Friday, January 9, 2009

సత్యం రాజు & శివాజీ ది బాస్ ఒకరేనా?

శివాజీ ది బాస్ చిత్ర రాజం లో నల్ల డబ్బుని శ్రీమాన్ రజని కాంత్ గారు డాలర్లు గా కాన్వేర్ట్ చేసి జూమ్మన్ని భారత దేశాన్ని మార్చే ప్రనాలికని ప్రతిపాదించారు. శ్రీ రామచంద్రుడు సత్య వాక్పరిపాలయనే జీవిత ధ్యేయమని తండ్రి దశరథుడు చూపించనా మార్గం లో అడవి కి వెళ్ళారు.

మన కలియుగం లో జామ్బూద్వీపం లో భారత వర్షం లో భారత ఖండంలో ఆంద్ర రాజ్యం లో రాముని పేరుగల రాజు గారు లేని డబ్బుని ఉన్నట్టు గా నిలబెట్టి యాభై వేలమంది యువతకి ఉద్యోగం కల్పించి అరవై ఐదు దేశాల్లో భారతకీర్తిని తెలుగు తేజాన్ని చాటించి విష్ణు మాయ చేసారు.

శ్రీమాన్ శివాజీ ది బాస్ గారి చిత్రరాజం వౌ అంటూ జూమ్మంటూ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది- చిత్రం లో శివాజీ గారు చెరసాల కి వెళితే దారిలో కోట్లాది జనం ఆయన కోసం నిరీక్షణ. శ్రీ రామచంద్రుడు సత్య వాక్పరిపలన కోసం అడవి కి వెళితే దేశం ప్రజానీకం కన్నీరు కార్చింది.

ఈ తెలుగు తేజం లేని డబ్బుతో ఒక కార్పొరేట్ సామ్రాజ్యాని ఇరవై సంవత్సరాలు గా నిలబెట్టిన వైనం దీని పర్యవసానం వేచి చూడ వలసినదే మరి.

జిలేబి.

1 comment: