బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజులకి ఇచ్చిన మొదటి ప్రశ్న కథ 
అలా వచ్చిన యువరాజులని బ్లాగు యువరాణి వీక్షించి , ఈ ప్రశ్న ప్రుచ్చించెను. 
"ఒక బోయ వాడు అరణ్య మార్గాన వెళుతూంటే ఆతనికి రెండు చాతక పక్షులు ఆకసాన ఎగురుతూ కనబడినవి. 
ఆ బోయవాడు తన అంబుల పొదినించి బాణాన్ని అందుకుని గురి చూసి బాణం ఎక్కు పెట్టి, వదిలాడు. ఆ రెండు చాతక పక్షులలో ఒకటి ఆ బాణ ఘాతానికి మృతి చెంది నెల వ్రాలినది. 
ఆ రెండవ చాతక పక్షి ఆకసాన వృత్తాకారం లో తిరగసాగింది. ఈ మారు బోయ వాడు మరో బాణాన్ని ఆ రెండో పక్షి పై ఎక్కు పెట్టాలని బాణం కోసం అంబు ల పొది లో చెయ్యి పోనివ్వగా అతనికి ఖాళీ పొది కాన వచ్చింది.
ఆ బోయవాడు ఇక చేసేది లేక  'లేని బాణం' తో ఈ మారు విల్లు ఎక్కు పెట్టాడు. రెండో చాతక పక్షి ' లేని బాణ ఘాతానికి'  నేల వ్రాలి ప్రాణం విడిచి పెట్టింది. 
స్వయం వరానికి వచ్చిన రాజ కుమారులార ఇప్పుడు చెప్పండి - 
౧. 'లేని బాణం' తో ఆ బోయ వాడు ఎలా ఆ రెండో పక్షిని కొట్టాడు ? 
౨. ఆ రెండవ పక్షి ఎందుకు ప్రాణాన్ని విడిచి పెట్టింది ? 
ఈ ప్రశ్న లని విని రాజ లోకం లో కల కలం చేల రేగింది. ఈ యువరాణి సుకుమారి మాత్రం కాదు - కొంత మతి భ్రమించిన లలన కూడా అని. కాని ఆ సుకుమారి ని చూడగా ఆ మె తెలివైనదిగా అగుపించింది అందరికినూ. 
ఈ ప్రశ్నల కి సమాధానం చెప్ప గలవారెవ్వరు అన్నట్లు మహారాజులం వారు సభ ని ఒక మారు కలయ జూసినారు. 
(సశేషం ) 
జిలేబి. 


 
 
