోయారన్న మాట ) :)

సరే విషయానికి వస్తే వేమన తాత ఏమన్నా తక్కువా ? ముతక పదాల్ని ఆట వెలది లో చందం లో ఇమడ్చ డానికి ?
(బ్రహ్మయ్య లను ఎండ గట్టేడు కాబట్టి తాత ఐపోయేడు. లేకుంటే ఐలయ్య లా పలికి ఉంటె తన మీద జనాలు ఎగ బడి ఉండే వారేమో ? ఊహ మాత్రం అంతే - లేకుంటే

పిండములను జేసి పితరుల దలపోసి కాకులకు బెట్టు గాడ్డెలార ! పియ్య తినెడు కాకి పితరు డెట్లాయెరా అని దమ్ము గా అని వుండే వాడా ?

సరే నేటి ముతక సామెత - ఇది కొట్టు కొచ్చినది . ఎక్కడి నుంచి ? కనుక్కోండి చూద్దాం.

అంటూ సంటూ లేని కోడలు దాని మేనమామ కొడుకు చిక్కుడు చెట్టు క్రిందికి పోయి పక్కలు ఎగుర వేసి నారట !


ఇవ్వాల్టి కథా కమామీషు
పరి సమాప్తము

ఇట్లు

జిలేబి