సాదా సీదా గా చెప్పాలంటే రాముల వారిని పుంసాం మోహన రూపాయ అని జెప్పి మానవ మాత్రుల లో ఉండే అన్ని గుణ గణా లను వారి లో చూడ గలిగాడు కవి .
మానవు లకి ఔరా ఒక మనిషి మనీషి గా నిలబడటానికి కాల వ్యవధి లో ఎన్నేసి కష్టాలు నష్టాలు చూడ వలసి వస్తుంది అనిపించక మానదు .
మరి సీతమ్మ ? పుట్టని అమ్మ అని ఈ మధ్య ఒకరన్నారు . భూదేవి ఒడి లో నాగలి కి తగిలిన నారి . జనకాత్మజ . జానకి .
రాముల వారి తో సరి సమానంగా కష్టాలను స్వీకరించింది . నువ్వు వనవాసం చేసి రావోయ్ అని ఈ కాలం లో జిలేబిలు చెప్పగలరు .
తమ్ముడు - లక్ష్మణుడు - వాడిని ఎవరూ అడగలేదు వెళ్ళ వోయ్ వనవాసానికి అని. తనకు తానై అన్నకు తోడుగా వెళ్ళాడు .
వీటన్నిటి కి మించి ఊర్మిళ . హిందీ సాహిత్యం లో ఊర్మిళా కీ విరహ్ అనిమైథిలి శరణ్ గుప్త వారి దను కుంటా ఒక ఖండిక ఉంది . ఊర్మిళ తరపున రాసిన కవివరుల్లో వారే మొదటి వారను కుంటా . సాకేత్ అన్నది పుస్తకం పేరు .
భారతీయ భాషల్లో నే కాకుండా ప్రపంచ భాషల్లో కూడా అద్బుతం గా అనువదింప బడి , కల్పవృక్షం గా పేర్కొనబడి , విష వృక్షం గా చెప్పబడి పరి పరి కోణాల నించీ విశ్లేషించ బడినది రాముల వారి చరిత్ర .
అంతే కాదు ; మనకు దగ్గిర గా తెలిసిన కాల ఘట్టం లో త్యాగయ్య వారి చేత కొనియాడ బడి , వారి కి రాముల వారి కన్న వేరెవ్వరు లేరు అని రామాయణం మొత్తం వారి సంగీతం లో ఇమిడి మనకు ఈ నాటికీ పాటల రూపం తో ఆవిష్కరించ బడి ఉన్నది .
రాబోవు కాలం లో మరిన్ని విశ్లేషణలు పరి పరి విధాల పరిశోధనలు వాటి మీద రావచ్చు గాక.
ఎంత వచ్చినా ఏమి వ్రాసినా కాలం లో ఇమిడి పోయి వాటిని స్వకీయం చేసుకునే భారత సంస్క్రతి కళ కళ లాడు తున్న సంస్కృతీ .సజీవ సంస్కృతీ .అందులో ఇది అది అని లేకుండా అన్నీ కలిసి మహా సాగరమై మహోన్నతం గా వెలుగొందటం తధ్యం.
బలపం బట్టి భామ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకున్నా అని మావయ్య పాట వ్రాసి పోయేడు ! కామ్రేడ్ "సిరివెన్నల" (అదేనండీ సిరి వెన్నెల వారు ) వారు సొగసుగా రాసేసు కున్నారు !
దాన్ని మా బాలూ కూడా యమహా నగరి లా పాడి రంజింప చేసాడు !
కవి వరుల చేతి లో పదాలు పాదాలు పదనిసల తో పట్టు పరికిణీలు వేసుకుని పరి పరి మనలను పరిమళింప జేస్తాయి !
వారి పద పొందులు వాటి అందాలు వారికేలా వస్తుందబ్బా అని హాశ్చర్య పోవడం మాత్రమె జిలేబి వంతు !
ఈ మధ్య ప్రజ వారు తెలుగు వ్రాత లో ఇన్నేసి అక్షరాలూ ఉండాలా అని ప్రశ్నించేరు !
అక్షరాలూ ఎన్నేసి ఉన్న నేమి ? వాటిని ఎట్లా ఉపయోగిస్తున్నామో అన్నదాన్ని బట్టి అవి వాడుకలో ఉంటాయా లేవా అన్నది రూడి ( ఇక్కడే ఒక ఒత్తు పోయే! )
ఈ మధ్య ఆంగ్లం లో LOL అని రాయ బోయి లోల అని వ్రాసేనన్నారు బండి రావు గారు . ఆహా కొత్త పదం కని పెట్టేరు అని మరొక మా 'సార్' తిరగేస్తే శర్మ గారు వారి కి తాడులు వేసేరు !
బండి ర ఎట్లా వ్రాయాలో తెలీటం లేదు :)
ఆ మధ్య ఒక కార్టూన్ చూసా రిక్షా బండి వాడి ని రావయ్యో అనడానికి కార్టూనిస్టు ఒక్క పదం లో అంటే బండి ర తో కార్టూన్ వ్రాసేసేరు ! అదీ కవి పదపు పదును !
శ్రీపాద వారు శ్రీ రాముల వారిని అంటే వనవాస కాలపు శ్రీ రాముల వారిని విప్రలంభపు శృంగార యోగి అని వర్ణించేరు ! పదముల పొందిక అది !
"మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"
గోదావరి వాళ్లకు ఆ తెలుగు అట్లా ఎట్లా వస్తుందేమో తెలీదు గాని, కష్టే ఫలే వారి టపాల్లో రెండు వాక్యాల్లో ఒక వాక్యం నానుడి తో ఉంటుంది !
శ్యామలీయం వారి టపాల్లో పద్యాల పై నున్న వెరైటీ , వారు రాముల వారి పై రాశి పోసిన పద్యాలు , (అంతే కాదు సై అంటే సై అని జిలేబి కామెంట్లు పోటీ గా వ్రాసిన జిలేబి శతకం కూడాన్ను ) - తెలుగు బ్లాగు వెలుగులు ఇంతింత కాదయా అని చెప్పుకొనక తప్పదు !
మా అరవ దేశం లో క్రేజీ మోహన్ అని ఒక రచయిత ఉన్నారు . వారి చేతిలో పదాల విరుపు ఇంతా అంతా అని చెప్పలేము ! పదాలు నాజూగ్గా విడి పోయి హాస్యాన్ని పండిస్తాయి !
బ్లాగులోకం లో నిరవధికం గా సంవత్సరాల తరబడి సమస్యాపూరణం నడుపుతున్న కంది వారు వారి టీము ఒక ఎత్తైతే ( మేమంతా హరిబాబు వారి లా పేజీ ల కొద్ది టపాలు వ్రాస్తాం - ఒక్క కామెంటూ పడదు - కంది వారేమో ఒకే ఒక్క వాక్యం వ్రాస్తారు టప టప మని ఓ నలభై కామెంట్లు ఒట్టి కామెంటులు కావు మేటరు ఉన్న మేలైన నేటి కి ఏ నాటికీ నాలుగు కాలాల పాటు నిలిచి పోయే పదాలు పద్యాలు పడతాయి ! అబ్బ మరీ ఈ జిలేబి కి కా 'మంటలు' అంటే అంత 'ఇది' యేమో తెలీదు గాని :)) - మరో ఎత్తు నెమలి కన్ను మురళి గారు - దేశం ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని అందర్నీ కలగలిపి గోదారి లాక్కెళ్ళి పోతారు :) జేకే !
సంస్కృత మకరందాలు -
బ్లాగాడిస్తా వారి చమక్కులు -
పద్మార్పిత వారి పడుచుపదాలు-
ఆంధ్రామృతం వారి అద్బుత 'అరంగేట్ర' సమాచారాలు-
ఈ టైటిల్ చదివితే ఈ టపా మనవు గారిదే నబ్బా అని కళ్ళు మూసుకుని చెప్పెలాంటి టైటిల్ పెట్ట గలిగిన మనవు గారు -
సుజన సృజన లతో పదనిసల్ని మోహనం గా ఆలాపించే లక్కాకుల వారు-
బ్లాగు బర్త డే కి టపాలు రాసే స్టేజీ కి వచ్చేసిన ఒకప్పటి ఇల్లు అలకటం మరిచి పోయిన ఈగాజ్యోతీలు - అప్పుడప్పుడు శర్కర పంచె శర్కరీలు -
కౌముది కి అంకిత మై పోయిన బ్లాగిణి మణులు (మధుర వాణీ గారు వింటున్నారా ?) -
పనిలేక పిపీలిక మైన మా డాటేరు బాబు రమణ గారు -
తేటగీతి అంటూ తేటతెల్లంగా 'అటుకుల' బొంత ని స్వాహా గావిస్తున్నవారు :) -
పాటతో నేను అని సైలెంట్ గా సినీ పాటల ఒక ఖజానాని పెట్టి వాటికి లిరిక్స్ జోడించి జోహార్ అని పించే లా ఉన్న వేణూ శ్రీకాంత్ గారు -
అమృత మధనం తో దేశాన్ని మధిస్తూ బుద్ధునికి మురళి కి సంజౌతా 'ఎక్స్ప్రెషన్' ప్రయత్నిస్తున్న మా జర్నలిస్ట్ బుద్దా వారు -
పద గోళీ లాడుతో సమస్యల తో 'పూ' రణం గావిస్తున్న మా గోలీ హుమచ్చాస్త్రీ వారు - (హనుమ కీ స్త్రీ కి పొత్తు ఎట్లా అవుతుంది సినబ్బా అని హాశ్చర్య పోయా మొదట వారి పేరు చూసి !) -
మా కథా మంజరి అయ్యవారు పద్యాలు పెట్టి టపాలు గట్టి సెహ భేషు గా బ్లాగ్ విహారం గావిస్తున్న వారు -( వారి బ్లాగు టెంప్లేటు సరిగ్గా లేక నేను కామెంట లేక పోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి - టెంప్లేటు మార్చండి మహాప్రభో అని చెప్పినా ప్రయోజనం లేక పోయే :)
రమ్యంగా కుటీరాన అంటూ గులాబీ 'ఔట్లు' కూడా కావాల్సి వస్తే పెలుస్తాం అంటూ అలుపెరుగక ఉన్న నీ , మా , హారిక గారు :)
కన్నీటి కథ ల తో కడివెడు కహానీ లతో సమ సమాజానికి అద్దం పట్టే వనజ వనమాలీ గారు -
దేశ విదేశాల్లో ని సంక్షోభ పరిస్థితుల కి చరమ గీతం గ్రహాల భ్రమణం తో ఆలాపిస్తున్న మా భ్లాగ్జ్యోతిష్ శర్మ గారు -
ఇట్లా ఊకదంపుడు వ్రాసుకుంటూ జిలేబి కూడా ఎనిమిది సంవత్సరాలు దరిదాపుగా కలగా పులగం గా , ఈ ఒక్క సబ్జెక్టే నేను తాకుతా అనుకోకుండా అట్లా అందరిని గెలుకుతూ , అప్పుడప్పుడు డక్కా మొక్కీలు తింటూ , కొండొక చొ ఐ డోంట్ లైక్ లతో చీవాట్లు తింటూ కాలం గడిపేస్తోంది :)
ఇంతకీ ఈ టపా టైటిల్ ఏమిటి ? ఈ టపా ఏమిటి ? అంతా గందర గోళం గా ఉందిస్మీ :)
బ్లాగ్దేశం లో ఉండాలంటేనే భయం గా ఉంది - దేశం విడిచి పోతా - జిలేబి
అయ్యరు ఖాన్ గారు నాకు బ్లాగ్దేశం లో ఉండాలంటే నే భయ్యం భయ్యం గా ఉందండీ జిలేబి రావు చెప్పింది అయ్యరు ఖాన్ తో .
అయ్యర్ ఖాన్ తన విశాలమైన చాతీ ని తడుముకోబోయి తానూ చాలా సీదా సాదా అయ్యర్ ఖాన్ మాత్రమె అని గుర్తు కొచ్చి
మై డియర్ జిలేబి రావు ! నా ప్యారీ పెండ్లామా ! మనమంతా సాదా సీదా బ్లాగ్ దేశ వాసులం ! మనం అట్లాంటి మాటలు చెప్పలేం " చెప్పారు అయ్యర్ ఖాన్ గారు .
మరి ఎట్లా ఈ బ్లాగ్ దేశం లో బతికేది ? రోజు రోజు కి వైషమ్యాలు కార్పణ్యాలు , భావాల మీద బావ ల మీద, మాట మీద , సారంగం మీద వచ్చే కామెంట్ల చూస్తూంటే నాకు మరీ విపరీతమైన భయ్యం వస్తోందండీ !
జిలేబి ! ఇంతకు మునుపు ఇట్లాంటి కామింటులు అంటే సై అంటే సై అనే కామింటులు లేవా ?
ఉండే వండి ! ఒక వైపు వారు మాత్రమె ఎగ సెగ డోస్ ఇచ్చె వారు ! కాని ఈ కాలం లో సై అంటే సై అని కౌంటర్ వేయటం ఎక్కువై పోయిందండి !
సో కౌంటర్ వేయటం కొట్టొచ్చినట్టు కనబడు తోందన్న మాట ! సరే రేపు నాకు బ్లాగ్దేశం లో ని మ్యాడ్ మీడియా వారి తో బ్లాగ్ముఖీయం ఉంది - దాంట్లో వీళ్ళ తాట వదిలిస్తా ! నీ తరపు గా నేను వాళ్లకి చెబ్తా ! మా జిలేబి రావు కూడా భయపడింది అని చెప్పాడు అయ్యర్ ఖాన్ !
జిలేబి రావు కళ్ళ లో కన్నీళ్లు సుళ్ళు తిరిగేయి ! ఈ బ్లాగ్దేశం ఎంత మారి పోయింది ! చ చ ! వేరే బ్లాగ్ దేశం కి వెంటనే వెళ్లి పోవాలి !
అయ్యర్ ఖాన్ తన సైజైన చాతీ తో జిలేబి రావుని అక్కునకి తీర్చుకున్నాడు !
బావా నా లో వంట జ్ఞానమే కొరవడెనని వడ్డింపు వాస్తేదో అంతగా లేనే లేదని అల్లం దోశ లతో సాంబారు లాగించ మంటే బావా, నేను మూగనై నీ బందీ నై పోయా !
ఆలోచనలకి రూపమీయ జిలేబి గుండు అని తటిల్లత లా జిలేబి పాకం నీరు కారి పోయే లేని పెసరట్ల తో తెలుగు వంట చేయ మంటే ఆలోచనలు అవాక్కై ఆముదాన్ని తాగె !
వ్యంగ్య వ్యాఖ్యల కారప్పూసల తో వడ్డించి టిఫిను ఖాళీ ప్లేటు పెట్టి తినమంటే అల్లం మిర్చీ గా మారి కాలుతుంటే మజ్జిగెరుగని మదికన్నీరే బ్లాగ్కాలువాయే !
అల్లంమొరబ్బా ని అభిమానిస్తే అదేదో నేరమని నా తలపుల కే రంకుగట్టి బావలతో సరసమని పదాలే వేరుగా పలికి పోపు పొడి వేయిస్తూంటే విస్తరాకుల విజ్ఞానమిదేనని వినమ్రత గా నవ్వుతా !
ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను అని సినీ కవి పాట . ! నిజంగానే అట్లా అయ్యింది జిలేబి పరిస్థతి ! మొన్న శర్కరి వారు సత్యనారాయణ వ్రతం గురించి గరికపాటి వారి ప్రసంగం వీడియో పెట్టి మనకు తెలిసిన సత్య నారాయణ వ్రతం కోరికలను ఈడేర్చేది . మరి గరిక పాటి వారేమో సత్యం గురించి మాట్లాడు తున్నారు మరి అంటే , అబ్బే మగరాయుళ్ళ కి ఆండోళ్ళ కి తెలిసినంత గా వీటి గురించి తెలీదండీ అని వ్రాయటం తో మొదలెట్టి ఆ పై గరిపాటి చేయని సత్యాని కి ఇంత విలువా ! ఇంత బిల్డ్ అప్ కూడానా అని వ్రాస్తే విన్న కోట వారు ఆయ్ మీరు గరిక పాటి వారి పాండిత్యాన్ని గరిక పోచ తో పోల్చడం సుతరామూ బావోలేదు సుమీ అని ధక్కా ఇచ్చారు ! శ్యామలీయం వారేమో పొరపాటు మాటన్నారు జిలేబిగారు అన్నారు ! అదిరి పడ్డా ! ఎరక్క పోయి కామేంటాను ఇరుక్కు పోయాను అనుకున్నా ! మరీ శర్కరి వారి కామింటు బాక్సు నింపడం కన్నా మనకు ఒక టపా వ్రాసేందుకు ('టపా' కట్టేందుకు ) అవకాశం దొరికింది సుమీ అని సంతోష పడి పోయా ! సత్యాన్వేషణ అన్నది కాలా కాలం గా ప్రతి జమానా లో నూ జరుగుతున్నదే. అయితే ఏది సత్యం అన్నది , ఇదే సత్యం అన్నది నిర్ధారణ గా , చెప్పలేనిది. ఇదే సత్యం అంటే అప్పటికి అదే సత్యం కాని దాని ఆవల మరో సత్యం ఉన్నది అన్నదే న ఇతి ! ఈ క్షణం సత్యం అనుకుంటే ఈ క్షణం మాత్రమె సత్యం ఆ పై క్షణం సత్య దూరం. మార్పు చెందనిది సత్యం అనుకుంటే మార్పు లేనిదే ఈ విష్ణు మాయ లేదు. గరిక సత్యం పాటి అవ్వొచ్చు నెమో గాని సత్యం గరిక పాటి కాలేదు. అది అయితే ఇక సత్యం వేరే ఉన్నట్టే లెక్ఖ . గరిక పాటి వారు చెప్పినది 'సత్యమైన' మాట - సత్య వ్రతం చెయ్య మనడం . సత్య మేవ జయతే అనటం తో ఋక్కు ఆగలేదు - మరో తోక తగిలించు కున్నది నానృతం అని కూడాను. ఋతగుం సత్యం పరం బ్రహ్మ అంటుంది ఋక్కు . ఇందులో సత్యానికి మరో తోక కూడా ను "ఋ" త ఎందుకా తోక ? ఇప్పటి దాకా నాకైతే అనుభవైక వేద్యం కాలేదు ( పుస్తక జ్ఞానం కాకుండా) ! నారాయణ సూక్తం 'నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా' అంటుంది ఆ 'పరం బ్రహ్మ' గురించి చెబుతూ ఎండిపోయిన గరిక మొనన ఉన్న పీత వర్ణ రంగులో అణు మాత్రమై అంటూ . క్వాంటం ఫిసిక్స్ గాడ్ పార్టికల్ వైపు పరుగెడు తోంది . ఇట్లాంటి నేపధ్యం లో ఒక్క వాక్యం లో వ్రాసినది ఆ వాక్యం . ఆ గరిక పాటి అన్నది బాగా అక్కడ కుదురుకున్న మాట అయి పోయింది ! సత్యం గరిక పాటి చేయదు. చేస్తే అది సత్యం కాదు. మరి ఏ పాటి చేస్తుంది ? తెలీదు ; ఈ పాటి చేస్తుంది అని తెలిస్తే అది సత్యదూరం. జిలేబి (హమ్మయ్య ! నేటికి ఒక టపా కట్టేసా:)
కృష్ణా జీ హౌ ఆర్ యు ? అడిగింది సత్య ! భామ వైపు చూసేరు శ్రీ కృష్ణుల వారు . ఈ సత్య అప్పుడెప్పుడో కాలం లో నరకాసురుడి ని సంహారం గావించి సత్యాన్ని నిలబెడితే జన వాహిని దీపావళీ తో ఆనంద పడి పోయేరు ! అప్పటి నించి జనవాహిని ప్రతి ఏటా ఈ దినాన్ని కాపీ కొట్టేసు కుంటూ దీపావళీ జరిపేసు కుంటోంది . ఈ కలియుగం లో అగర్వాల్ భాయీ లు , శ్రేష్ఠులు కలిసి దీపావళీ సమయాన్ని బిలియన్ డాలర్ మార్కెట్ గావించే సేరు కూడాను ! కాపీ కి ఇంత మహాత్మ్యం ఉంది ! అందరూ శ్రీ కృష్ణా రామా నీ లా నన్ను చేయ వయ్యా అని దండాల మీద దండాలు పెట్టేసు కుంటున్నారాయే ! ఈ జమానా లో అంతా కాపీ మాయం మయం ! కాపీ లేని జీవితం ఎట్లా ఉంటుంది స్మీ :) దీపావళీ భళీ 'జిలేబీయం ! అందరికీ దీపావళీ 'కాఫీ' కాంక్షల తో ! చీర్స్ జిలేబి
ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీలు ఎందుకు కావాలి ?
మా మీ మన అందరి 'రోలు కర్ర' శ్యామలీయం బ్లాగ్ మాష్టారు ( వీరిది వృత్తి పరంగా మాష్టారు ఉద్యోగం కాదు - మేధా జీవి ) ఓ కామెంటులో - ... ఈ రోజుల్లో జనానికి వినోదం కావాలి ... కాలక్షేపం సరుకు తప్ప మరేమీ పట్టని వారి సంఖ్యాబలం కారణం గా అలా కాలక్షేపం సరుకుల్ని పంచేందుకు తాపత్రయ పడే వారే ఎక్కువ (ఎడిట్)"
ఈ వ్యాఖ్య చదివాక - ఎందుకు ఈ కాలం లో ఎక్కువ మంది కాలక్షేపం కబుర్లు, సరదా గా సాగి పోయే విషయాలు తప్పించి కొద్ది పాటి సీరియస్ మేటర్ ని చదవటానికి ఉత్సుక చూపించడం లేదు ? అని పించింది .
మా అయ్యరు గారి తో ఈ మాటే అంటే ... జిలేబి నీ వయసు రోజుల్లో (అబ్బ వయసు రోజుల్లో అంటే నే జిలేబి కి చెక్కిళ్ళ గుబాళింపు ఎక్కువై పోతుంది మరి :)) రేడియో లో కూసింత ఏడుపు కథ లు వస్తే నే నీ కళ్ళ లో కన్నీరు జర జరా రాలి పోయేది గుర్తుందా ? అడిగేరు .
ఆలోచించా . అవును ఆ కాలం లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు . కష్టాలు నష్టాలు ఎట్లా ఉన్నా గృహ వాతావరణం లో ఉత్సుకత , హిందీ లో చెప్పాలంటే ఉమంగ్ భరీ లైఫ్ ! ఉమ్మడి కుటుంబాలలో ఉన్న మజా ఆ కాలం వారికే తెలుసు నెమో !
అంతే గాక ఇప్పటి బిజీ లైఫ్ బ్యాక్ ప్యాక్ బకరా బేబీ లైఫ్ అప్పట్లో ఎక్కడ ? ఉద్యోగమో సద్యోగామో గానిస్తే ఆ తరువాయి బాతాకానీ కి ఇంటి నిండా జనాలు ఇంటి చుట్టూతా వున్నవారంతా బంధువులే బాంధవ్యాలే. జీవన గతి , సరళి సుళువు గా సాగి పోయే రోజులు . రేడియో లలో నో మీడియా (అప్పటి కి లేదు కాబట్టి , పేపర్ల లో నో ) వినోదం కన్నా కన్నీ టి కధ లే ఎక్కువ . కాంట్రాస్ట్ బాగా కుదిరి పోయేది !
జీవన గతి లో కన్నా మిన్నగా కన్నీటి కథలు ఉంటె మన జీవితమే బెటరోయి అని పించే లా ఆలోచింప జేసేవి .
మరి ఇప్పటి మాట ఏమిటి ?
జీవనం హై ఫై లైఫ్ ! సిటీ వారి కథలు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పరు గె పరుగు . నిలబడి తీరిగ్గా ఆలోచించ టైం ఎక్కడ ?
ఇట్లాంటి జీవన గతి లో సో కాల్డ్ 'రిలేక్సేషన్ ' కోసం తపించి పోయే , విష్ణు మాయ లో పడి పోయిన మానవుడు !
ఆ ఉన్నంత కూసింత టైం వినోదానికి కాలక్షేపానికి ఏదన్నా ఉందా అని చూస్తున్నాడు .
మా ఏడు కొండల వెంకన్న లైఫ్ ని బిజి బిజీ చేసి, గజి బిజి చేసి పారే సాడు :) (విష్ణు మాయ మా వెంకన్న దే కదా మరి :)
సో , ఇట్లా ఆలోచిస్తే ఈ కాలపు మానవుడికి, బ్లాగ్ దర్శకులకు కావల్సినిది కాలక్షేపం ఖబుర్లు, బాతా ఖానీ బటానీ లు . ( ఈ టైటిల్లో మీకు ఎవరి బ్లాగు టపా అయినా గుర్తు కొస్తే అది జిలేబి ఊహాత్మకం గా పెట్టిన పేర్లే గాని వ్యూహాత్మకం గా పెట్టినవి కావు అని గుర్తు పెట్టు కోవాలి ! జేకే !)
సో ప్రియ బ్లాగ్ బాంధవుల్లారా ! మీ అభిప్రాయమేమిటి ఈ విషయం మీద ?
ఫుట్ నోట్ : జిలేబి కి అర్థం కాని విషయం ఒకటుంది ఈ కాలం లో కూడా కన్నీటి కుండల, వైషమ్యాల టీ వీ సీరియళ్ళు ఈ జిలేబి లని ఎందుకంత మరీ టీ వీ పెట్టె ముందు బందీ చేసి పారేస్తున్నాయి ? బ్లాగ్ లోకం లో ఉదాహరణ - వనజ వనమాలీ గారి కథలు )
మొత్తం మీద మరో అగ్రిగేటర్ డమాల్ ! బ్లాగిల్లు మూట కట్టే సారు మా 'స్టారు' శ్రీనివాసు గారు.
అదేమిటో ఈ తెలుగు బ్లాగు లోకాని కొచ్చిన ఖర్మ !
ఒక్కటొక్కటే బ్లాగులు మూత పడి పోతా ఉంటె , దానితో బాటు అగ్రిగేటర్ లు కూడా మూట కట్టేయ్యటం !
బ్లాగిల్లు శ్రీనివాసు గారు ఇచ్చిన కారణం - బ్లాగిల్లు కి అంత 'రెస్పాన్స్' రావటం లేదు అని .
బ్లాగులు వ్రాసే వాళ్ళు ఎందుకు వ్రాయటం లేదు అంటే ... అబ్బే అంత 'రెస్పాన్స్' రావటం లేదండీ అని.
ఇట్లా ప్రతి ఒక్కరు చూస్తా ఉంటె మిగిలిన వాళ్ళ కోసమే వ్రాస్తా ఉన్నట్టు ఉన్నారుస్మీ ! జేకే !
(ఈ మధ్య శ్యామలీయం వారి బ్లాగులో కామెంటి జేకే అంటే - జేకే అంటే ఏమిటి అని అడిగారు శ్యామలీయం వారు - అబ్బే జేకే తెలీక పోవటమేమిటి వీరి కి అనుకున్నా ! జేకే !)
ఏమండీ బ్లాగిల్లు శ్రీనివాసు గారు, కూడలి, మాలిక గట్రా వాళ్ళు ఏమి ఆశించి ఇంకా తమ అగ్రిగేటర్ లని నిలబెట్టి ఉన్నారు ?
మరో ఆలోచన వస్తుంది - అగ్రిగేటర్ ల ని పెట్టిన వారు - అగ్రిగేటర్ ని మరీ 'పెర్సనల్' గా చూస్తూ న్నారేమో అని ! బ్లాగులోళ్ళం మేమైతే బ్లాగులకి కామింటులు వచ్చాయా లేదా అని ఆతుర పడుతుంటాం గాని అగ్రిగేటర్ లు 'క్లిక్కులు' వచ్చేయా లేవా అని రోలు కర్ర రూలు కర్ర పట్టుకుని లెక్కెయ్యడం జేసి అగ్రిగేటర్ ని మత పెట్టేస్తే ఇక మా లాంటి బ్లాగులొళ్ళ కి వ్రాసే టపాల కి ఎక్కడ ప్రచారం ఉంటుంది ?
సో బ్లాగిల్లు శ్రీనివాసు గారు మీరు మళ్ళీ మీ అగ్రిగేటర్ ని త్వరతిం గా నే తెరవండి .
ఆ కామింటు ల సెక్షన్ ని హారం లా తయారు చెయ్యండి (exactly like 'haram' comment section) అప్పుడు చూడండి మీ అగ్రిగేటర్ కి వచ్చే హిట్లని :)
ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !
తెలుగు వారి కి సులభ శైలి లో మహా భారతాన్ని రంగనాయకమ్మ గారు అందించారు.
ఇందులో కథా పరం గా , అక్కడక్కడా వారి వ్యాఖ్యానాన్ని అందిస్తూ మూల మహాభారతానికి అతి దగ్గిరగా అచ్చ తెనుగులో మహా భారతాన్ని వీరు అందించారు .
దరిదాపుల్లో నాలుగు వందల పేజీ ల లో మహా భారతాన్ని ఎట్లాంటి 'భేషజాలు' , ఉత్కృష్ట ఉపమానాలు లేకుండా కథ ని కథావస్తువు ని యథార్థం గా అందించారు.
వారు అక్కడక్కడ కొట్టిన సెటైర్ నవ్వు తెప్పించ వచ్చు.
కొండొకచో వెటకారం గా అని పించ వచ్చు.
కూసింత వెగటు కలిగించ వచ్చు.
వీటన్నిటి ని పక్క న బెట్టి, ఒక మామూలు సాధారణ జన సమాజానికి ఈ మహా భారత కథ ఏమన్నా విలువల్ని అందిస్తాయా అని వారు ఎక్కు బెట్టిన బాణం మనల్ని ఆలోచింప జేస్తుంది.
వారి సైడు కామింటు లని పక్క న బెట్టి మహా భారతాన్ని ఆస్వాదించ వచ్చు.
సైడు కామింటుల తో సహా చదివితే తల తిరిగ వచ్చు. దానికి వారిని బాధ్యులని చేయ రాదు.
మహా భారతాన్ని ఇట్లాంటి కోణం లో నించి కూడా చూడ వచ్చు అనడానికి రంగనాయకమ్మ గారి పుస్తకం ఒక సర్వోత్క్రుష్ట మైన ఉదాహరణ.
చదవండి . ఆలోచించండి. అన్నింటినీ యధాతధం గా (వారి 'కిక్కుల'ని కూడా) తీసు కోవాల్సిన అవసరం లేదు.
ఈ మధ్య అదేమి విష్ణు మాయయో , గ్రహాల 'పాట్లో' ప్లాట్లో తెలీదు గాని సీనియర్ సిటిజెన్ అయిపోయారు గా ఇక ఇట్లాంటి జబ్బులన్నీ మామూలే అని జిలేబి కే రిటార్టు ఇచ్చె లా ప్రియ బాంధవులు తయారయ్యేరు ! అబ్బా ! జబ్బు పడి లేస్తే దాని మోజే వేరు ! ప్రశాంతత అనగా నేమి ! అని తెలియ వలె నన్న, అయ్యరు గారి తో సేవలు చేయించు కోవాలె అన్నా జబ్బు పడితే నే తెలుస్తుంది ! దేశం లో మళ్ళీ మొన్న వచ్చిన అమావాస్య పాట్లు గ్రహపాట్లు గురించి మళ్ళీ టపా వచ్చేసింది కూడాను మా బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి నించి . కాబట్టి నేను సరి కొత్త గా కొట్టాల్సిన టపా కూడా ఏమీ లేదు :) ఇక భారద్దేశం లో చాలా మంది తమ తమ అవార్డులను (కాగితా ల ముక్కలను, పథకాలను ) తిరిగి ఇచ్చ్చేస్తున్నారు . కాబట్టి నేను కూడా నాకు బ్లాగు లో ళ్లు ఇచ్చిన పథ కాలను అన్నిటినీ తిరిగి ఇచ్చేయా లను కుంటున్నా :) ఇప్పటి కి టపా కబుర్లు ఇంతేస్మీ :) చీర్స్ జిలేబి
అమెరికా లో స్కూలు బస్సు ఆక్సిడెంటు - ఇద్దరు పిల్లలు
బాలార్కుని మార్కు ఇది రాసేసుకో .
ఇండో నేషియా లో ఖాండవ దహనం గురువర్యా
రాసుకో - అగ్ని దేవుడు నెయ్యి కోసం చూస్తున్నాడు .
లెక్ఖ లయ్యేయా ?
ఓ లెక్ఖ బకాయి గురూ !
ఏమిటోయ్ ?
అమెరికా వాడు వడ్డీ రేటు పెంచు దామా వద్దా అని ఆలోచిస్తున్నాడట ....
హు హు హు ! వాడి శ్రాద్ధం దరి దాపుల్లో కి వచ్చేస్తోంది - అమెరికా ఎంబసీ వాడు తనకు వీసా ఇవ్వక పోవడం గుర్తు కొచ్చే స్వామీ వారికి - రాసుకో - మిధునం లో మిడి మిడి పాటు తప్పదు . ధనుస్సు లో శని ప్రవేశిస్తున్నాడు . అయ్యిందా లెక్ఖ ?
ఓ మోస్తరు అయినట్టే గురువు గారు !
ఓకే ! వీటన్నిటిని మన రీసెర్చ్ విభాగానికి పంపి తీక్షణం గా గ్రహ గతుల్ని వీటి కనుగుణం గా సంశోధించు !
అట్లాగే గురువరా !
రాబోయే కాలం లో ఏమి జరుగును గురువరా ? ఎనీ క్లూ ?
బిడ్డా ! రాబోయే కాల రహస్యం శ్రీవిద్యా రహస్యం ! అది అందరికి చెప్ప బడదు ! కాలం దాట గానే పేపర్లో వచ్చె అన్ని బ్యాడ్ న్యూస్ లు సంకలనం చేసుకుని రా నా దగ్గిరికి వాటన్ని టికీ మూలాలను గ్రహ గతులనించి నీకు లాగి చూపిస్తా :)
గ్రహ గతులు అన్నింటి నీ నిర్దారిస్తాయ్ అవన్నీ నీకు అర్థం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది - మొన్న అమావాస్య వచ్చింది చంద్రుణ్ణి చూసేవా ?
చంద్రుడు ఒట్టేసి కనబళ్ళేదు గురూ :)
శిష్యా ! నాకు నువ్వు తగిన పరమానందయ్య శిష్యుడవే !
జై బోలో గురు మహారాజ్ కీ ! జై జై జై! విజయీ భవ ! రాబోయే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏమి జరుగును గురు మహారాజ్ !
గుండు గురువు బవిరి గడ్డం తడివేరు ! - ఇరవై తొమ్మిదో తేది చెబ్తా నీకు ఆ రహస్యం :)
కశ్మీరీ శైవ సంప్రదాయం లో - సంక్షిప్త మైన సూత్రీకరణ కాబడ్డ ప్రత్యభిజ్ఞా హృదయం -అభినవ గుప్తుని శిష్యుడైన క్షేమ రాజ క్రోడీ కరించిన కృతి . అభినవ గుప్తుడి కాలం పదవ శతాబ్దం అని ఒక నిర్ధారణ . ఆ ప్రకారం చూస్తే ఈ క్షేమ రాజ ఆ కాలపు వాడై ఉంటాడు .
చిన్ని చిన్ని పదాలతో మేరు సమాన మైన భావాన్ని ఈ పుస్తకం లో చూడ వచ్చు .
కామెంటరీ లేకుండా చదవటం నా వరకైతే బెటర్ .
కాని అందులోని 'nuances' ని తెలుసుకోవా లంటే వ్యాఖ్యానం/భాష్యం చదవకుండా అర్థం కాదేమో . బ్రహ్మసూత్రముల లా ఇదీ సూత్రీ కరించ బడిన పుస్తకమ్.
ఆ కాలం లో అన్నీ సూత్ర రూపం లో చెప్పడం ఆనవాయితీ !
(దానికి భాష్యం/వ్యాఖ్యానం/వ్యాఖ్యానం పై మరో వ్యాఖ్యానం చెప్పు కోడా నికి వేరు వేరు కాలం లో వారి శిష్యులు మళ్ళీ మళ్ళీ పుడతా రనుకుంటా వాటికి అర్థం తెలుసు కోవడానికి, అర్థం చేసుకోవడానికి,, పరమార్థం చెప్పు కోడానికి . జేకే ! (అంతా కాలమహిమ ! విష్ణు మాయ యాయే మరి !) -
మొదటి సూత్రం తో నే మతి పోతుంది ; certainly you will be taken to a different dimension later on !
Enjoy!
చితిహి స్వతంత్రా విశ్వసిద్ధి హేతుహు !
ప్రతి - ప్రత్యక్ష
అభి - ఇప్పుడే (హిందీ లో अभी ఇందులో నించే వచ్చిందే మో )
జ్ఞాన - జ్ఞానం
హృదయం - The heart of
ప్రత్యభిజ్ఞ - Recognition
(The heart of (secret of) 'Recognition')
ప్రత్యక్షం గా ఇప్పటి కిప్పుడే జ్ఞానమైన హృదయం . An Heart that has realized in the 'Now'.
పురాతన కాలం నించి ఈ ప్రశ్న వేధిస్తో నే ఉంది . వేధిస్తో నే ఉంది ; ఇంకా ఒక ఒకే నిర్ధారణ కి రాలే !
ఆత్మ ఉందంటూ కొందరు , లేదంటూ ఇంకొందరు వాదిస్తూ నే ఉంటున్నారు .
దీనికి తోడు జోదు ఆ సో కాల్డ్ 'పరమాత్మ :) కలడు కలండనే వాడు కలడో లేదో అంటూ సందేహం వెలిబరుస్తూనే మహా భాగవతం రాసి మన మొఖాన పడేసి కుదేసి టా టా చెప్పి తా చక్కా పోయాడు పరంధాముని సన్నిధికి అంటూ ఒక పుణ్యాత్ముడు :) మళ్ళీ ఇక్కడా ఆత్మే పుణ్యాత్ముడు , పాపాత్ముడు గట్రా :)
ఆత్మ కి అసలు రూపం లేదు ; ఎక్కడ ఉంది అని మన కష్టే ఫలే వారి లా వివేక చూడామణి ని పట్టు కు ఈది, (ఇదేమన్నా గోదావరి యా ఈ తటం కని పిస్తే , ఖచ్చితం గా ఆ వైపు మరో తటం ఉందని అనుకోవడానికి :)) ఈది కోశాల కోణాల ని కొన లని పట్టు కోవడానికి 'బాహుబలి' ప్రయత్నం చేస్తున్నారు !
మరి కొందరేమో యోగః అంటూ జోగాడుతూ ఆ సో కాల్డ్ ఆత్మా వారిని సందర్శించ డానికి శీర్షాశనాలు వేస్తున్నారు .
మరి కొందరేమో , స్వామీ వివేకా నందా వారికీ జెయ్ అంటూ మన నరేంద్ర మోడీ వారి లా (ఈ నరేంద్ర మోడీ పేరు ఎందుకు జిలేబి అంటే , బ్లాగార్పీ రేటింగు కోసం అని బ్లాగ్ రీడర్లు చెబుతారు కాని జిలేబి అది ఒప్పుకోదు !) దరిద్ర నారాయణ్ సేవ లో కర్మ యోగం లో మునిగి తేలి ఆత్మ దర్శనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు .
మరి కొందరేమో , హూ యాం ఐ అంటూ తల గోక్కుంటూ బుర్రె తడుముకుంటూ దీర్ఘాలోచనలో పడి ఆత్మా ఎక్కడ ఉన్నావా అసలున్నావా అంటూ బవిరి గడ్డం తడివేసు కుంటున్నారు.
వీటి మధ్య లో నగర జీవనం లో క్రిందా పైనా పడి నోటి బువ్వ కి చేతి పని కి ఏమైనా పొత్తు కుదురుతుందా అంటూ సగటు మానవుడు ,తనకున్న కొద్ది పాటి సమయం లో గణపతి బప్పా మోరియా అంటూ రెండు చెంపలు వేసేసుకుని , గుంజిళ్ళూ తీసేసు కుని వచ్చేస్తోంటే , సో కాల్డ్ 'శాస్త్ర పారంగతులు ' అసలు శాస్త్రం లో విగ్రహారాధన ఉందా అంటూ తర్కించి తర్కించి శుష్కించి శుష్కించి అలసి సొలసి నిదుర పోయి లేసి ఆహా కల గంటిని అంటూ ఇదియేరా పరమాత్మ తత్త్వం అంటూ సెటిల్ అయి పోతున్నారు .
ఏమిటో , జిలేబి నాకు ఒక్క ముక్కా అర్థం కావడం లేదంటారా !
అంతా మాయ ! విష్ణు మాయ ! అంటూ జిలేబి చక్కా వెళ్లి పోతుంది !
అబ్బబ్బా , ఈ ఆత్మా వారికి అంత టెక్కు ఎందుకో ? ఉంటె , ముందుకొచ్చి నేనే అని జేప్పోచ్చు గా ?
ఊ హూ ! చస్తే రాడు, రాదు - చస్తే గాని రాడు, రాదు, ముందుకి అదే ఏమి చావడం అంటే వెతుక్కో జిలేబి ఏది చావాలో అంటూ ఉపనిషత్తుల వారు (వీరు డైరెక్ట్ గా చెప్పరు గాక చెప్పరు - ఉపనిషత్తుల వారిది ఎప్పుడూ ఇండైరేక్ట్ మార్కెటింగ్ టెక్నీక్ :) ముక్తాయించి ఆయ్ ఇక మరో ఉపనిషత్తు కి వెళదామని చక్కా వెళ్లి పోతారు !
ఇక మిగిలింది ఈ కాలపు స్వామీ వారలు, మహారాజ్ లు , వీళ్ళు కాలాని కి తగ్గట్టు ఏది కావాలో అది చెప్పుకుంటూ టైం పాస్ టీం పాస్ చేసి వారికి తగిన జ్ఞాన బోధ ఇంకొంచం గట్టి వారైతే తరుణో పాయ మంత్రం జెప్పి నీ తంటాలు నువ్వు పడవోయ్ జిలేబి అని చక్కా ఆ హిమాలయాల కేసి తిరిగి దండం పెట్టేసు కుంటారు !
ఇక హిమాలయాల మాట అంటారా ? 'కాలా కాలం' గా వీటన్నికి సాక్షీ భూతం గా (ఈ సాక్షీ భూతం ఏమిటి మధ్య లో !) నిలబడి గంగై , సుగంగై , ఆకాశ గంగై , సాగరమై , మేఘమై, నీలి మేఘమై , ఘనీ భూతమై ( మళ్ళీ భూతం ) , హోరై, జోరై , వానై వరదై , మళ్ళీ హిమమై , మళ్ళీ ......
హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)
అక్కడక్కడా చెదురు ముదురు గా తెలుగు బ్లాగు లోకం లో టపాలు రాద్దామని, వీలైతే తమకు తెలిసిన దానిని నలుగురుకి షేర్ చేసుకుందామని గట్రా 'సద్భావన' తో ఉన్న బ్లాగు మణులు, మాన్యులు బితుకు బితుకు మని నేటి టపా రాద్దామా వద్దా అని డైలమా లో పడి సరే పోనీ ఈ దురద వదిలితే పోయేదా ఏదో ఒకటి రాద్దా మని నిర్ణయించు కని కీ బోర్డ్ పట్టేరు , టపా రాసి హమ్మయ్యా ఇవ్వాల్టికి మనం రాసే సాం - ఏడుకొండల వాడా వెంకట రమణా నా టపాలు 'హ్యాక్' కాకుండా చూడు సామీ అంటూ పెరుమాళ్ళ కి నమస్కారం పెట్టి పబ్లిష్ బటన్ నొక్కేరు .
అంతలో బ్లాగు భూతాలూ , పెను భూతాలూ, లిటిల్ రాస్కేల్స్, బిగ్ 'భ్రాతర్స్' , టైనీ 'త్విట్టర్స్' ఆవులింతలు బెట్టి ముసుగు తన్ని నిదుర పోదామా లేక బ్లాగు లోకం మీద పడి కస మిస కామింట్ల తో కుదేద్దామా అని మళ్ళీ ముసుగులు పెట్టు కునేయి .
అంతలో వాళ్ళ బాస్ అందర్నీ 'జర నిద్ర లేవండహే' అని అదమాయించి తానూ టపాలకి కామెంట్లు బరకడానికి సంసిద్ధురా లయ్యింది.
అగ్రిగేటర్ ల లో కామింట్ల వరదలు తయారయ్యేయి .
కుక్కా !
నక్కా !
నంగ నాచి
ఓసీ శూర్పణఖ !
బద్మాష్ !
ఆంద్రోళ్ళ ఆగడాలు
తెలంగాణా తిట్లు
నువ్వా నేనా
సై అంటే సై
బ్లాగు భూతాలూ, రాస్కేల్స్ గుంభన గా నవ్వు కునేయి . టపాలు రాస్తారర్రా :) చూడండి మీ టపాల కన్నా పెద్ద పెద్ద కామింట్లు పెడతాం అంటూ 'బద్మాష్' అంటూ అరిచేయి .
వాళ్ళ బాస్ అందరికి ఆర్డర్ పడే సింది - ఒరేయ్ బడుద్దాయిలు, అందరూ ఓ పదో పరకో పేర్లు పెట్టు కొండర్రా మీలో కొందరు పొగుడుతూ రాయాలి . మరి కొందరు తెగుడుతూ రాయాలి . మరి కొందరు బండ 'బూట్ల' తో తల తన్నేలా కామింటా లి .
సై అంటే సై అనేయి కామింటు కామినులు, భూత ప్రేత పిశాచాలు :)
హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులో కామేంటోళ్ళం టే నే నాకు భయ్యం :)
చీని చీనాంబరాలు ధరించి అని ఆ కాలం లో గొప్ప గా చెప్పే వాళ్ళం. ఈ మధ్య గ్లోబలైజేషన్ గోల లో చీని చీనాంబరాలు ఎక్కడ చూసినా అక్కడ .
పాపం చీనా వాడు కొంత ఇల్లు సర్దు కుంటామని ఇల్లు కొంత సర్ది తే , ఆ సేతు హిమాచల పర్యంతం అన్నట్టు అటు జప్పాను వాడి నించి ఇటు అమెరికా వాడి దాకా అందరి జాటర్ డమాల్
కొందరు మానిక్ మండే అంటే , మరి కొందరు బ్లాక్ మండే అని గీతాలాపన చేసేరు .
బ్లడ్ బాత్ ఆన్ దలాల్ స్ట్రీట్ అంటూ మా హిందూ 'వార్' చెప్పేరు .
ఒక్క రోజులో వెయ్యిన్ని ఆరు వందల పాయింట్లు జాటర్ డమాల్ అవడం ప్రపధమం . ( అంటే, ఇకమీదట ఎప్పుడైనా జాటర్ డమాల్ అయితే దీనికి పై బడే అన్నీ పడతాయని అనుకోవాలేమో మరి :) బెంచ్ మార్క్ ?)
ఏడు లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో హుళు హుళు క్కి అయి పోయిందట :) ఇంతకీ ఈ దస్కం ఎవరి జేబులో కెళ్ళి ఉంటాయి ? అమెరికా వాడి ఇంటికి మళ్ళీ చేరి పోయి ఉంటాయా ? సమాధానం లేని ప్రశ్న :)
సరే మన జైట్లీ వారేమో అబ్బే , మన దేశం సర్దేసు కుంటుంది అని వాక్రుచ్చేరు .
మా ఆర్ బీ ఐ రాజన్ గారేమో జిలేబి చీర్సు చెబితే చెప్పును గాని నేను మాత్రం చీర్స్ చెప్పనే చెప్పను అనేసేరు - రీజేర్వ్ బ్యాంక్ చీర్ లీడర్ కాదోయ్ అంటూ .
సందులో సడే మియా అంటూ వడ్డీ రేటు మార్పు కి కొంత కామా పెట్టేరు .
ఈ స్టాకు మార్కెట్టు గోలలో మామూలు విషయమై పోయిన ది - కమాడిటీ మార్కెట్ - పదహారు సంవత్సరాల ప్రాయం కోల్పోయింది :) (పదినారు వయదినిలే అంటూ ఇక మనం పాట పాడేసు కోవచ్చు )
మధ్య లో రూపాయి భేతాళుడు నాదారి ఎడారి నా పేరు బికారి అంటూ మళ్ళీ మొదలెట్టేడు !
వీటన్నిటికి కారణం గ్రహ పరిస్థితులే అని నొక్కి వక్కాణిస్తూ న్నారు బ్లాగ్ జ్యోతిష్యులు :)
రాబోయే సెప్టెంబర్ 'మహీ'నా లో 'మహీ' మీద గామా రేస్ విపరీతం గా వస్తున్నాయంటా ; దానికి ముందస్తు గా ఇవన్నీ 'శుభ' సూచకాలు కని పిస్తున్నాయ్ (అట :)
జిలేబి మొన్న స్వామీ వారితో సెల్ఫీ మేళ మాడేవు కదా దాని పర్వ్యసానమే ఇది అని మరి కొందరు 'మెట్టియల్' విరిచేరు కూడన్నూ :)
జిలేబి ఇప్పుడు కూడా చీర్సేనా అంటే ఏమి చెప్పడం
జాటర్ డమాల్ అయినా చీర్సు చీర్సే :) జిలేబి జిలేబి యే !
విచ్చేసిన వారందరికీ శుభోదయం. ఈ కళ్యాణ సేవ తదుపరి స్వామీ వారితో సెల్ఫీ సేవ ప్రారంభ మగుతుంది .
మీ మీ మోబైళ్ళ తో పద్మావతీ మంగ తాయారు సమేత స్వామీ వారితో సెల్ఫీ దిగాలనుకున్న వాళ్ళందరూ తలో వెయ్యిన్నూట పదహార్లు కౌంటర్లో చెల్లించి రశీదు పుచ్చుకోవాల్సిందని మనవి .
ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ భక్త జనవాహిని కౌంటరు మీద పడింది .
కౌంటరు కలెక్షను మొదలయ్యింది :)
ఆ హా ఒకా నొక కాలం లో మీ మోబైళ్ళు కి నో ఎంట్రీ . ఆ పై స్విచ్ ఆఫ్ మోడ్ ; ఆ పై సైలెంట్ మోడ్ ;
The current trend is "selfie" mode :) Mod "I" ndia :)
స్వామీ వారు , అమ్మ వారలు కూడా మరింత సింగారించు కునేరు. సెల్ఫీ లో మనం బాగా కనబడాలి కదా మరి :
స్వామీ వారి తో సెల్ఫీ దిగండి . మీ జీవితాన్ని శుభకరం గా మలచు కోండి .
మీకు మొబైలు లేదా ? no problem.
పక్కనే సామ్సంగ్ వారు 'స్వామి సంఘ్' అనే సరికొత్త మేడ్ ఇన్ ఇండియా 'ఇండీ' మొబైల్ షాప్ కూడా తరిచేరు . అందులో కొనుక్కోవచ్చు . స్టేటు బ్యాంకు వారి పన్నెండు నెలల ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంస్టాల్ మెంట్ ఆఫర్ కూడా ఉంది .
అట్లాగే ఐఫోన్ వారి 'ఐపద్మిని' అనే సరి కొత్త ఇండీ మొబైల్ కూడా ఉందండోయ్ .
ఆఫర్ ఆఫర్ ఆఫర్ !
బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీ మేడ్ ఇన్ ఇండియా మోబైళ్ళు కూడా ఉంది
ఆ ఇంతకీ దేముడు రాయిలో ఉండాడా ? రప్పలొ ఉండాడా ?
కనిపిస్తాడా ? కనిపిం చడా ?
నమ్మకుమున్న వాళ్ళ కె కనిపిస్తాడా ?
ఓయ్ ! మీరు నాస్తికులు . ఛీ ఛీ పో పో ! మీకు వాడు కనిపించడు !
'ఓయ్ ! నిజంగా వాడే ఉంటె , నమ్మకమున్నా లేకున్నా కనిపించాలి కదా ఉంది, ఉన్నాడు, ఉన్నది అంటే నమ్మకానికి అతీవల కనిపిం చాలీ గదా ?
ఆయ్ ! నో నో నో ! నువ్వు నాస్తికురాలివోయ్ ! నీకు కనిపించడు ;
సరే ఆస్తికా ! అస్తు ! ఇంతకీ నీ దేముడు విగ్రహంలో , రాయి లో ఉండాడా ? దానికేమైనా శాస్త్రం గట్రా ఉందా అని నిరూపణ ఉందా ?
శాస్త్రం మనిషి వ్రాసిందోయ్ ! ఆ పై వాడు ఉన్నాడు అన్నది నిజమైతే, మనిషి వ్రాసిన శాస్త్ర నిరూపణ ఉంటె ఏమిటి ? లేకుంటే ఏమిటి ?
ఆయ్ ! అట్లా కాదు నిరూపణ కానిదే ఉన్నాడా లేదా అన్నది సత్య దూరం కాదు ! కాబట్టి శాస్త్ర నిరూపణ కావాల్సిందే
నాస్తికుడు బుర్ర గోక్కున్నాడు !
వీళ్ళ పిండా కూడు ! ఉన్నాడు అంటారు ! ఉన్నాడు అన్న వాణ్ని గొప్పగా సర్వాంతర్యామి అంటారు ! రాయి లో ఉండాడు ,రప్పలొ ఉండాడు , నీలో ఉండాడు, నాలో ఉండాడు మనం దరిలో ఉన్నాడు అంటారు ! మళ్ళీ క్రేజే ఆస్తికాస్ , యు సి, మళ్ళీ నిరూపణ కావాలి అంటారు !
అబ్బ ! నాస్తికత్వమే బెష్టు ! లేదు ! తంటా వదిలే! వెతికితే ఉంటాడు; నీ నమ్మకాన్ని బట్టి కనిపిస్తాడు గట్రా ఇఫ్ బట్ నో స్టేట్మెంట్ లు లేవు !
అబ్బబ్బా, అయ్యరు వాళ్ ఈ మధ్య మరీ పిచ్చ పిచ్చ గా ఉందండీ ! చెప్పా మా అయ్యరు గారి తో !
ఏమోయ్ నీకొచ్చిన 'కష్టం' ? అయ్యరు గారు హిందూ పేపర్ లో మోడీ వర్సెస్ ఆల్ (ఇందులో తర తమ బేధం లేకుండా అన్ని పార్టీలు ఉన్నట్టున్నాయిస్మీ:)) న్యూస్ ఐటెం చదువుతూ తలెత్తి కనబడని కళ్ళద్దా లని సరి జేసుకుని చూసేరు .
అసలు ఏమీ పనిపాటా లేకుండా పోయిన్దండీ చెప్పా అయ్యరు గారి తో ;
ఎందుకోయ్ ?
"ఈ మధ్య బ్లాగు లోకం లో సరి ఐన టపాలు ఏమీ రావడం లేదండీ ! టపా కంటెంటు మారినా కామింట్లలో శ్రీ మాన్ రామ ప్పెరుమాళ్ వారు నలిగి పోతున్నారు ; సీతమ్మ బెబ్బెలు పడి పోతున్నట్టు ఉన్నది నా కైతే " చెప్పా వారితో
దానికీ నీ పిచ్చ పిచ్చ కి సంబంధం ఏమిటోయ్ ? బుర్ర అర్థమయ్యీ అర్థమవనట్టు ఊపి ప్రశ్నిం చేరు అయ్యరు గారు .
ఆ ఏముందండీ, అందరూ గోదారి పుష్కరాలంటూ వెళ్ళా మంటూ టపాలు రాస్తున్నారు ; మనమూ వెళ్దా మా " అడిగా అయ్యరు గారి తో .
ఇదిగో జిలేబి నాకు 'ఇరుక్కుం' ఇడమే వైకుంటం' ! ఆ గోదారి దాకా పోవాలంటే ఈ శాల్తీ ఎంత కష్ట పడాలి నీకు తెలిసిందే కదా అన్నారు అయ్యరు గారు ;
అబ్బబ్బా ! ఈ పడక్కుర్చీ వేదాంతా నికి ఏమి గాని .. ఈ మధ్య బ్లాగు లోళ్ళు పట్టు మామీ నీకు వేరే వేలై ఏమీ లేదా అని అడిగే రండీ మళ్ళీ చెప్పా .
వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ముంది జిలేబి ? నువ్వు ఉబుసుపోక తెల్లారి గట్రా నేను వేడి వేడి గా వేసిన కాఫీ లాగించేసి బ్లాగుల మీద పడతావు ! అట్లా జూస్తే, పెందరా ళే పని పాటా లేకుండా ఉన్న వాళ్ళే కదా ఇట్లా టపాలు , కామింట్లు గిలుకుతారు అని జనం అనుకుంటారు - చెప్పేరు అయ్యరు గారు .
అబ్బ ! ఈ అయ్యరు గారు ఎప్పుడైనా నాకు వత్తాసు పలుకుతారా ; ఊహూ నెవెర్ ఇన్ యువర్ లైఫ్ జిలేబి అని అనుకో కుండా ఉండలేక పోయా .
"ఓ సౌభాగ్యవతి నీవు పతియే ప్రత్యక్ష దైవమని , పతి పాదపద్మములే కైవల్య పదమని, పతి సేవే మోక్ష మార్గమని ఎరిగిన ఇంతివని, అయ్యర్ సేవ చేసుకొనే వృద్ద నారిశిరోమణివని "
అయ్యరు గారు పడక్కుర్చీ నించి క్రింద పడి పోతారేమో అన్నంత గా బిగ్గరగా నవ్వేరు .
"జిలేబి నీకు జనాలు ఇంత మంచి తాకీదు ఇచ్చెరా ! ఔరా ! కాల మహిమ కాకుంటే, అయ్యరు తెల్లారి గట్రా నిద్ర లేచి కాఫీ పెట్టి జిలేబి ని నిద్ర లేపి , బీ లేజీ నించి వాయగొడితే, ఆ జిలేబి పంచ దశ లోకం లో కామింటులు కొడుతూ టీం అండ్ తిండి పాస్ చేస్తూ బతి కేస్తోంటే , పతి సేవే మోక్ష మార్గమని ఎరిగిన ఇంతి వని, వాణీ , నా జిలేబి నిన్ను పొగిడేరా " అంటూ ఆ పై మూర్చ పోయేరు !
అయ్యరు వాళ్ అయ్యరు వాళ్ అంటూ వారి మొగమ్మీధ వారిచ్చిన కాఫీ ఏ కొంత చల్లా! ఆ వేడి కి ఉలిక్కి పడి
"జిలేబి! ఇది నిజంగా కాల మహిమయే ! -" అంటూ మరో మారు నొక్కి వక్కాణిం చేరు !
పోనీ లెండి అయ్యరు గారు ! ఆ క్రెడిట్ లో మీకో సగం ఇచ్చేస్తా ! చెప్పా - ఈ మధ్యే అర్ధనారీ తత్వమే అద్వైత మని ఒక మహానుభావులు వారు సెలవిచ్చిన వైనం గుర్తుకొచ్చి !
అందరి నీ ఝాడిం చాలి అంటే దండించాలి అని జిలేబి రాణీ వారి ఆజ్ఞ మేరకు రాజు అందరిని దండిం చేడు .
దండిం చిన తరువాయి జిలేబి రాణీ వారి ని రాజా వారు అడిగేరు - మహారాణీ ! అందరిని దండిం చాలి అన్నావ్ ! నీ మాట మేరకు దండిం చేశా ! ఇంతకీ అందరినీ ఎందుకు దండిం చ మన్నట్టు ?
జిలేబి మహా రాజ్ఞి ఇలా సమాధానమిచ్చింది .
"ప్రభూ ! అందులో ఘన కార్యం చేసిన వారు ఉన్నారు నీతి నియమాలకి తావివ్వక ; అంటే మీ రాజ్యం లో నీతి విలువలు వలువలు వదిలిన స్త్రీ లా ఉంది .
కార్యానికి ప్రతి దండనం తామే ఇచ్చిన వారు ఉన్నారు , మీ రాచరికాన్ని మన్నించక దండాన్ని తమ చేతుల లో తీసుకుని ;
ఘన కార్యానికి వత్తాసు ఇచ్చిన వాళ్ళూ ఉన్నారు - దానిని ఖండించక .
ఆ ఘన కార్యాన్ని చూసీ చూడనట్టు ఉన్న వారూ ఉన్నారూ , వారికి బుద్ధి చెప్పక, మీ రాజా వారి ఆస్థానానికి ఆ సంఘటన గురించి చెప్పక .
ఇట్లా అందరూ దండనార్హులే . అని జెప్పి ...
ఆ పై ఆ ఘన కార్యానికి మూల భూతమైన కల్లు తాగిన వారూ ఉన్నారు . వారు కల్లు తాగడానికి మూలం మీ రాజ్యం లో మీరు అనుమతించిన కల్లు దుకాణా లు ...
సో, రాజా ఇందులో మీకూ భాగముంది అని రాజా వారి వైపు చూసింది జిలేబి రాణి .
రాజా వారు తలూపేరు .
ఆ పై వారి రాజ్యం లో దండోరా వేయిం చేరు - కల్లు దుకాణా లన్నీ బందు అని .
June 30 and July 1 will give us the finest conjunction of the year. Tuesday and Wednesday of this week will see Venus and Jupiter passing close to each other. The two celestial bodies are said to be coming so close that they will be just one-third of a degree apart from each other. Many people think of it as a rare incident but it's not. It happened last year in August and will happen again in October this year. But there are few things that make this conjunction specifically rare. Read on to grab some facts on the two planets coming close: 1. The coming close of the celestial bodies is called "Conjunctions". 2. This conjunction is the second meet between the two planets.
o The first happened on August 18, 2014.
o The second will happen today (June 30) and tomorrow.
o The third conjunction will take place on October 26. 3. This second series of conjunction is considered the best in 15 years. 4. Venus will appear six times brighter than Jupiter. 5. Venus is 56 million miles or 90 million Kilometres away from earth. 6. Jupiter on the other hand is 550 million miles or 890 million Kilometres away from earth. 7. The distance between the two is a lot but to the sky watchers it will give an optical illusion of the two planets being extremely close. 8. Both the planets will separate and start to move away from each other after July 1. 9. On July 18, the two planets will be welcoming crescent moon to form a group of three planets.
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...