Tuesday, September 17, 2013

గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ!

"రావణుని చేత అపహరింప బడి ఆతని ఇంట ఇన్ని రోజులు ఉన్న సీతా, నువ్వు నాకు తగిన దానవు కావు "

చెప్పినది రామభద్రుడు .

అంతటి తో ఊరుకున్నాడా ?

"నువ్వు నాకు తగిన దానవు కావు . లకష్మణుడి నో, భరత శత్రుఘ్నుల లో ఎవరినో, మరీ కాకుంటే, సుగ్రీవు ణ్నో విభీష ణు డి నో వేరే ఎవరైనా సరే నీ ఇష్టం ఎవరినైనా నీవు కోరి వారితో వెళ్ళు ' అంటాడు .

तदद्य व्याहृतं भद्रे मयैतत् कृतबुद्धिना |
लक्ष्मणे वाथ भरते कुरु बुद्धिं यथासुखम् || ६-११५-२२

शत्रुघ्ने वाथ सुग्रीवे राक्षसे वा विभीषणे |
निवेशय मनः सीते यथा वा सुखमात्मनः || ६-११५-२३


పతియే దైవమ్. అట్లాంటి పతి రామచంద్రుడు "జనవాద భయాందోళన చెందిన వాడై " , రెండు ముక్కలైన హృదయం తో అమ్మవారి తో ఈ మాట అంటే - ఇక సీతమ్మ గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ కాక మరి ఎట్లా ఉంటుంది ?

భీత హరిణేక్షిణి అని చాలా సాధారణం గా విని ఉంటాం .

సీతమ్మ గారి ని వాల్మీకి యుద్ధ కాండ లో - రావణ సంహారం తరువాయి గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ! అని పోలుస్తాడు. గజేంద్రుని హస్తం తో అభిహత మైన వల్లరీ అని .(ఒక ఏనుగు చేత లేత కొమ్మ పెకిలించి వేయ బడితే ఎట్లా ఉంటుందో కాకుంటే ఒక ఏనుగు తొండం తో దెబ్బ తిన్న ఒక తీగ కంపనం ఎట్లా ఉంటుందో మరి చెప్పాలా ?)

సందర్భం ఏమిటి ?

స్వామి వారు రావణ సంహారం తరువాయి అమ్మవారితో మాట్లాడే సమయం . అగ్ని పరీక్ష కి మునుపు సంభాషణ .

సింపుల్ గా 'నువ్వు వేరే ఎవరితో నైనా 'సెటిల్' అయిపో , నాకు తగిన దానివి కావు ' అని ఏ మగడైనా అంటే (ఇది చాలా పచ్చి గా ఉన్నదనుకుంటే ఎవరితో నైనా లేచి పో - అన్నాడను కొండీ ) ఇక ఆ స్త్రీ హృదయం ఎట్లా ఉంటుంది ?

వాల్మీకి ఒక ముక్క , జస్ట్ ఒక ముక్క - రాసి ఉండ వచ్చు - రాముల వారు సీతమ్మ తో - నువ్వు నాకు తగిన దానివి కావు' అని అన్నాడని  .

ఆ పై అట్లా పరుష మైన వాక్యాలు రామ భద్రుడు సీతమ్మ వారి తో అన్నట్టు రాసే డంటే - దీని వెనుక - ఆ కాలం లో జనవాదానికి, ప్రజల ఎద్దేవా కి ఎంత భయం ఉండేదో  అని పించక మానదు .

శ్రీ రాముల వారిని ఎవరైనా ఏదైనా అంటే అది మరీ వివాదాస్పద మయి పోతుంది . కాని రామాయణం - వాల్మీకి రామాయణం లో అయోధ్యా కాండం లో ఈ సర్గ శ్లోకాలు చదివితే మనం నిజంగా ఆలోచనలో పడక మానం మరి !

ततः प्रियार्हश्रवणा तदप्रियं |
प्रियादुपश्रुत्य चिरस्य मैथिली |
मुमोच बाष्पं सुभृशं प्रवेपिता |
                 गजेन्द्रहस्ताभिहतेव वल्लरी || ६-११५-२५


ఇప్పుడు కాలం మారింది . అయినా స్త్రీ ఇంకా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే  ! దేశం లో ఎన్ని చట్టాలు , కోర్టులు తీర్పులు చెప్పినా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే అని పించక మానదు



సీతాం ఉత్పల పత్రాక్షీమ్
నీలకుంచిత మూర్ధజాం !

జిలేబి 

20 comments:

  1. "శ్రీ రామ ఉవాచ
    దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢమ్ 6-115-17
    నేత్ర రోగమున్నవానికి దీపమును చూస్తే ఎంత ఎంత బాధ కలుగుతుందో నిన్ను చూచుటకు నాకంత బాధ కలుగుతున్నది. "

    దోషము నేత్రానిదా దీపానిదా, రాముడే స్వయంగా సీతమ్మను దీపంతోనూ తన భావనలను చూపును రోగముతో ఉన్న కన్నుగానూ పోల్చుకున్నాడు. తద్వారా రేపొద్దున్న అగ్నిశిఖ వంటి నిన్ను కంటి జబ్బు ఉన్నలోకం దృష్టిదోషం ఉన్న లోకమూ ఇలాగే అనుమానిస్తుంది అని చెప్పకనే చెప్పాడు, సీతమ్మని ఇక ఎవరూ ఏమీ అనకుండా తానే అనేసి నింద తనపై మోపుకున్నాడు, ఇప్పటికీ రాముడలా అన్నాడని బుగ్గలు నొక్కుకోవడం ద్వారా సీతమ్మ పాతివ్రత్యాన్ని పొగుడుకుంటున్నాం మనం. అదీ భర్త లక్షణం, అదీ సీతా మహాసాధ్వి వైభవం.

    ReplyDelete
    Replies
    1. అవునండీ. అందుకే వాల్నీకి రామాయణాన్ని 'సీతాయా శ్చరితం మహత్' అన్నారు!

      Delete
  2. సీత సంగతేమైనా నేటి ఇంతుల సంగతి కొంత స్వయంకృతం. ప్రజలను పట్టించుకునే ఇంతులూ లేరు, రామునిలాటి వ్యక్తులూ లేరు. సమాజమంతా ఎవరికివారే యమునా తీరే

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. శ్రీ రామునికి సీతాదేవి అంటే అయిష్టమే ఉంటే , ఎంతో కష్టపడి రావణాసురునితో యుద్ధం ఎందుకు చేస్తారు ? సీతాదేవి విషయం మర్చిపోయి ఇంకొక ఆమెను వివాహం చేసుకునేవారే కదా !

    అలా చేయకపోగా అశ్వమేధయాగ సమయంలో సీతాదేవి బంగారు ప్రతిమను ప్రక్కను ఉంచుకుని యాగాన్ని నిర్వహించటం ద్వారా సీతాదేవే తన భార్య అని లోకానికి ధృఢంగా తెలియజేశారు.

    సీతా వియోగం తరువాత కూడా తిరిగి వివాహం చేసుకోకుండా శేషజీవితాన్ని గడిపారు.
    .....................................

    శ్రీ దేవీ భాగవతములో నారాయణ మహర్షి నారదునికి తెలియజేసిన అనేక విషయములు ఉన్నాయి. ఈ విషయములను వ్యాసమహర్షి జనమేజయునికి తెలియజేయగా, సూతమహర్షి శౌనకాది మునులకు తెలియజేస్తారు.

    నారాయణమహర్షి నారదునికి తెలియజేసిన విషయములలో లక్ష్మీదేవి అంశయైన వేదవతి సీతాదేవిగా జన్మించటం గురించి , సీతాదేవిని రావణుడు అపహరించటానికి కొద్ది సేపటి ముందు అగ్నిదేవుడు శ్రీ రాముని వద్దకు వచ్చి , సీతాపహరణ సమయం ఆసన్నమైనదని తెలియజేసి , మాయాసీతను సృష్టించి, రాముని వద్ద ఉంచి అసలు సీతను తన సంరక్షణలో ఉంచటం గురించి, అగ్నిప్రవేశం తరువాత అసలు సీతను రామునికి అప్పగించగా , చాయాసీత తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయిందని , ఆ తరువాత జరిగిన విషయాలను కూడా నారాయణమహర్షి నారదునికి తెలియజేయటం జరిగింది.
    ( చాయాసీత విషయాన్ని రాముడు లక్ష్మణుడికి కూడా తెలియజేయలేదట.)

    చాయాసీత గురించిన విషయాలు వాల్మీకి రామాయణంలో లేవంటున్నారు. అందుకు అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. ఇలా జరగటంలోని అంతరార్ధం మనకు తెలియదు.

    నారాయణమహర్షి, నారదుడు, వ్యాసుడు, సూతుడు, శౌనకాది మునులు సామాన్యులు కాదుకదా ! వీళ్ళందరూ చెప్పుకున్న చాయాసీత గురించిన విషయాలను ఇప్పటివారు కొందరు ఎందుకు నమ్మటం లేదో ? అర్ధం కావటం లేదు.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది. అదేమిటంటే,

      చాయాసీతను రామునికి అప్పగించి అగ్నిదేవుడు అటువెళ్ళాడో లేదో బంగారు లేడి కనిపించింది. దాన్ని పట్టితెమ్మని సీతాదేవి రాముణ్ణి కోరింది. లక్ష్మణుడిని సీతకు కాపలా ఉంచి రాముడు బయలుదేరాడు.

      ( తరువాత జరిగిన విషయాలు మనకు తెలిసినవే ).

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. సీతాపహరణం తరువాత భార్య కోసం రాముడు రోదించిన విషయం వాస్తవమే. భార్యాభర్తలకు ఎడబాటు జరిగినందుకు రాముల వారు బాధపడటంలో తప్పులేదు కదా!

      ఇక , అగ్నిప్రవేశం సమయంలో సీతాదేవితో పరుషంగా మాట్లాడటం అంటే , మాట్లాడి ఉండవచ్చు.

      లోకరీతి గురించి , కొందరు ప్రజల ఆలోచనా విధానం గురించి బాగా తెలిసిన రాములవారు సీతాదేవికి అగ్నిపరీక్ష పెట్టడం జరిగింది.
      ( అదే సమయంలో అసలు సీతను అగ్నిదేవుడు రాముల వారికి అప్పగించటం కూడా జరిగింది. )

      కొందరు బలహీన వ్యక్తిత్వం ఉన్న సామాన్య స్త్రీలు ఏం చేస్తారంటే, భర్త తనను అశ్రద్ధ చేశాడని, పరుషంగా మాట్లాడాడని , భర్తను విడిచి వేరే వ్యక్తులను వివాహం చేసుకునే స్త్రీలు కూడా లోకంలో ఉంటారు.
      ( అంతకుముందు తనకోసం ఆ భర్త ఎన్ని కష్టాలు పడినా అవన్నీ మర్చిపోతారు.)

      అగ్నిపరీక్ష ద్వారా సీతాదేవి యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి తెలియ జేయటం కోసం , సీతాదేవి బలహీన వ్యక్తిత్వం ఉన్న సామాన్య స్త్రీ కాదని , సీతాదేవి మహా పతివ్రత ...అనే వాస్తవాలను లోకానికి తెలియజేయటం కోసం రాముల వారు అలా మాట్లాడి ఉండవచ్చు.

      ఇంకా ఎన్నో కారణాల వల్ల సీతాదేవి అగ్నిప్రవేశం సమయంలో రాముడు అలా మాట్లాడి ఉండవచ్చు.

      అగ్నిపరీక్ష సమయంలో రాముడు పరుషంగా మాట్లాడినా , సీతాదేవి యొక్క ఔన్నత్యాన్ని లోకానికి తెలియజేయటం కోసమే తప్ప దురుద్దేశంతో కాదు.

      nagendra ayyagari గారు వ్రాసినట్లు సీతమ్మని ఇక ఎవరూ ఏమీ అనకుండా తానే అనేసి నింద తనపై మోపుకున్నాడు.
      ...............................
      దేవతలు కూడా పాత్రధారులై నడిపించిన పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా ... ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

      Delete
  7. అద్వైతం సుఖదుఃఖయోః అని భవభూతి ఊరికే అన్నాడా మరి

    ReplyDelete
  8. చిత్రంగా నేను వనజ వనమాలి గారి బ్లాగులో దీన్ని శర్మ గారు వేసిన ఇలాంటి నిందకే జవాబు చెప్పాను.

    http://vanajavanamali.blogspot.in/2013/09/blog-post_12.html

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. మిత్రులు హరీస్ బాబు గారికి ,

      మీరు వనజ వనమాలి గారి " నూనెకుండ " టపాలోనా కమెంటు మీద కమెంట్ చేశానని మీతు ఈ టపాలో వ్రాశారు . వాస్తవంగా నేనింతవరకు మీ కమెంట్ చూడలేదు . ఇపుడే యిక్కడ మీ కమెంట్ చూసిన తర్వాత దానికి బదులు యివ్వవలసిన అత్యవసరం ఏర్పడింది .

      ఇప్పుడు వరూధిని గారి టపాలో కూడా ఈ దిగువ వాక్యాలను పరిశీలించండి .

      "రావణుని చేత అపహరింప బడి ఆతని ఇంట ఇన్ని రోజులు ఉన్న సీతా, నువ్వు నాకు తగిన దానవు కావు "

      చెప్పినది రామభద్రుడు .

      అంతటి తో ఊరుకున్నాడా ?

      "నువ్వు నాకు తగిన దానవు కావు . లకష్మణుడి నో, భరత శత్రుఘ్నుల లో ఎవరినో, మరీ కాకుంటే, సుగ్రీవు ణ్నో విభీష ణు డి నో వేరే ఎవరైనా సరే నీ ఇష్టం ఎవరినైనా నీవు కోరి వారితో వెళ్ళు ' అంటాడు .

      ఇలా ఈనాటి సమాజంలో ఎక్కడో కొంతమంది మాట్లాడుతూ వుండటం అప్పుడప్పుడు చూస్తుంటాం . మఱి ఈ రాముడు మామూలు రాముడు కాదు , తోటరాముడు కాదు , దొంగ రాముడు కాదు , ట్యాక్సీ రాముడు కాదు , డ్రైవర్ రాముడు కాదు , బండ రాముడు కాదు , సాక్షాత్తూ దైవ స్వరూపుడైన శ్రీరామ చంద్రమూర్తి అంటారు . దైవాంశ సంభూతుడైన వ్యక్తులు మానవలోకంలో లోక కళ్యాణార్ధమై పుట్టి యిలా , సామాన్య మానవుల కంటె నీచంగా ప్రవర్తిస్తారా ? కొంచెం ఆలోచించండి .

      Delete
    3. భార్య దూరం అయినందుకు రాముడు ఎంతో విలపించారు. శ్రమపడి రావణుని వధించారు. సీతా వియోగం తరువాత కూడా మళ్ళీ వివాహం చేసుకోకుండా శేషజీవితాన్ని గడిపారు.

      అవన్నీ వదిలేసి కేవలం అగ్నిపరీక్ష సమయంలో పలికిన కొన్ని మాటలను ( అప్పుడు కూడా సీతాదేవి ఔన్నత్యాన్ని లోకానికి తెలియజేయటం కోసం రాముడు పలికిన మాటలవి. ) పట్టుకుని రాముని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించండి .

      Delete
  9. ఈ ప్రపంచంలో ప్రారంభం నుంచి కొంతమంది మేధావులు భయంతో కూడిన భక్తిని తోటి మానవులకు నేర్పించారు . అందుకే దేవుణ్ణి మనం దూషిస్తే మన కళ్ళు పోతాయనో , కష్టాల పాల్జేస్తాడనో , నష్టాలు వాటిల్లుతాయనో భయపడి పూజలు చేసే దరిద్రపు సంస్కృతి మనది .
    అసలు దేవుడు అంటే ఎవరు ? దేవత ఎవర్ ? దేవుళ్ళకు లింగభేదం వుంటుందా ? వాళ్ళు సామాన్య మానవులలా సంసారాలు చేస్తారా ? వాళ్ళకు పిల్లలు పుడ్తారా ? వాళ్ళకు సామాన్య మానవులలా భవ బంధాలు వుంటాయా ?
    ఆనాటి కొంతమంది మేధావులచే సృష్టించబడ్డ ఆ దేవుళ్ళ బుధ్ధులు సామాన్య మానవులలాగే వాళ్ళ జీవన స్పందనలు వుంటాయన్నది నగ్న సత్యం .
    నేను సర్వసద్గుణ శక్తిని నమ్ముతాను . శక్తికి లింగభేదం వుండదు . శక్తి కంటికి కనపడనిది , కాని వ్యక్తమవుతుంది . ఆ సర్వసద్గుణ సక్తిని ప్రతి ప్రాణి ఆవాహన ( అంటే ఆహ్వానించటం ) చేయాలి . అప్పుడే మనం మంచి వాళ్ళుగా జీవనం గడపగలం .
    ఈ ప్రపంచంలో ఏవైతే ఈ మానవ జీవన మనుగడకు అత్యవసరమో , అవన్నీ అతీతమైన శక్తి కలవి . ఆ శక్తుల్ని ఎదుర్కొనే సామర్ధ్యం ఈ మానవులకు లేదు . అందుకనే ఆ అతీతమైన , శక్తివంతమైన వాటిని ( ఫృద్వ్యాపస్తేజోవాయురాకాశాత్ ) ఆ నాటి మేధావిత మానవులు " పంచ భూతాలుగా " నామకరణం చేశారు . వాస్తవంగా అవి దైవ స్వరూపమైతే భూతాలుగా ఎందుకు పిలువబడ్తాయి ?
    ఆనాటి మేధవిత వర్గం ప్రప్రధమంగా గుర్తించబడిన భాష సంస్కృతంగా పరిగణించి ప్రతి విషయాన్ని ఆ సంస్కృతంలో లిఖించి , వాటిని మంత్రాలుగా వాళ్ళ గుప్పెటలో వుంచుకొని , అసలు భావాన్ని సమాజానికి వెల్లడి కాకుండ కట్టుదిట్టం చేశారు వాళ్ళ స్వార్ధపూరిత ఆలోచనలతో .
    ఈ ప్రపంచంలో దేనికైనా " భావం " ప్రధానం కాని , భాష కాదు అన్నది మనం జ్ఞప్తికి తెచ్చుకోవటం చాలా అత్యవసరం .
    దానిని కూడా ఆ సంస్కృతంలోనే " యద్భావం తద్భవతు " అని నుడివారు .
    అసలు ఎవడు దేవుడు అంటే సర్వసద్గుణ శక్తి కలిగి అందఱి యెడల సమ భావంతో దర్శించేవాడు . అంతే గాని పూజ చేయకపోతే మనల్ని కష్టాలపాల్జేసేవాడు కాదు . అందుకనే ఆ మేధావిత వర్గమే అసలు ఈ విషయాన్ని చెప్పీ చెప్పనట్లు " మానవుడే మాధవుడు " అన్నారు .
    నేను సర్వసద్గుణ శక్తిని నమ్ముతాను . విగ్రహారాధనకు వ్యతిరేకిని . ఆ కాలంలో చెప్పిన వాటిలోని అంతరార్ధాన్ని , మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలో సక్రమంగా అన్వయించుకోవాలి . మనం మీరనుకుంటున్న ఆ దేవుణ్ణీ పూజించకపోతే , మనకు నష్టం కల్గిస్తాడనుకొంటే వాడు దేవుడు కాదు , మన పైన వున్న మానవాధికారో / మనల్ని పరిపాలించే ప్రజానాయకుడో అయి వుండాలి . అటువంటి మానవులకే ఈ దరిద్రపు బుధ్ధులు వుంటాయి .
    ఒక యుగం అంటే ఎన్నో లక్షల సంవత్సరాల కలం గడుస్తుంది , ఇంకా పైనే వుండవచ్చేమో కూడా . అటువంటి 3 యుగాలు అంటే కృతయుగం 25 శాతమైతే , త్రేతాయుగం 50 శాతమైతే , ద్వాపరయుగం 75 శాతం కాగా , కలియుగం 100 శాతంగా చెప్తూ వస్తున్నాయి . ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ మానవులలో ఇంజెక్ట్ చేయబడిన ఆ సర్వసద్గుణ శక్తి , దేవుళ్ళుగా , వేదాలుగా ,నరనరాల్లో జీర్ణించుకుపోయి వున్నది . ఈ రోజు మారమన్నా మారలేకపోవచ్చు . మిమ్మల్ని మారమని నేను అనను . కాని నిజాన్ని గ్రహించండి .
    ఇది చిన్న సబ్జెక్ట్ గాదు , దీన్ని గురించి యిలా చెప్పుకుపోతే చాలా వున్నది .
    మన పూర్వీకులు దేవుళ్ళ రూపంలో ప్రచారంలోకి తెచ్చినవాటన్నింటికి సైన్స్ మూలకారణం . డైరెక్టుగా సైన్స్ చెప్తే ఎవరూ లక్ష్యపెట్టరని కాబోలు , ఈ భయాన్ని కల్గించి సమాజం మీదకి వదిలారు .
    నాకు మీమీద గాని , మీరు నమ్మే దేవుళ్ళ మీద గాని కోపం లేదు . అవాస్తవాల్ని వాస్తవాలుగా మనము కూడా వాటిని ప్రోత్సహించటం బాగాలేదు అని మాత్రం చెప్పదల్చుకున్నాను . వాస్తవాల్ని గ్రహించి మసులుకొంటే హాయిగా ఆనందంగా జీవించవచ్చు అని అభిప్రాయపడ్తున్నాను .

    ReplyDelete
    Replies
    1. దీని వెనుక గొప్ప మనో వైజ్ఞానిక శాస్త్రం ఉంది . ప్రజలకు ఏది ఎలా చెప్పడం ద్వారా ప్రజలు పాటిస్తారో అలాంటి పద్ధతుల ద్వారా చెప్పడం జరిగింది . ఉదాహరణకి పిల్లలకు నీతి ని ప్రత్యక్షంగా చెప్తే బోధపడదు కాబట్టి పిల్లల మనస్తత్వానుసారం కథ రూపంలో చెప్తాము . కథ అంతా అబద్దం నీతి వాక్యం ఒక్కటి చెప్పండి చాలు అంటే సరిపోతుందా ? నీతి వరకు చెప్పి ఆచరించ మంటే ఎంతమంది ఆచరిస్తారు. మీరు హెల్మెట్ పెట్టుకొని, లేదా సీట్ బెల్ట్ పెట్టుకొనే డ్రైవింగ్ చేస్తారా ?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
  10. వేదాలని పూర్తిగా తెలుసుకోనివాడు వ్యాఖ్యానించ ప్రయత్నిస్తే వేదమాత కౄరమైన వేట కుక్కలు చుట్టుముట్టిన పిల్ల జింకలా భీతితో తల్లడిల్లుతుంది, అలాగే వేదోపబృంహణమైన శ్రీ రామాయణమూ అంతే. పూర్తి వివరం తెలీకుండా శ్రీరామాయణాది గ్రంథాలు చదవకుండా అవగతం చేసుకోకుండా వ్యాఖ్యానాలు పరిశీలించకుండా వాటికీ, అందులోనీ పాత్రలైన శ్రీసీతా రామాదులకే కాదు ఇలా అన్ని పురాణేతిహాసాలలోని వ్యక్తులకు ఉచ్ఛనీచాలు అంటగట్టి వాస్తవమేదో అవాస్తవమేదో జడ్జ్ చేసే గొప్ప స్థితిలోకి మనం చేరాం!? చాలా గొప్ప విషయాన్ని సాధించాం!?

    జిలేబీ గారు ప్రస్తావించిన ఈ విషయం పై శ్రీ రాముని వేదన సీతమ్మ ఆవేదన ఆతరవాత ఇద్దరూ స్వాంతన పొందడం వంటి విషయాలు 4 సర్గలలో వివరించబడింది. సీతమ్మతో పరుష వాక్యాలు మాట్లాడినప్పుడు శ్రీ రాముని హావ భావాలు కూడా వర్ణించబడ్డాయి. కాలిపోతున్నాడా అన్నంతగా బాధతో కోపాన్ని పొంది అపర యమరుద్రాదులలాగా అంత బాధావేశంతో ఉన్న రామునితో మాట్లాడడానికి ఏ ఒక్క మిత్రునికీ ఆఖరికి అత్యంత కోపావేశాన్ని పొందిన లక్ష్మణునికీ కదిలించి మాట్లాడ శక్యంకాలేదు. కొత్తగా మనమేమీ వకాల్తా పుచ్చుకొని తప్పొప్పులెంచక్కర్లేదు. నాబోటిగాడికున్న శుష్క పాండిత్యాన్ని బయటపెట్టక్కరలేదు.

    శ్రీ రామాయణాన్ని యథాతథంగా ఒక ధర్మాత్ముడైన నరుని కథగా చదివి తెలుసుకుంటే చాలు. ఒక నరుడెలా వ్యవహరిస్తాడో శ్రీరాముడలానే వ్యవహరించాడు, ఒక నరుడెలా బాధపడ్డాడో అలానే బాధపడ్డాడు. ఇప్పుడు డొల్లగా మాట్లాడే స్త్రీ స్వాతంత్ర్యం గురించి అప్పుడే చేతల్లో చూపించాడు రాముడు. ఇప్పుడు ఇలా అడిగిన నోళ్ళే ఒకవేళ రాముడు నీ ఇష్టం ఎక్కడికంటే అక్కడికెళ్ళవచ్చు అని అనకపోయుంటే రావణుడు సీతమ్మనెత్తుకొచ్చాడు రావణున్ని చంపి సీతమ్మను రాముడు తీస్కెళ్ళాడు, తాను స్వయంగా సీతమ్మను కలిసి ఏడాది దాటింది ఆమె మనసు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, ఒకడెత్తుకెళ్ళాడు ఇంకోరు గెలుచుకొచ్చారు అని ఈ నరంలేని నాలుకతో అనరంటారా? మనకున్న ఆవేశకావేశాదులు అనుమానాలు అప్పుడు అక్కడున్న హనుమ లక్ష్మణాదులకి ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. నేను వదరక్కర్లేదు నేను రామాయణం చదివితే, అందులోని భావం గ్రహించగలిగితే కనీసం ఒక్కరోజు నా జీవితంలో సీతారామాదులలా ఆదర్శంగా బ్రతికే ప్రయత్నం చేసినా చాలు.

    స్వస్తి

    ReplyDelete
  11. My God,
    Sarma sir,can I ask you a personal question? What is your educational qualification?Do you have any science related degrees like M.Sc Zooloagy/physics or others. Please don't think about asking such personal question as an arrogant gesture. You are thinking too much about science and As a science student i knew the limitations and ideosyncracies of it's theories very closely.
    most of the scientific theories are failing to give a right conclusion about the phenomena, which actually has to prove. for every scientific theory exceptions list is very long to the conditions it is successfully applicable. most of the inventions are invented not by a sequential scientfic procedure. They were comonga either as a flash of thought in the mind of their inventors and all of them were ignorant of that IDEA, even before a second of that revelation. Some times a 'U' turn of a theory also happened before coming to the final conclusion. Means a scientist is thinking ina process and what finally he got is complete role reversal of his earlier thought.
    Do you know how radioactivity exposed? That was the only dominent example. if you go through the other invetntions, you can find same story is repeating.

    ReplyDelete