Thursday, November 14, 2019

గాడిద మా లచ్చి - గోవు మా లచ్చి !



గాడిద మా లచ్చి - గోవు మా లచ్చి



14 నవంబర్ 2025 :
--------------------

డిల్లీ లో లోధి రోడ్ మినరల్స్ అండ్ మెటల్స్ కార్పొరేషన్  - ఎం ఎం టీ సీ ఆఫీసు సీ యీ వో  జ్ఞాన్ ప్రకాష్ గారికి  పొద్దుటే అర్జెంటు గా ఓ కాలొచ్చింది.  "సార్, మన వాల్ట్ ఖాళీ ! - పొద్దుట ఒకే ట్రేడ్ లో మొత్తం గోల్డు వాష్ అవుట్ అయిపోయి ఓ వ్యక్తిగత అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపొయింది" .

జ్ఞాన్ ప్రకాష్ ఉలిక్కి పడ్డాడు గాని , బేజారు పడకుండా తాపీ గా అడిగేడు - "ఆర్ యు జొకింగ్ ? వాట్ హ్యపెండ్ టు కట్ ఆఫ్ లిమిట్స్ ?"

"ఏమయ్యిందో తెలీదు సార్ ! బ్రీచ్ సిగ్నల్ రాలేదు " చెప్పాడా పెద్ద మనిషి.

జ్ఞాన్ ప్రకాష్ ఈ సారి ఉలిక్కి పడి , పైజామా నుంచి ప్యాంటు లోకి మారి కారుని లోధి రోడ్డు కి పోనిచ్చేడు. అసలే గోల్డు ధర  విపరీతం గా పడి పోయి కొనే వాళ్ళు లేకుండా పోయేరు. డే యిన్ డే అవుట్ ఇంకా ధర తగ్గొచ్చు వెయిట్, వెయిట్ అంటూ సీ ఎన్ బీ సీ గోల్డ్ అనలిస్ట్ హుషారు గా అంటూ ఉండటం తోడు గోల్డ్ డిపాజిట్ రావటం అదిన్నూ విపరీతం గా, సేల్స్ ఆల్మోస్ట్ నిల్ క్రింద అయిపోతోంది. ఈ నేపధ్యం లో ఇట్లా మొత్తం గోల్డు గోల్ మాల్ అవటం చర్చనీయాంశం కావొచ్చు.  తన ఉద్యోగానికే డోకా కూడా పడొచ్చు. అయినా ఇట్లా ఒకే ట్రేడ్ లో పోవటం ఏమిటి చెప్మా అనుకుంటూ గతాన్ని నెమరు వేసుకున్నాడు.

ఓ ఆరేళ్ళ ముందు దాకా నలభై వేలు పై చిలుకు ఉన్న పది గ్రాముల బంగారం సడెన్ గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పడి పోవటం ఆరంభించింది. గోల్డు కొనేవారు తగ్గి పోయి , వాల్ట్ లోకి గోల్డు డిపాజిట్ చేసే వారు ఎక్కువై పోయేరు దేశం మొత్తం మీద. దీంతో డిమాండ్ అసలు లేకుండా రోజుకి రోజు మరింత డవును గా ఎల్లో మెటల్ పడి పో నారంభించింది. ప్రస్తుతానికి ౩౦౦ రూపాయల ఖరీదు లో నిలిచింది. ఇంకా తగ్గొచ్చు - మే బీ వందకు తక్కువ పోయినా కూడా ఆశ్చర్యం లేదు. !


దారిలో జ్ఞాన్ ప్రకాష్  టీ ఎన్ కృష్ణన్ - విజిలెన్స్ ఆఫీసర్ కి ఫోను కలిపేడు. దక్షిణ దేశం వాడే తన మాట వింటాడు అనుకుంటూ - " కృష్ణన్ సాబ్ - యు హార్డ్ ది న్యూజ్ " అన్నాడు. ఆ వైపు నుంచి టీ ఎన్ కృష్ణన్ పొలైట్ గా "యెస్ సార్ - వి ఆర్ ఇన్వెస్టి గేటింగ్  విల్ రివర్ట్" అన్నాడు పొడి పొడి గా.

జ్ఞాన్ ప్రకాష్ కారు పోనిచ్చేడు.


14 నవంబర్ 2019
-------------------

ఆవులు మచ్చుకైనా రోడ్డు మీద కనబడని నగరం నించి  ఏడుకొండలు అనే ఆసామి బ్లాగు వ్రాసేడు. సంక్షిప్తం గా గోవు మాలచ్చి కడుపులో బంగారమే బంగారం అని"



అంతకు ముందే గోదావరి నది నీళ్ళ లో తేలి యాడిన మరో ఆసామి గాడిద మాలచ్చి అని బ్లాగు వ్రాసేడు. ఈ మహానుభావుడు డెబ్బై ఏండ్ల దాపుల్లో ఉన్న వాడు. చలామణి లో ఉన్న కొత్త కరెన్సీ లా ఫెళ ఫెళ లాడే మ్యాటర్లు వ్రాస్తుంటాడు.

అతను వ్రాసిన సారాంశం - గాడిద పాలు తో మాంచి బిజినెస్సు లాగించే యొచ్చు అని. దానికి దాయిచే ల్యాండ్లోనో నిప్పాన్ దేశం లో నో ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్ తయారు చేసి ప్రోటో టైప్ క్రింద లాభం ఎట్లా వస్తుందో చూపించేరు.



పనిలేక కునుకులు తీసుకుంటూ పజ్జాలు వ్రాసేసు కుంటూన్న బామ్మ జిలేబి కళ్ళ బడింది మ్యాటరు. మొదట్లో తీసి పడేసింది కాని పద్నాల్గో తారీఖు గోవు మా లచ్చి  ఆర్టికల్ కూడా చదివేక బామ్మకి, తాను మోడీ వెంబడి తిరిగిన వూళ్ళ లో వాళ్ళు  వ్రాసిన సపోర్టింగ్ మేటరు కనుల పండువ గా అనిపించి ఓ పెద్ద ప్లాన్ వేసింది.

పెనిమిటి జంబునాథన్ కృష్ణ స్వామి అయ్యరు గారికి పని పురమాయించింది. పాకిస్తాన్ లోనించి  కర్తార్ పూర్ కారిడార్ ద్వారా గాడిదల్ని (సర్దార్ జీ మోటారు బైకు ఇంపోర్టు కత లెవల్లో ) గాడిద ల పైన చెత్త పడేసుకుని బార్డర్ ఏరియా లో కనులు గప్పి ఇంపోర్ట్ చేయ నారంభించి గుజరాత్ లో కచ్ ఏరియా లో పెద్ద గాడిద మాలచ్చి  ఇంటర్ నేషనల్ ఇన్ కార్పోరేషన్ అనే సంస్థ ని నెలకొల్పింది.

దీనికి తోడు ఏడు కొండలు వ్రాసిన గోవు మాలచ్చి కత చదివేక సీరియస్ గా ఆలోచించి  గోవు మా లచ్చి ఇండియా ఇంకార్పోరేషన్ నెలకొల్పింది.

ఈ రెండూ కాంబినేషన్ లు క్లిక్ అయి ఓ వైపు గాడిద పాలు విపరీతం గా డబ్బులు వెద జల్లటం, ఆ డబ్బులతో గోవు ల్ని విపరీతం గా కొనుక్కొని వాటి కడుపు లో నించి గోల్డు   విపరీతం గా దిగుమతి చేసుకోవటం మొదలెట్టింది జిలేబి.

మధ్య లో గవర్న మెంటు ఆఫ్ ఇండియా వారు గోల్డు లన్నిటికీ లెక్క కట్టా లని పీకల మీదకి రావడం తో, లెక్కల ను పకడ్బందీ గా పెట్టు కొని,  గోల్డు టన్నుల కొద్ది డిపాజిట్ చేయటం మొదలెట్టింది.

ఈ రెండు కలిసి గోల్డు విపరీతం గా ధర పడి పోవటం మొదలెట్టింది మేరా భారత్ మహాన్ మేక్ ఇన్ ఇండియా తో.

ధర రెండు వేల ఇరవై అయిదు నాటికి మూడు వందల రూపాయలకు పడి పోయింది పది గ్రాములు. !

ప్రజలకు ఆశ ఎక్కువ. ఇంకా పడి పోతుంది ధర అనుకుంటూ కూర్చున్నారు.


10 Nov 2025
---------------

ఇండియా నించి ఓ సెక్యూర్డ్ వాట్సాప్ కాల్ అమెరికా కి వెళ్ళింది.

"మనవడా" అంది ఈ వైపు  గొంతు.

ఓయ్ బామ్మా అన్నాడు ఆ వైపు లక్కు పేట రవుడీ, ది గ్రేట్ ఎజైల్ గురు.

అబ్బీ - ఎం ఎం టీ సీ సర్క్యూట్ బ్రేక్ ఓ పది నిమిషాలు ఆపాల్రా ఈ వైపు గొంతు .

ఓస్ అదెంత పని అన్నాడు ఆ వైపు మనవడు.

ముహూర్తం ఫిక్స్ అయింది. - 14 Nov 2025 పొద్దుట ఆరు గంటలకు.



చీర్స్
జిలేబి 

9 comments:

  1. ఈ పోస్టు కు పెట్టిన శీర్షిక తొలి సగం is in poor taste and distressing. Please change it.

    ReplyDelete
    Replies

    1. Go and hang yourself :)

      వెళ్ళు! ఉరేసుకో :)


      జిలేబి

      Delete
    2. ఇంతవసరమా?

      Delete
    3. https://youtu.be/_l5El5n8qmg

      Delete
  2. పేలాల లవంగక శతకకర్త

    జిలేబి



    బధాయీ హో బధాయీ

    డోల్ బజావో

    మిఠాయీ భాంటో

    జలూస్ నికాలో

    జై బోలో జిలేబీ కీ,జై బోలో జిలేబీ కీ,జై బోలో జిలేబీ కీ

    ReplyDelete
  3. కంద చక్రవర్తిని జిలేబి

    ReplyDelete
  4. జిలేబీ నువ్వు నోరు జారినా పరవా లేదు. గాడిద గుడ్డు గా భావిస్తాను.

    ReplyDelete
    Replies

    1. వెధవాయ్! నువ్వు ఎగడు దెగడు గా మాట్లాడొచ్చుగాని మిగతా వాళ్ళు నిన్నకూడదంటే ఎట్లరా అబ్బిగా ?

      :)
      జిలేబి

      Delete
  5. జిలేబీగారండీ, చైనాలో వుండి మీ పోస్ట్ వెంటనే చదవలేకపోయా, (మీది గూగుల్ బ్లాగ్ కదా). "ఏడుకొండలవాడు" మీచేత ఒక పోస్టు రాయించటం హాపీగా వుంది. ఇంతకీ మీరు చెప్పిన గోల్డ్ ట్రేడ్ విషయాలు అర్ధం కాలేదుగానీ ఎం.ఎం.టీ.సీ. గోల్డ్ వదిలేసి ఆవులూ, ఆవుపాల మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదేమో.

    btw, జంబునాధన్ క్రిష్ణస్వామి అయ్యర్ అంటే J.K.అయ్యరా?
    jk ;-)

    ReplyDelete