ఈ టపాలు రాయడానికి చాలా ఆలోచించి రాద్దామా వద్దా అన్న సందేహం లో పడి సరే రాద్దాం అన్న ఆలోచనతో రాస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుత చిత్తూరు పరిస్తితి ని చిత్రీ కరించదు. ఈ ఉడిపి హోటలు ఓ ముప్పై ఏళ్ళ క్రితం బ్రాహ్మణ వీధిలో ఓ ఇరవై ఏళ్ళ క్రితం జండా మాను వీధిలో ఆ పై బజారు వీధిలో ఉండేది. ఆ పై ఈ హోటలు మూత పడిందో లేదో నాకు తెలీదు. కాని ఈ ఉడిపి హోటల్లు సాంబారు - అదీ తెల్లవారి ఆ హోటల్ కెళ్ళి రెండు ఇడ్లీ ఒక బకెట్ సాంబార్ తో లాగిస్తే దాని మజా వేరు ! ఆ కాలం లో ఆంద్ర పత్రిక ఎర్రయ్య గారి అంగిట్లో - వారి అంగడి దినపత్రికలు- వార పత్రికలూ అలకరించిన ఓ "పత్రికా వనం" అన్నాతక్కువే- అరువుకి చదివి - ఈ హోటల్లో రెండు ఇడ్లీ ఓ బకెట్ సాంబార్ లాగించిన రోజులు - "సాంబార్" జ్ఞాపికలు! అప్పట్లో ముదిగొండ శివ ప్రసాద్ గారి చారిత్రాత్మక సీరియల్లు ఓ త్రిల్ చదవడం. పేపర్ లో సీరియల్ - డైలీ సీరియల్ ఓ రోజు చదవక పొతే అదోలా అయిపోయేది. ఇప్పుడూ తెలుగు పత్రికలూ ఆన్ లైన్ లో చదువు తాము అనుకోండి - అయినా తెల తెల వారి - ఆ పేపర్ వాసనతో - ఆంద్ర పత్రికా కాకుంటే ఆంద్ర ప్రభ చదవడం లాంటి జ్ఞాపకాలు- వాటి తో పాటు - పిచ్చా పాటి- ఇట్లాంటివి - ఈ కాలం లో కొద్ది తక్కు వే అనిపిస్తాయి. తెల తెలవారి హారం - కూడలి లో ముఖం పెట్టేసి బర్రుమని మౌస్ ని సాగాదీయ్యడం వేరే టెక్నిక్ !
ఆంద్ర పత్రికా ఇప్పట్లో లేదు. వాళ్ళ వారపత్రిక కూడా లేదు. కాని జ్ఞాపకాలు మాత్రం ఇంకా ప్రస్ఫుటం గా ఉన్నాయ్. ఈ విషయం గురించి ఆలోచిస్తే - జ్ఞాపకాలు అన్నవి మన మెదడులో ఓ లాంటి "చిప్" లా నిబడీ కృతమై కావాల్సినప్పుడు ఫ్లాష్ లా వచ్చేలా రావడం అన్నది మనిషి జీవితం లో ముఖ్య విషయం లా అనిపిస్తుంది. ఏమంటారు?
చీర్స్
జిలేబి.