Saturday, December 12, 2009

మొర మొరాలు బొరుగులు కూనలమ్మ పదాలు

చిత్తూరులో ఓ ముసల్మాను - పతాను బొరుగులు అమ్మే వాడు. "మొర మోరా" అన్నది అతని కేక !

మొదట్లో సైకిల్ లో వచ్చేవాడాయన - ఆ పై ఓ ఓల్డ్ టీవీఎస్ ఫిఫ్టీ లో వచ్చి బొరుగులు అమ్మేవాడు.
అతని కంఠం వీధి చివర్లో అరిస్తే ఆ వీధి మొనలో వినబడేది ! ఈ మానవుడి గురించి చిత్తూరబ్బాయీ ఒకతను సుమన్ కుమార్ అనే అతను, తన కథలో ఓ క్యారెక్టర్ గా కూడా చిత్రించిడం జరిగింది.

ఇప్పుడు ఈ మొర మొర ప్రసక్తి ఎందుకు అంటే -

ఈ రెండు రోజులలో ఆంద్ర రాజ్యం లో "మొర మొర" లు ఎక్కువై పోయేయి. అంటే బొరుగులన్న మాట . గాలి ఎటు వీస్తే బొరుగులు ఆ వైపు ఎగిరి పోతాయి. ఇప్పడు ఆంధ్ర దేశం లో ఏ బొరుగులు ఎక్కడ తేలతాయో కూడా తెలియడం లేదు.

ఈ "తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది" అన్న పాట ఎంతదాకా సరి అన్నది తెలియడం లేదు!

దేశ విభజన , రాజ్యాల విభజన రాష్ట్రాల విభజన - "విభజించు పాలించు" అన్న సూత్ర మునకు కట్టు బడి ఉన్నామా లేక ఇంకా భారతీయులు గా ఉన్నామా ?

అంతా చిదంబర చిద్వాలాసం అనుకోవాలా లేక ఇది మూక సైకాలజీ మీద "మాతా హరి" రాజకీయ నాటక రచనా పరిహాసమా?

అవురా నలుగురు నవ్వి పో దురు గాని నాకేటి సిగ్గు? కూనలమ్మ పదాలే రాజ్య భవితవ్యం!

రాష్ట్రమంతివర్గం చేవ లేకుండా సత్తా లేకుండా ఉంటే - రాజన్నవాడు నిఖార్సుగా ఉండక పొతే - ఆ దేశ రాజ్య పరిస్థితి నడి సముద్రం లో నావ!

దాని దిక్కు కి సూచికా లేదు- దాని మనుగడకి భరోసా నూ లేదు. !

అంతా విష్ణు మాయ కాకుంటే మరే మంటారు?

చీర్స్
జిలేబి.

1 comment:

  1. విష్ణు మాయకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. పెరిగిపోతూ ఉన్న ఈ రాష్ట్రాల సమష్యకి మాత్రం పరిష్కారం లేనట్లే ఉంది. చివరికి దేశం మొత్తం లోని అన్ని ఊళ్ళు ఒక్కో రాష్ట్రం గా మారిపోయేట్లున్నాయి. చాలా బాగా చెప్పారు వరూధిని గారు.

    ReplyDelete