Thursday, March 4, 2010

శరత్ 'కాలమ్'

రవేగం స్వప్న రాగలీన స ' దృశ్యం '
సజ్ఞ రాగిణి - తస్మా
త్ ప్రియా సమాగమం - బ్లాగ్ 'విహారే'
కానవచ్చు ఆ నె
వంక అంద
మ్
శరత్ 'గాలం'
శరత్ 'కాలమ్'

చీర్స్
జిలేబి.

Wednesday, March 3, 2010

ఉడిపి హోటలు - ఉడాలు టపాలు

ఈ టపాలు రాయడానికి చాలా ఆలోచించి రాద్దామా వద్దా అన్న సందేహం లో పడి సరే రాద్దాం అన్న ఆలోచనతో రాస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుత చిత్తూరు పరిస్తితి ని చిత్రీ కరించదు. ఈ ఉడిపి హోటలు ఓ ముప్పై ఏళ్ళ క్రితం బ్రాహ్మణ వీధిలో ఓ ఇరవై ఏళ్ళ క్రితం జండా మాను వీధిలో ఆ పై బజారు వీధిలో ఉండేది. ఆ పై ఈ హోటలు మూత పడిందో లేదో నాకు తెలీదు. కాని ఈ ఉడిపి హోటల్లు సాంబారు - అదీ తెల్లవారి ఆ హోటల్ కెళ్ళి రెండు ఇడ్లీ ఒక బకెట్ సాంబార్ తో లాగిస్తే దాని మజా వేరు ! ఆ కాలం లో ఆంద్ర పత్రిక ఎర్రయ్య గారి అంగిట్లో - వారి అంగడి దినపత్రికలు- వార పత్రికలూ అలకరించిన ఓ "పత్రికా వనం" అన్నాతక్కువే- అరువుకి చదివి - ఈ హోటల్లో రెండు ఇడ్లీ ఓ బకెట్ సాంబార్ లాగించిన రోజులు - "సాంబార్" జ్ఞాపికలు! అప్పట్లో ముదిగొండ శివ ప్రసాద్ గారి చారిత్రాత్మక సీరియల్లు ఓ త్రిల్ చదవడం. పేపర్ లో సీరియల్ - డైలీ సీరియల్ ఓ రోజు చదవక పొతే అదోలా అయిపోయేది. ఇప్పుడూ తెలుగు పత్రికలూ ఆన్ లైన్ లో చదువు తాము అనుకోండి - అయినా తెల తెల వారి - ఆ పేపర్ వాసనతో - ఆంద్ర పత్రికా కాకుంటే ఆంద్ర ప్రభ చదవడం లాంటి జ్ఞాపకాలు- వాటి తో పాటు - పిచ్చా పాటి- ఇట్లాంటివి - ఈ కాలం లో కొద్ది తక్కు వే అనిపిస్తాయి. తెల తెలవారి హారం - కూడలి లో ముఖం పెట్టేసి బర్రుమని మౌస్ ని సాగాదీయ్యడం వేరే టెక్నిక్ !

ఆంద్ర పత్రికా ఇప్పట్లో లేదు. వాళ్ళ వారపత్రిక కూడా లేదు. కాని జ్ఞాపకాలు మాత్రం ఇంకా ప్రస్ఫుటం గా ఉన్నాయ్. ఈ విషయం గురించి ఆలోచిస్తే - జ్ఞాపకాలు అన్నవి మన మెదడులో ఓ లాంటి "చిప్" లా నిబడీ కృతమై కావాల్సినప్పుడు ఫ్లాష్ లా వచ్చేలా రావడం అన్నది మనిషి జీవితం లో ముఖ్య విషయం లా అనిపిస్తుంది. ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, March 2, 2010

అదిగో పులి- అల్లదిగో పులి వేచి చూస్తోంది

హైతి చిలి నడిరాత్రి ఉలికి పాటు
గోళం చలి మయం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

యూరోపు దేశాల ఊగిసలాట
అమెరికా ఆర్ధిక మాంద్యం
ఆసియా అటో ఇటో తేలని పరిస్తితి
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

ప్రపంచ దేశాల సంక్షోభం
భూమాత గగ్గోలం
త్సునామీల గందర గోళం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

జిలేబి

Saturday, February 27, 2010

అయస్కాంతం -

ఐశ్వర్యం తో వయసు
కనకం తో కాంతం
వెరసి అయస్కాంతం

మమత జుక్ జుక్ రైలు బండి
ప్రణబ్ ఫైనాన్స్
వెరసి 'బంగ్లా' ఖాతం!

సర్దార్జీ - ముఖర్జీ-బెనర్జీ
వెరసి "సోనార్" భారత్
మేరా భారత్ నేటి భాగోతం !

చీర్స్
జిలేబి.

Tuesday, February 16, 2010

జల పుష్పం

నిప్పు వేడి
గాలి వేగం

సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు

మేఘ గర్జన
ఋతువుల రాగం

అన్నీ నేనే అన్నది జల పుష్పం

ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !

(మంత్ర పుష్పం ఆధారం )

జిలేబి

Thursday, February 11, 2010

సౌగంధికా పరిణయం

ఈ మధ్య భీమాంజనేయ యుద్ధం చిత్రం చూడటం జరిగింది. ఈ చిత్రం లో కథ స్థూలం గా నలకూబరుని సౌదామిని పరిణయం - దాని పర్యవసానం గా భీమాన్జేయుల మద్ద్య యుద్ధం జరగటం లాంటి సంఘటనలతో కథ నడుస్తుంది. సౌగంధిక పుష్పం - కుబేరుని శివార్చన మొదలైన సన్నివేశాలతో సౌగంధిక పుష్పం తీసుకు రావలసిన సౌదామిని నల కుబేరుని ప్రేమలో పడి శివార్చానకి ఆలస్యం గా రావడం అందులోను పూజ అప్పుడు కుబేరుడు ఒక సౌగంధిక పుష్పం తగ్గడం గమనించడం, ఆ పుష్పం సౌదామిని శిరుస్సులో ఉండడం, సౌదామిని ని శపించడం, సౌదామిని భూలోకం లో రావడం లాంటి విచిత్ర సన్నివేశాలతో కథ రమ్యం గా జరుగుతుంది.
ఈ చిత్రం చూస్తున్నప్పుడు వచ్చిన సందేహం ఏమిటంటే - సౌగంధికా పరిణయం అన్న మరో కథ ఉందా? లేక ఈ సౌదామిని నలకుబెరుల కథనే సౌగంధికా పరిణయం అంటారా?
మీ కెవరికైనా తెలిసిన చెప్పగలరు

జిలేబి.

Wednesday, February 3, 2010

ఆలోచనా స్రవంతి

మనసులోని మర్మమెల్ల తెలిసిన వారెవరైనా ఉంటారంటారా? ఎట్లాంటి టైటిల్ బ్లాగ్ లో రాయాలో ఆలోచన లేకుండా మనసులోనించి వచ్చే ఆలోచనలకి అక్షరం రూపం ఇవ్వగలడం సాధ్యమా? అంటే వచ్చే ఆలోచనలని ఏవిధమైనటువంటి నిబంధనలకి కట్టుబాట్లకి తావివ్వకుండా అక్షర రూపం చెయ్యడం అన్నటువంటి సాధనా ప్రక్రియ ఉందంటారా
ఆలోచించి చూస్తే ప్రతి మనిషి అక్షర రూపమివ్వడానికి మునుపు తన ఆలోచనలకి ఓ సామాజిక పరమైన లేకుంటే సిద్దాంతిక పరమైన కట్టుబాట్లని పెట్టుకుంటా డేమో? ఎందుకంటే ఆలోచనలని యదా తధంగా ప్రచురిస్తే అది ఒక ద్రౌపది లాంటి రచన ఐతే దాన్ని విశ్లేషించడానికి లేక విమర్శించ డానికి ఎల్లప్పుడూ జనం ముందు ఉండ వచ్చు. కాకుంటే అది ఒక రామాయణ విష వృక్షం అవ్వచ్చు.

ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, February 2, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

బ్లాగ్ భాన్ధవులకి
నూతన సంవత్సర శుభాకాంక్షలతో

మీ
జిలేబి.

Monday, December 28, 2009

Sunday, December 27, 2009

లంగా రవిక కోక

తే నా లంగా అని తెలంగాణా లాగేసు కుంటే
కోక నాది అని కోన సీమ కోరితే
రవిక నాదని రాయలసీమ రాద్ధాంతం చేస్తే-
తెలుగు తల్లి నగ్న నాదం బిక్కు మొహం పెట్టి చూస్తోంటే-
సందులో సడేమియా అని మా తాత గారి సూదిలో దారం
"జ్యోతి" లా ప్రజ్వరిల్లుతూంటే-
ఆంద్ర దేశమా - ఇది కలికాలం సుమా!
నీ కేట్లాంటి కష్టాలు వచ్చేయి తెలుగు తల్లీ
ఓపిక పట్టు- కష్టాలు తొలగి పోయే రోజులు వస్తాయని

జిలేబి.

Saturday, December 19, 2009

మా పూరిల్లు మార్పులు చేర్పులు

అభివృద్ధి అన్నది ఎట్లా వస్తుంది? ఉన్నదానిని పడగొడితే దాని స్థానం లో పెద్ద భవంతి ని కట్టొచ్చు. ఉదాహరణకి మా ఇల్లు చాల పాత ఇల్లు. దీన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లతో ఇంకా ఓ నలభై లేక యాభై సంవత్సరాలు లాగించ వచ్చు. కాకపొతే ఖర్చులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి - సంవత్సరానికో మారు జై తెలంగాణా అన్నట్టు. కాకుంటే ప్రతి ఐదు సంవత్సరాలకో మారు ఎన్నికలన్నట్టు. దానికి విరుద్ధం గా మన్నికగా మా ఇల్లు గట్టి గా ఇంకో వంద సంవత్సరాలు నిలబడాలంటే ఇంటిని నేల మట్టం చేసి కొత్త గా కడితే (మేస్త్రి లు కరెక్ట్ గా కడితే- సున్నం సిమెంటు మన్నికవైతే లాంటి నిబంధనలకి లోబడి) సాధించవచ్చు.

కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న ప్రస్తుత పరిస్థితి మా పూర్ ఇల్లు లానే ఉంది. దీనికి సమాధానం కొత్త ఇల్లా లేక సర్దుబాట్లతో ఇంటిని రిపైర్ చెయ్యడమా లాంటిది.

జిలేబి ఇంత సింపుల్ కాదు ఈ విషయం అంటారా- మా ఇంట్లో అమ్మదే పై చేయి. ఆమె ఎట్లా చెబితే అలానే నడుచు కోవాలి. మా అయ్య కి బొక్కసం నింపడం ఎట్లా గో తెలుసు కాని ఇంటిని నిలబెట్టడం విషయం లో పరిజ్ఞానం తక్కువ. కాకుంటే మా అయ్య వీధి లోని రామయ్యలన్దరితోనూ కూర్చొని గంటల తరబడి హరిత సమస్యల గురించి, ప్రపంచదేశాల సమస్యల గురించి అనర్గళం గా సంభాషించ గలడు- అంత మాత్రమే మా అయ్య సత్తా.

చీర్స్
జిలేబి.

నగరం లో సర్కస్!

ఫ్లైట్ నుంచి దిగబడి హమ్మయ్య మా భారత భూమి పై కాలు మోపాను అని సంతోషం పడి పోవడం ప్రతి భారత ప్రవాసి కి ఓ పిచ్చి ఆనందం ! ఆ ఆనందం ఓ రెండు మూడు రోజులలో హుష్ కాకి ఐపోయి "మా దేశం లో ఇట్లా - ఇక్కడ ఇట్లాంటి కంపరిసన్ కి దిగి పోవడం సర్వ సాధారణం!

అట్లాంటి బడుగు మధ్యతరగతి భారత ప్రవాసి మహానగర సందర్శనార్థం బయలు దేరడమునను ఆ హా మా దేశం ఏమి ఉన్నతి చెందింది- "ఇండియా షైనింగ్ " అంటే ఇదే కామోసు అన్న అధ్బుతమైన ఆలోచనతో సరే ఈ ఊరి బస్సు కూడా ఎక్కి చూసేద్దాం అన్న ఆలోచనకి వచ్చి బస్సు ఎక్కడమున్ను ఆ పై బస్సులో ఒఊపిరి ఆడక ( ఆ పాటి ఓ రోజుకే అల ముహం వేలాడ దీసుకుంటే ఎలా మరి- ఇదే దేశం లో ఈ కార్యక్రమం రోజువారి జరుగుతోందే మరి?) ఎందుకొచ్చిన నగర సందర్శనం రా బాబు అనుకోవడమూ కద్దు!

కాని ఈ మారు గమనించిన దానిలో విశేషం బెట్టి దంటే- నగరం లో దుకానులు కలర్ ఫుల్ గా ఐయిపోయీయి! బస్సులు ట్రాఫ్ఫిక్ అట్లాగే మరీ ఎక్కువై పోయేయి. అంటే దరిమిలా దేశానికి ఎ ఇన్ఫ్రా స్త్రక్తుర్ అన్నది ఎట్లా వస్తుందో తెలియకుండా పోయింది.

బస్సులలో చెవులకి ఎఅర్ ఫోన్ లు ఉన్నాయి. చేతుల్లో ఐపాడ్ ఉన్నాయి. జనాల చేతుల్లో తినడానికి జుంక్ ఫుడ్ బోల్డంత ఉంది. కాని రోజువారి ప్రయాణం లో పదనిసలు ఎప్పుడు సరిగమలు పాదతాయో ?


ఇది ఎ ఒక్క మహానగర దుర్భాగ్యం మాత్రం కాదనుకుంటా? అన్ని మహా నగరాల పరిస్థితి ఇంచు మించు ఇట్లా గే ఉన్నది. జనత సౌకర్యం గా పయనం చెయ్యలేక ప్రైవేటు వాహనాలు రోడ్ల పై ఎక్కువై అవి ఇంటి వటుడింతై అన్నట్టు గా ఇటు రోడ్ ని అటు ఫుట్ పాత్ లని అధిగమిస్తూ సర్కస్ చేస్తూ పోతూంటే- ఓ భారత దేశమా - ప్రగతి కి నిర్వచనం ఎక్కడ ఉన్నది?

జన ప్రభంజనం లో మహా ప్రవాహ వాహినిలో కొట్టుకు పోతున్న దేశమా - కాస్త నిలిచి జనాలకి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలని అనుకుంటున్నావో ఓ మారు ఆలోచించు అని అనుకోకుండా మానుకోడు సామాన్య మానవుడు!

అయినా దేశం ఇట్లాంటి సమస్యల ప్రవాహాన్ని పట్టించుకోదు! పట్టించు కావలసినవి చాల ఉన్నాయి- ఉదాహరణకి రాష్ట్ర విభజన లాంటి నిఖార్సైన విషయాలు!

మీరేమంటారు? తెలుసు లెండి సామాన్య మానవులం మరి- ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటే- మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి చూసీ చూడకుండా వెళ్లి పోవడం మన ఆరోగ్యానికి క్షేమ కరం!

జిలేబి.

Friday, December 18, 2009

"వరదరాజ గుడి- భూమాత బడి "

చిత్తూరు నీవా నది తీర ప్రాంతంలో విరాజిల్లిన గుడి శ్రీ వరదరాజస్వామి గుడి. ఈ గుడి కి వెళ్ళడానికి నీవా నదిని దాటి వెళ్ళాలి. పూర్వ కాలం లో నది నీళ్ళతో నిండి ఉంటె నదిని దాటి ఈ గుడికి వెళ్ళడం ఒక పెద్ద విషయం. ఆ తరువాయి దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వస్తే చిత్తూరు నీవా నదికి నీళ్ళు పోయేయి. నీవా నది లో చిత్తూరు లో కాలుష్యం అన్ని నదుల్లా దీనికి పట్టింది. కాలుష్యం తో బాటు చిత్తూరు నాయుడు గారి "సురాపానం" (అదేనండి మదిరం- లికర్ అంటారు అట ఆంగ్లం లో ఐతే) కార్ఖానా "పుణ్యమా" అని నదిలో "సురాపానం" కాలువై ప్రవహించింది. ఆ కాలంలో దగ్గిరి వీధిలోని నీళ్ళు "మత్తు" గా గమ్మత్తు గా పసుపు కలర్ తో జనాలకి ఓ కిక్ ఇచ్చింది! నది బెడ్ చేరబడింది - ఆ మధ్యలో ఈ నాయుడు గారు సాయిబాబా గారి నీటి పధకానికి కొట్లిచ్చారని వినికిడి. పర్సనల్ కాలుష్య నివారణార్థం కామోసు అనుకున్నాను ! ఈ నది కాలువని - సురా కాలువ సువాసలని భరించలేక చాలామంది ఈ గుడి కి వెళ్ళడం మానుకున్నారు కూడా. ఆ పై ఆ గుడి దొంగల బడి అయ్యింది. అప్పుడప్పుడు మంచి ఎండలో ధైర్యం చేసి ఆ కాలపు కుర్రాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు ! ఆ తరువాయి ఎవరో పుణ్యమా అని మళ్ళీ గుడి లో దీపం కొన్ని రోజులు వెలిగింది.

ఇవన్ని ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే- ఈ పై కహానికి కోపెన్ హగెన్ సభలకి సామరస్యం ఉంది కాబట్టి. భూప్రపంచాల కాలుష్యం నివారించడానికి ౧౯౨ దేశాలు సమావేశమై తమకు తామే పాడుచేసుకున్న గుడిని మళ్ళీ నిలబెట్ట తామోచ్ అని వాక్రుచ్చి హాట్ తోపిక్ తో కిందా మీదా పడుతున్నాయి- మా నాయుడు గారు సాయిబాబా గారి నీటి పథకానికి డబ్బిచ్చినట్టు గా ( ఆ మాత్రమైన ఇచ్చాడు గా అన్నది మరో వాదన - అదీ ఇవ్వకుంటే ఏమయి ఉండేది చిత్తూరోల్ల నీటి కష్టాలు ?)

నదులకి నీళ్ళు లేవు. జనాలకి నదులే ఇల్లులు కట్టుకోదాని స్థలాలు అయి పోయేయి.
నదులలో నీళ్ళు లేవు. నది మట్టి ఇల్లులు కట్టుకోడానికి రాష్ట్రేతర రావాన అయి పోతోంది
నదీనాం సాగారో గచ్చతి అన్నది ఆ నాటి వాక్కు!
నదీనాం రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాకెట్ మనీ గాచ్చాసి అన్నది నేటి వాక్కు
నదీనాం న ప్రవహంతి - నదీనాం న జీవసి అన్నది రేపటి వాక్కు !

అంతా విష్ణు మాయ కలికాలం ప్రభావం ! మాయ తేరా దిగితే - మనిషి ఆకస హర్మ్యాల నుండి భూమ్మి మీద కి రావటం - ఓ త్సునామి క్షణం అంత సేపు !

జిలేబి.

Saturday, December 12, 2009

మొర మొరాలు బొరుగులు కూనలమ్మ పదాలు

చిత్తూరులో ఓ ముసల్మాను - పతాను బొరుగులు అమ్మే వాడు. "మొర మోరా" అన్నది అతని కేక !

మొదట్లో సైకిల్ లో వచ్చేవాడాయన - ఆ పై ఓ ఓల్డ్ టీవీఎస్ ఫిఫ్టీ లో వచ్చి బొరుగులు అమ్మేవాడు.
అతని కంఠం వీధి చివర్లో అరిస్తే ఆ వీధి మొనలో వినబడేది ! ఈ మానవుడి గురించి చిత్తూరబ్బాయీ ఒకతను సుమన్ కుమార్ అనే అతను, తన కథలో ఓ క్యారెక్టర్ గా కూడా చిత్రించిడం జరిగింది.

ఇప్పుడు ఈ మొర మొర ప్రసక్తి ఎందుకు అంటే -

ఈ రెండు రోజులలో ఆంద్ర రాజ్యం లో "మొర మొర" లు ఎక్కువై పోయేయి. అంటే బొరుగులన్న మాట . గాలి ఎటు వీస్తే బొరుగులు ఆ వైపు ఎగిరి పోతాయి. ఇప్పడు ఆంధ్ర దేశం లో ఏ బొరుగులు ఎక్కడ తేలతాయో కూడా తెలియడం లేదు.

ఈ "తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది" అన్న పాట ఎంతదాకా సరి అన్నది తెలియడం లేదు!

దేశ విభజన , రాజ్యాల విభజన రాష్ట్రాల విభజన - "విభజించు పాలించు" అన్న సూత్ర మునకు కట్టు బడి ఉన్నామా లేక ఇంకా భారతీయులు గా ఉన్నామా ?

అంతా చిదంబర చిద్వాలాసం అనుకోవాలా లేక ఇది మూక సైకాలజీ మీద "మాతా హరి" రాజకీయ నాటక రచనా పరిహాసమా?

అవురా నలుగురు నవ్వి పో దురు గాని నాకేటి సిగ్గు? కూనలమ్మ పదాలే రాజ్య భవితవ్యం!

రాష్ట్రమంతివర్గం చేవ లేకుండా సత్తా లేకుండా ఉంటే - రాజన్నవాడు నిఖార్సుగా ఉండక పొతే - ఆ దేశ రాజ్య పరిస్థితి నడి సముద్రం లో నావ!

దాని దిక్కు కి సూచికా లేదు- దాని మనుగడకి భరోసా నూ లేదు. !

అంతా విష్ణు మాయ కాకుంటే మరే మంటారు?

చీర్స్
జిలేబి.

Wednesday, November 25, 2009

ఇండియన్ స్టాక్ మార్కెట్

ఈ మధ్య ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా గొప్పగా నింగి వైపు దూసుకెడుతోంది! ఆ మధ్య క్రితం సంవత్సరం ప్రపంచ మార్కెట్లంతా ఇక ఉంటామా లేక ఊగిపోతామా అన్న స్థితి లో డిసెంబర్ నెలలో ఉండింది. ఒక్క సంవత్సరం తరువాయీ ఇప్పుడు నింగి వైపు జూమ్!! ఈ జూమ్ ఎంతదాకా కొనసాగొచ్చు? ఈ మధ్య జూలై 2010 లో మళ్ళీ సెన్సెక్స్ 21000 మార్క్ దాటుతుందని ఓ ప్రవచనం!

ఈ లాంటి స్థితిలో ఈ బ్లాగు రాయడం ఎందుకంటే , ఇది నిజంగా ఈలా నింగి వైపు రియల్ గా వెళ్తుందా అన్న ప్రశ్న ఉదయిచడం ! మీరేమంటారు?

చీర్స్
జిలేబి.

Saturday, November 21, 2009

ఇచ్ఛా మరణం vs ఆత్మహత్య

ఈ మధ్య ఈ ప్రశ్న ఉదయించింది. మహానుభావులు ఇచ్ఛా మరణం పొందుతారంటారు - ఉదాహరణకి కపాల మోక్షం ద్వారా ప్రాణాన్ని త్యజించడం లేక సజీవ సమాధి కావడం లాంటివి. జ్ఞాని ఐన మహానుభావులు ఈ లాంటి మరణం తో ఈ లోకాన్ని విడిచి పెట్టడానికి ఆత్మ హత్య కి సాదృశ్యం ఉన్నదా అన్నదే నా సందేహం. సామాన్య మానవుడు తాళలేని కష్టాలతో ఇక ఈ జీవితం తాను భరించడం లేడనుకుని ఆత్మ హత్య కి పాల్పడడం లేకుంటే ఆత్మ హత్యే సమస్యకి పరిష్కారం అన్న ఆలోచనతో జీవితాన్ని ముగించడం జరుగుతుంది. ఇదే మహానుభావులు శాస్త్రాలు "ఆత్మ హత్య మహా పాతకం" అంటారు! మరి నా కర్థం కాని విషయం ప్రాణాన్ని కపాలం ద్వారానో లేక సజీవ సమాధి ద్వారానో త్యజించడం ఆత్మ హత్య కాదా? తార్కికానికి అందని ఈ విషయం ! బ్లాగు రీడర్లు దీన్ని గురించి అభిప్రాయం తెలుప గలరు. ఇది పెద్ద మనుషుల ఫార్సు ఆలోచనలా ఉన్నది నాకైతే- అంటే పెద్దవాళ్ళు చేస్తే ఓ న్యాయం చిన్నవాళ్ళు చేస్తే మరో న్యాయం లాంటిది?

జిలేబి.

Wednesday, November 18, 2009

పంచేంద్రియాలకి ఆవల!

ప్రణవ్ మిస్త్రీ అన్న అబ్బాయి పంచేంద్రియాలకి ఆవల ఆరో ఇంద్రియాన్ని గురించిన ఈ పదిహేను నిముషాల టాక్ వీలు చేసుకుని చూడండి! అవకాశం కలిసివస్తే భారతీయులు ఎట్లాంటి ఇన్నో వేషన్ చేయగలరో అన్నదానికి ఇది నిదర్శనం

http://www.ted.com/talks/pranav_mistry_the_thrilling_potential_of_sixthsense_technology.html

చీర్స్
జిలేబి.

Wednesday, November 4, 2009

మదర్ మీరా - శ్రీమతి కమలా రెడ్డి ఒక పరిచయం


పుట్టినది చండేపల్లె నల్గొండ జిల్లా ఆంధ్ర దేశం
ప్రస్తుత నివాసం జర్మనీ దేశం
గృహస్తాశ్రమం !
పూర్వశ్రామం లో కమలా రెడ్డి గారు
ఇదీ చిన్ని పరిచయం వీరి గురించి.
ఛీర్స్
జిలేబి.

Sunday, November 1, 2009

శ్రీ ఏక్ హార్ట్ టొల్లె ఒక పరిచయం


శ్రీ ఏక్ హార్ట్ టొల్లె ఒక పరిచయం
పుట్టినది జర్మనీ దేశం
చదివినది లండన్ మహానగరం కేంబ్రిడ్జీ
నివాసం కెనడ దేశం లో!
ఒకానొక దినాన "అంతర్ముఖ పరివర్తన" ఆయన జీవితంలో మలుపు
అది ధ్రుఢమై అంతర్ముఖ ప్రయాణం
ఆపై పుస్తకాలతో "ప్రస్తుతాన్ని" గురించి వివరణలు!
ఇవీ ఆయన గమమించిన సత్యాలు ఆయన ఉపన్యాస దీటి కి సోపానాలు

ఛీర్స్
జిలేబి.

శ్రీ "మూజి" ఒక పరిచయం

శ్రీ మూజి
సత్సంగ్ విత్ మూజి !
అన్తోనీ పాల్ యంగ్
జమైకా దేశం పుట్టిన గడ్డ
ప్రస్తుతం నివాసం లండన్ మహా నగరం
పూర్వశ్రామం లో స్ట్రీట్ పైంటర్ , ఆర్టిస్ట్ , వృత్తి రీత్యా "అధ్యాపకుడు
తన నిరంతరాన్వేషణలో "పాపాజి" శిష్యరికం
రమణ మహర్షి వారసత్వ తాత్విక ఆలోచన దృక్పధం!
ప్రపంచ విస్తృత పర్యటనలలో "సత్సంగ్ విత్ మూజి" అన్న
టాపిక్ ఆయన "తాత్విక ఆలోచనలకి " వేదిక!

ఛీర్స్
జిలేబి.