Monday, May 24, 2010

నేనెందుకు ఆంధ్రా వాలా/ వాలి కాను?

నేనెందుకు ఆంధ్రా వాలా / వాలీ కాను?

ఇట్లాంటి శీర్షిక పెడితే నా బ్లాగు కి ఎక్కువ క్లిక్కులు వస్తాయని ఓ అరవ అమ్మాయి చెప్పడం తో సరే పోనీ ఇట్లాంటి టపా తో పోస్టింగ్స్ చేద్దామనే ప్రయత్నం షురూ చేసి ఈ రెండు వ్యాఖ్యలతో ముగిస్తున్నాను.

ఆలోచించి చూడండి - నేనెందుకు ఆంధ్రా వాలా కాకుంటే - ఆంధ్రా వాలీ కాను? ఈ మధ్య తెలుగు పేపర్లు చదువుతుంటే నిజంగా మనం ఆంధ్రులమేనా అన్న సందేహం రాక మానదు. ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Thursday, May 13, 2010

కాంతం కనకం కర్పూరం

కర్పూరం తాను కరిగిపోతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది.

కనకం తానూ కరగదు తనని సొంతం చేసుకున్న వాళ్ళని కరిగించదు.

మరిక కాంతం మాట ఏమిటి ?

కాంతం కనకము కర్పూరం కూడాను.

కాంతం కర్పూరం లా తానూ కరిగిపోతుంది.

భామతి కథ చదివారా ఎప్పుడైనా?

కాంతం కర్పూరం అనడానికి భామతి ఉదాహరణ.

కనకం లాంటి "కాన్" తాలు లేక పోలేదు. మన బెనర్జీ లూ - లాగ.

మరి కాంతం లాంటి కాంతం ఉన్నారా?
అబ్బో ఉంటె - మా లా ఉంటారేమో ?

cheers
జిలేబి.

Tuesday, May 11, 2010

ఆది శంకర - గౌతమ బుద్ధ- స్వామీ వివేకానంద - ఆ పై?

శంకరాచార్యుల వారు జీవించినది ఓ ముప్పై సంవత్సరాల కాలం పాటు. గౌతమ బుద్ధుడు జీవించినది ఓ ఎనభై సంవత్సరాల కాలం పాటు. స్వామీ వివేకానంద విషయం తీసుకుంటే ఆయనా నలభై లోపే జీవనం పరిసమాప్తి చెయ్యడం జరిగింది.

వేదముల సూక్ష్మం మరుగుపడి కర్మ కాండలు అధికమై సనాతన ధర్మం అధోగతి పాలవుతున్నప్పుడు బుద్ధుడు దిక్సూచి గా మారి జన జీవనానికి వేదాన్ని దాని సారాంశాన్ని ధ్యాన మార్గం ద్వారా తెలియజేసి ఓ సరికొత్త పంధా కి నాంది వాక్యం పలికాడు.

అలాగే బౌద్ధం క్షీణించి కర్మ కాండల మార్గం లో దిక్కు లేని దిశలో ప్రయాణిస్తున్న సమయం లో ఆది శంకరులవారు సనాతన మతాన్ని ఉద్దీపనం చేసారు.

ఆ పై చరిత్ర పునరావృత్తం అయి సనాతన ధర్మం అడుగున పడి - అసలు సనాతన ధర్మం ఇక నిల దొక్కుగో గలుగుతుందాని సందేహం వచ్చిన సమమయం లో వివేకానందుని వాక్కు ప్రతిధ్వనించింది. భువి పర్వంతం ఓ సరికొత్త నిర్వచనం తో సనాతన ధర్మం కర్మ సిద్ధాంతం వైపు పరుగులు తీసింది.

ఆ పై ఎవరు? - ? ఈ కాలానికి తగినట్టు స్వాములు - బాబాలు ఉన్నారు.
కాకుంటే - ఓ సరి కొత్త దర్శనాన్ని చూప గలిగే ఆ వినూత్న శక్తీ కాకుంటే మానీషి ఎవరు? ఆ మలుపు ఎప్పుడు?

చీర్స్
జిలేబి.

Tuesday, April 20, 2010

కొంప దీసి మీరు తెలుగు వారు కాదు కదా?

కొంప తీయ కుండానే మేము తెలుగు వారమే!
ఈ మధ్య జరుగుతున్న రాజకీయ 'కళేబరాలు' చూస్తూంటే - రాజ్యం లో ని దేశం లో ని పరిస్తితుల్ని గమనిస్తుంటే ఇది తప్పని సరిగా తెలుగు వారి తెగులే అని పించక మానదు! ఆ మాటకి వస్తే కొంప దీయ కుండానే మేము తెల్గు వారమే అని మరీ బల్ల గుద్ది కాకుంటే - మేడ ఎక్కి మా నాయకులు భాజాయిస్తున్నారు.
విష్ణు మాయ కాకుంటే - ఈ వూరికి ఆ వూరు ఎంత దూరం అంటారు? ఆ వూరికి ఈ వూరు ఎంతో ఈ వూరికి ఆ వూరు అంతే దూరం కాదు సుమా!

చీర్స్
జిలేబి

Saturday, April 3, 2010

జమీందారు హై స్కూలు - చిత్తూరు జ్ఞాపకాలు

బంగారుపాళ్యం జమీందారు హై స్కూలు -బీ జెడ్ హై స్కూలు - బోర్డు స్కూలు - లాంటి పేరు ప్రఖ్యాతలతో ఓ వంద సంవత్సరాలు పైగా చిత్తూరు నగరాని కి విద్యా దానం గావించిన మహోన్నత విద్యా పీఠం ఈ జమీందారు హై స్కూలు. స్వాతంత్రం మునుపు బోర్డు స్కూలు గా ఉండేది. అప్పట్లో "ఫారం" చదువులు. ఆ పై జమీందారు హై స్కూలు గా పరిణితి. దగ్గిరలో ఉన్న బంగారుపాళ్యం జమీందారు గారి పుణ్యాన ఈ నగరానికి ఈ స్కూలు ఆ కాలం లో వచ్చింది. అప్పట్లో ఈ స్కూలు ప్రఖ్యాతి రాష్ట్ర మంతటా ప్రబలి ఉండేదని వినికిడి. అంటే బెస్ట్ స్కూల్స్ లో అన్న మాట.

అప్పట్లో స్కూల్స్ తక్కువే కాబట్టి - ఈ స్కూల్కి డిమాండు ఎక్కువే. క్వాలిటీ విషయం లో పై చేయి ఉండడం తో ఇంకా ఎక్కువే అయ్యేది ఈ డిమాండు. అంటే - ఈ విషయం రామా రావు గారు విద్యని ప్రైవేటు గావించడానికి మునుపు అన్న మాట. ఆ పై ప్రైవేటు స్కూల్స్ రావడం - ఈ స్కూలు విద్యా రంగం లో వస్తున్న వేగమైన మార్పులకి అనుగుణం గా తనను తాను మలచుకోక పోవడం కారణం గా ఇప్పుడు ప్రాబల్యం తగ్గి ఓ మోస్తరు స్కూల్ గా మారి పోవడం జరిగిందన్నది సత్య దూరం కాని విషయం.

ఈ స్కూల్ గురించి - ఇందులో చదివిన విద్యార్తులు - విద్యార్థులు - వారు ఈ దేశం లో - విదేశాలలో ఎక్కడెక్కడో ఉండవచ్చు. ప్రతి ఒక్కరికి తమ స్కూల్ - పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. అట్లాంటి తీపి జ్ఞాపకాలతో ముడి పడి ఉన్న స్కూళ్ళలో పెను మార్పిడి జరిగి - ఆ స్కూలు నామ మార్తకం గా ఉంది అన్నది విన్నప్పుడు కొంత మనసు చివుక్కు మానక మానదు.

ఈ టపా ఎందుకంటే - మన దేశం లో ఇప్పుడు ప్రాథమిక విద్య అన్నది హక్కు కింద మార్చబడడం గుర్తింపు కలిగిన విషయం. ఈ మార్పులతో - ఇట్లాంటి ఎన్నో మరుగున పడ్డ మాణిక్యాలు మళ్ళీ - కొత్త పుంతలు తోక్కుతాయని ఆశిస్తాను.

చీర్స్
జిలేబి.

Wednesday, March 31, 2010

అమ్మాయీ అబ్బాయీ నీ పేరేమిటి?

మీకు బాబు ఇష్టమా లేక పాప అంటే ఇష్టమా అని ఎ ఆడవాళ్ళని అడిగినా వెంటనే బాబు అనో కాకుంటే పాప అనో కాకుంటే ఇద్దరూ అనో - కాకుంటే ఓ బాబు ఓ పాప అనో జవాబు వస్తుంది. అట్లాగే మగవాళ్ళని అడిగితె కూడా ఇట్లాంటి జవాబే ఏదో వస్తుంది.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే - అబ్బాయి అమ్మాయి ఎవరైనా - ఇష్టా ఇష్టాలు ఏదైనా మన మిష్ట పడిన దాన్ని బట్టి బాబో కాకుంటే పాపో పుట్టడం జరుగుతుందని కొందరి ఉవాచ. అంటే యతో మనః తతో మన సంతతి.
మీ పర్సనల్ విషయాలలో ఇలాటివి ఎదుర్కోవడం జరిగిందా? అంటే మీ ఇష్టం అబ్బాయి అయితే - మొదటి సంతతి బాబు పుట్టడం లాంటి జరిగిందా? ( ఉదాహరణకి - మా వారికి బాబు పుట్టడం అన్న కల వచ్చింది. మా బాబు పుట్టే కొన్ని నెలల ముందు- స్కాన్నింగ్ చెయ్యలేదు - తెలుసుకోవాలన్న కోరిక లేక పోవడం తో - కాని వస్తుతః మనలో ఏదో ఓ మూల బాబు పుట్టడం అయితే బాగుణ్ణు అన్న కోరిక ఇలా బాబు పుట్టడంలో ప్రతి ద్వనిస్తుందా ? మీరు ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Wednesday, March 24, 2010

జర్మనీ యాత్ర విశేషాలు - త్రిబెర్గ్

కూకూ క్లాక్ - లోపలి భాగం

జర్మనీ ఈ దక్షిణ భాగం లో ఉన్నది బ్లాక్ ఫారెస్ట్ గా ప్రసిద్ధి గాంచిన స్థలం . ఇక్కడ ప్రపంచపు అతి పెద్ద కుకూ గడియారం ఉన్నది. కుకూ గడియారం విశేషం ఏమిటంటే - ప్రతి గంటకి గడియారం నుంచి ఓ కుకూ బయటకి వచ్చి కుకూ కూత తో సమయాన్ని సూచిండడం ! త్రిబెర్గ్ వెళ్ళినప్పుడు తీసిన కొన్ని చిత్రాలు -

Friday, March 19, 2010

మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ బెడ్

ఈ టపా టైటిల్ గాంధిజీ గారి మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ ట్రూత్ లాగ ఉందేమిటి ఆనిపించ వచ్చు మీకు. పడకకి సత్యానికి మధ్య పొందిక ఏమిటి అన్న సందేహం రావచ్చు మరి కొందరికి.

పడక సత్య దూరం కాదని ఈ మధ్య పడక లో పుణ్యాత్ములు కొందరు నిర్దా రించారు కూడా!

కాబట్టి మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ బెడ్ అన్నది ఈ ఇరవై ఒక్క శతాబ్దపు పాపులార్ సబ్జెక్టు.

వాటర్ బెడ్ అన్నది వెస్ట్రన్ వరల్డ్ లో ప్రసిద్ధి. ఈ వాటర్ బెడ్ లో పడుకుని నిద్రించిడం అన్నది ఓ త్రిల్- ఇది రోగ నివారిణి అని కూడా చాల మంది నమ్ముతారు.

ఆ కాలం లో భీష్ముడు అంబుల పడక పై పడుకుని పుణ్య లోకాలకి వెళ్ళ డానికి వేచి ఉన్నాడు.

ఈ కాలం లో స్వామీజీ లు కూడా "అమ్ముల" తో పుణ్య లోకాలగురించి ఎక్స్ పెరి మెంట్స్ ఇన్ బెడ్ చేస్తున్నారు.

చాల మందికి బెడ్ కాఫీ చాల పసందైన విషయం.

మహా విష్ణువు శేష సాయి ఐ పవళించి ఉండడం సదా మనం చూసే ఆయన గారి ఫోసు.

యోగా లో శవాసనం "బెడ్"ల పై చేసే వాళ్ళు ఉన్నారు.

సో , ఇలా రాసు కుంటూ పోతూంటే ఈ బెడ్ మహిమ ఇంతింత కాదయా "విశ్వ దాభి రామా" అని పించక మానదు!

చీర్స్
జిలేబి.

Thursday, March 18, 2010

అరవం అమ్మాయీ- ఆంధ్రా అబ్బాయీ - ఇడ్లీ సాంబార్

ఈ చిత్తూరు పాత కాలం నాటినుంచి అరవ దేశం లో ఉండటం తో ఇక్కడ అరవం వాళ్ళ ప్రాబల్యం ఎక్కువే అని చెప్పొచ్చు. బోర్డర్ ఏరియా కాబట్టి - ఇప్పటికి అరవం వాసన చిత్తూర్ లో ఎక్కువే ఉంటుందనుకుంటా.
ఓ మోస్తరు అరవై ఎనభై ప్రాంతాలలో ఈ ఊళ్ళో తెలుగు కన్నా అరవం తో నే కాలం గడప వచ్చు. ఇప్పటికి మారి ఉంటుందనుకుంటా.
ఈ అరవం అమ్మాయిలూ స్కూళ్ళల్లో గానివ్వండి - కాలేజీ లలో గానివ్వండి చేసే "కిసిమిసు" (అరవం వాళ్ళు మాట్లాడితే - ఏమంటారు - గులక రాళ్ళ డబ్బా సౌండా?) ఇంతా అంతా కాదు.
అబ్బాయిలని గలాటా చెయ్యడం లో వీళ్ళ చాతుర్యం వేరే వేరు. అప్పటిదాకా మాట్లాడుతున్నఅరవం యాస తెలుగు సడన్ గా అరవం లో కి మారిపోయి గల గల నవ్వు ల పరంపర ఎక్కువవడం - ఈ అబ్బాయిలు బిక్క మొహం వెయ్యడం చాల సాధారణ విషయం! ఆ పై పక్క గ్రామాలలోనించి వచ్చే తెలుగు అమ్మాయిలు(నా లాంటి వేరే ఊళ్లలో నించి వచ్చి చదిన వాళ్ళు ఇంకా చాల తక్కువే ) ఆ కాలం లో తక్కువే కాబట్టి ఈ ఆంధ్రా అబ్బాయిలకి - ఈ పాటి కాలక్షేపం వీళ్ళతోనే సరి పెట్టు కోవలసి వచ్చేది.
ఈ అమ్మాయిలకి తెలుసు - ఇడ్లీ , సాంబార్ లేకుంటే అంత గొప్పదనం దానికి లేదని. అయినా ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అంత గొప్ప కాంబినేషన్ ఇంక వేరే ఎ కాంబినేషన్ లోను లేదు కాబట్టి - ఇడ్లీ లేకుంటే సాంబార్ వేల్యూ తక్కువే కాబట్టి - వీళ్ళ చాతుర్యానికి కొదవే లేకుండా ఉండేది.
ఇంక స్కూల్ అయ్యవార్లకి ఈ అరవం అమ్మాయిలని వాళ్ళ భాష - అంటే తెలుగు ఉచ్చారణ - మీద ఓ పాటి కామెంట్లు విసరడమూ కద్దు.
స్కూళ్ళల్లో అరవం క్లాసులు కూడా ఉండేవి.( ఇప్పుడూ ఉన్నాయా? నాకైతే తెలీదు) - ఈ గల గలా అమ్మాయిలు - ఆ ప్రక్క క్లాస్సుల్లలో "కిసిమిసు" ఈ పక్క క్లాస్సుల్లలో ఆంధ్రా అబ్బాయిలకి జోకులు వేసుకోవడానికి ఫస్ట్ క్లాసు మేటర్.
వీళ్ళ ట్రేడ్ మార్క్ - నెత్తి పై విభూతి బొట్టు- (అరవం వాళ్లకి ఈ భస్మం పెడితే నే పొద్దు పొడిచినట్టు అనుకుంటా) - దానికింద కుంకం బొట్టు - ఇవన్ని ఆ (మా ) కాలపు ముచ్చట్లు !

చీర్స్
జిలేబి.

Wednesday, March 17, 2010

వికృతి - వినా కృతి ?

వికృతి
ఆకృతి
వినా కృతి యా?
వేచి చూడవలసినదే
వికృతి గవాక్షం ఇవ్వాళ తెరుచుకుంది
గవాక్ష వీక్షణం మానవాళికి ఇప్పుడు లభ్యం

శుభాకాంక్షలతో

జిలేబి.