Saturday, February 21, 2009

చిత్తూరోళ్ళ కథ-౩

ఈ మూడో ఎపిసోడ్ లో నాకు తెలిసిన చిత్తూరోళ్ళ తెలుగు గురిన్చి రాస్తాను. ఈ చిత్తూరు జిల్లాలో అదీను చిత్తూరులో తెలుగు భాష మీద మక్కువతో తెలుగు ని నేర్చుకుని తెలుగు లో రచనలు చెయ్యగల సత్తా ఉన్న తమిళులు ఉన్నారు. కాని పత్రికా ముఖముగా వీళ్ళు ప్రాముఖ్యులా అన్న విషయం నాకు తెలియదు.
రాయల సీమ రాళ్ళ సీమ లో భాషా ఉద్యమం అంటూ ఎప్పుడైనా జరిగిందా అన్న విషయం నాకు తెలియదు. కాని ప్రముఖులైన మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, మునిసుందరం, లాంటి ఆ కాలపు రచయితల్ని వదిలి పెడితే ఈ మన ప్రస్తుతపు జమానా లో చిత్తూరు నించి ఎవరయినా వ్రాస్తున్నారా లేక కథా వ్యాసంగం ఎవరైనా చేస్తున్నారా అంటే సందేహమే! దీనికి కారణం ఏమయి ఉండవచ్హన్నది నా చిన్ని బుర్రకి అందని విషయం!
ఈ విషయం గురించి ఎవరికైనా ఇంకా ఎక్కువైన సమాచారం తెలిసి ఉంటే కామెంటగలరు!

21-02-2009 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని శుభాకంక్షలతో

జిలేబి.

PS: ఈ పై టపా బరహ నోటేపాడ్ సహాయం తో రాసినది. బాగుందని ఆశిస్తాను. Its a really good unicode software. Thanks to: http://www.baraha.com

No comments:

Post a Comment